LOADING...

08 Mar 2023


OYO వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ వివాహానికి హాజరైన సాఫ్ట్‌బ్యాంక్ CEO, Paytm బాస్

ఓయో హోటళ్ల సీఈఓ రితేశ్‌ అగర్వాల్‌ వివాహం గీతాన్షా సూద్‌తో దిల్లీలోని తాజ్‌ ప్యాలెస్‌ హోటల్‌లో మంగళవారం ఘనంగా జరిగింది.

చాబహార్ ఓడరేవు ద్వారా ఆఫ్ఘనిస్తాన్‌కు 20,000 మెట్రిక్ టన్నుల గోధుమలను పంపనున్న భారత్

అఫ్ఘనిస్తాన్‌కు 20,000 మెట్రిక్ టన్నుల గోధుమల్ని సరఫరా చేయబోతున్నట్లు భారత్ మంగళవారం ప్రకటించింది . ఇండియా-సెంట్రల్ ఏసియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ తొలి సమావేశం జరిగిన వెంటనే అఫ్ఘాన్‌కు భారత్ గోధుమలు సరఫరా చేయడానికి నిర్ణయం తీసుకుంది.

IPL 2023 : లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ కొత్త జెర్సీ

RPSG గ్రూప్ యాజమాన్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ మంగళవారం తమ కొత్త జెర్సీని లాంచ్‌ చేసింది. ఈ టోర్నమెంట్ తాజా ఎడిషన్ మార్చి 31 నుండి ప్రారంభమవుతుంది .

బస్సులో టీమిండియా క్రికెటర్ల హోలీ సెలబ్రేషన్స్

అహ్మదాబాద్ టెస్టును గెలవాలని టీమిండియా శ్రమిస్తోంది. ఇండోర్‌లో ఓటమి తర్వాత అహ్మదాబాద్ టెస్టులో విజయం సాధించి ఐసీసీ టెస్టు చాంఫియన్ షిప్‌కు అర్హత సాధించాలని టీమిండియా భావిస్తోంది. కాగా, టీమ్ భారత టీం బస్సులోనే హోలీ సంబరాలు చేసుకున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సమన్లు జారీ చేసిన ఈడీ

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కుమార్తె, భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) నాయకురాలు కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మార్చి 9 (గురువారం) తమ ముందు విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది.

ODI Tickets: 10 నుంచి విశాఖ వన్డే టికెట్ల అమ్మకం

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈనెల 19న జరిగే రెండో వన్డే టికెట్ల అమ్మకం ఈనెల 10 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆఫ్‌లైన్‌లో ఈనెల 13 నుంచి టికెట్లు విక్రయాలు జరగనున్నాయి. ఆఫ్ లైన్ లో టికెట్ల అమ్మకాల కోసం నగరంలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

మహిళల కోసం ట్రిలియన్ డాలర్ల టెక్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఇడా టిన్

టెక్ ప్రపంచంలో పురుషులతో సమానంగా మహిళలు పాల్గొనడం లేదనే అభిప్రాయం చాలామందికి ఉంది. అయితే ఒక స్త్రీ, స్త్రీల కోసం నిర్మించిన సామ్రాజ్యం నేడు ట్రిలియన్ డాలర్లకు ఎదిగింది.

వచ్చే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌కు విద్యుత్‌ సవరణ బిల్లు

విద్యుత్ సవరణ బిల్లు- 2022ను ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. విద్యుత్‌ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇప్పటికే బిల్లుపై పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసింది.

Women's Day: భారత రాజకీయాల్లో అత్యంత శక్తిమంతమైన మహిళా నాయకురాళ్లు వీళ్లే

పురుషాధిక్య భారతీయ సమాజంలో మహిళలకు రాజకీయాల్లో పరిమిత సంఖ్యలో అవకాశాలు దక్కాయి. కాలానుగూనంగా వస్తున్న మార్పుల నేపథ్యంలో కొందరు నాయకురాళ్లు స్వశక్తితో ఎదిగి దేశ రాజకీయాల్లో తమదైన ముద్రవేశారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం: తెలుగు సినిమా దశను మార్చిన హీరోయిన్స్

ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా తెలుగు సినిమాలో మహిళల పాత్రను, తెలుగు సినిమాను మార్చిన మహిళల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

క్రీడారంగంలో నారీమణుల సేవలకు సెల్యూట్

భారత క్రీడారంగంలో పురుషులతో సమానంగా మహిళలు దూసుకుపోతున్నారు. బాక్సింగ్ నుంచి క్రికెట్ దాకా భారత మహిళలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ క్రీడల్లో భారత తొలి మహిళలు ఎవరో ఓసారి చూద్దాం.

మార్చి 8న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

07 Mar 2023


ఎడ్‌టెక్ పరిశ్రమ పతనానికి దారితీస్తున్న BYJU'S, upGrad నిధుల సంక్షోభం

ఎడ్‌టెక్ సంస్థ upGrad దాని అనుబంధ సంస్థ 'క్యాంపస్'లో 30% మంది ఉద్యోగులను తొలగించింది. upGrad ఈ ఏడాది ఉద్యోగులను తొలగించడం ఇది రెండోసారి.

అధికారికంగా విడుదలైన 2024 హ్యుందాయ్ కోనా SUV

దక్షిణ కొరియా తయారీసంస్థ హ్యుందాయ్ తన కోనా SUV 2024 వెర్షన్‌ను వెల్లడించింది. ఇది పెట్రోల్, ఎలక్ట్రిక్ వాహన విభాగాల్లో అందుబాటులో ఉంది. ఈ సంవత్సరం చివరి నాటికి మార్కెట్లో అందుబాటులోకి వస్తుంది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఇలా జరుపుకుందాం

ప్రతి సంవత్సరం మార్చి 8 న, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సమాజంలో మహిళలు సాధించిన సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక విజయాలను జరుపుకుంటారు. మహిళల సమానత్వం గురించి తెలియపర్చడంతో పాటు హక్కులపై దృష్టిని తీసుకురావడం ఈ రోజు లక్ష్యం.

వేలిముద్ర ఆధారిత ఆధార్ authentication గురించి తెలుసుకుందాం

UIDAI వివిధ రకాల ఆధార్ authentication అందిస్తుంది. వేలిముద్ర ఆధారిత ధృవీకరణ అనేది ఎక్కువగా ఉపయోగించే పద్ధతి. వివిధ లావాదేవీల కోసం తక్షణమే ఆధార్ హోల్డర్ల గుర్తింపును ధృవీకరించడంలో ఇది సహాయపడుతుంది. వేలిముద్ర ఆధారిత లేదా ఏదైనా ఇతర బయోమెట్రిక్ సంబంధిత సేవను UIDAI దాని అధికారిక కేంద్రాల ద్వారా అందజేస్తుంది.

7,000 కోట్ల విలువైన రుణాలను ముందస్తుగా చెల్లించిన అదానీ గ్రూప్

US షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ 10 లిస్టెడ్ కంపెనీలలో మార్కెట్ నష్టాలకు దారితీసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు రుణాన్ని తగ్గించడంపై దృష్టి సారించడం ప్రారంభించింది.

ట్రావెల్: పోర్చుగల్ పర్యటనలో చేయకూడని తప్పులు

ఘనమైన చరిత్ర, అందమైన ప్రదేశాలు, కలుపుగోలుగా ఉండే జనాలు పోర్చుగల్ దేశాన్ని సందర్శించేలా చేస్తాయి. మీ పర్యాటకంలో మంచి అనుభవాన్ని పొందడానికి పోర్చుగల్ పయనమవ్వండి.

సంచలన రికార్డును బద్దలుకొట్టనున్న రవిచంద్రన్ అశ్విన్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటికే పలు రికార్డులను బద్దలు కొట్టాడు. మార్చి 9న ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరిగే చివరి టెస్టులో మరో అరుదైన రికార్డుపై అశ్విన్ కన్నేశాడు.

తెలంగాణ లాంటి పనితీరును కనబరుస్తున్న రాష్ట్రాలకు కేంద్రం సహాయం చేయాలి: కేటీఆర్

2022 నాటికి అన్ని భారతీయ రాష్ట్రాలు తెలంగాణతో సమానంగా అభివృద్ధి చెంది ఉంటే భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించి ఉండేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

క్రేటమ్ గురించి విన్నారా? దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి

క్రేటమ్ మొక్క గురించి మీకు తెలుసా? బహుశా తెలిసి వుండదు. ఈ మొక్క ఎక్కువగా ఆగ్యేయాసియా దేశాలైన థాయ్ లాండ్, మలేషియా, ఇండోనేషియా దేశాల్లో దొరుకుతుంది.

భారతీయులకు వీసా ప్రక్రియ మరింత సులభతరం చేయనున్న రష్యా

భారతదేశం-రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఎంత దృఢమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం కోసం వీసా విధానాన్ని సడలించి, సరళీకృతం చేయబోతున్నట్లు రష్యా ప్రకటించింది. దీంతో రష్యా వెళ్లాలలనుకునే భారతీయులకు వీసా ప్రక్రియ మరింత సులభతరం కానుంది.

ఏడాదిలో రెండోసారి తగ్గింపు ధరతో అందుబాటులో ఉన్న టెస్లా మోడల్ S, X

ఎలోన్ మస్క్ సంస్థ ఎలక్ట్రిక్ వాహన తయారీసంస్థ టెస్లా USలో మోడల్ S, X కార్ల ధరలను తగ్గించింది. ఈ ఏడాది జనవరి తర్వాత దేశంలో వాహనాల ధరలు తగ్గించడం ఇది రెండోసారి. ఇప్పుడు, మోడల్ S $89,990 (సుమారు రూ. 73.6 లక్షలు) నుండి ప్రారంభమవుతుంది, అయితే మోడల్ X ప్రారంభ ధర $99,990 (దాదాపు రూ. 81.8 లక్షలు).

'భారత్‌లో విదేశీ జోక్యాన్ని కోరడం సిగ్గుచేటు'; రాహుల్‌పై బీజేపీ ధ్వజం

భారత్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు అమెరికా, యూరప్‌ జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది.

జర్మన్ ఓపెన్‌కు మాజీ వరల్డ్ నెంబర్ వన్ దూరం

మాజీ వరల్డ్ నెంబర్ వన్ కిడాంబి శ్రీకాంత్ జర్మన్ ఓపెన్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్మమెంట్ నుంచి తప్పుకున్నాడు. మంగళవారం నుంచి ఈ టోర్నీ క్వాలిఫయర్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి.

ఆర్ఆర్ఆర్ కథ మొత్తం నాటు నాటు పాటలో ఉందంటున్న రాజమౌళి

రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ మూవీకి అంతర్జాతీయంగా ఎన్ని ప్రశంసలు అందుతున్నాయో అందరూ చూస్తూనే ఉన్నారు. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్లో కూడా ఉంది.

కోడి కత్తి కేసు: జగన్ రావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశం

2018లో విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కోడి కత్తితో దాడి జరిగిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్ తప్పకుండా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.

2024లో మార్కెట్లోకి రానున్న ఆపిల్ ఐఫోన్ SE 4

నాల్గవ తరం SE మోడల్‌కు BOE-తయారీ చేసిన OLED ప్యానెల్ లభిస్తుందని ELEC పేర్కొంది. నాల్గవ-తరం SE కోసం BOE-తయారీ చేసిన OLED ప్యానెల్ ధర సుమారు $40 (దాదాపు రూ. 3,300).

టెన్నిస్ స్టార్ జొకోవిచ్‌కు మరోసారి 'వాక్సిన్' షాక్

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. అమెరికాలో ఈనెల 19 నుంచి జరగనున్న ఇండియన్ వెల్స్‌తో పాటు మయామి టోర్నిల్లో జొకోవిచ్ పాల్గొనాల్సి ఉంది. అయితే కరోనా టీకా తీసుకోని టెన్నిస్ దిగ్గజం జకోవిచ్ మరోసారి టోర్నికి దూరం కావాల్సి వచ్చింది. టీకా వేసుకోని విదేశీయులను తమ దేశంలోకి అమెరికా అనుమతించడం లేదు.

ప్రేరణ: అవకాశం రావట్లేదని బాధపడే వారు విజయాన్ని ఎప్పటికీ పొందలేరు

మీలో చాలా టాలెంట్ ఉంది. మీరు చాలా బాగా పాడగలరు, మీరు చాలా బాగా రాయగలరు. కానీ మిమ్మల్ని ఎవ్వరూ గుర్తించట్లేదు. ఎవ్వరూ కూడా మీకు అవకాశాలు ఇవ్వట్లేదు. ఇక్కడ తప్పంతా మీది, ఎందుకంటే ఎవ్వరూ ఎవ్వరికీ అవకాశాలు ఇవ్వరు.

సోషల్ మీడియా సన్సేషన్‌గా హార్ధిక్ పాండ్యా.. నాదల్, ఫెదరర్‌ను వెనక్కినెట్టాడు

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే టీమిండియా స్టార్ హార్ధిక్ పాండ్యా సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. గత నెలలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు టీమిండియాకు నాయకత్వం వహించి అద్భుత విజయాన్ని అందించారు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేనప్పుడల్లా జట్టు పగ్గాలను అందుకుంటున్నాడు. సోషల్ మీడియా ఫ్టాంట్ ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రీడాకారుడిగా రికార్డుకెక్కాడు.

నాగాలాండ్ ముఖ్యమంత్రిగా ఎన్‌డీపీపీ అధినేత నీఫియు రియో ​​ప్రమాణ స్వీకారం

నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డీపీపీ) నేత నీఫియు రియో ​​మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు.

ఆర్థిక లక్ష్యాల కోసం ఉద్యోగ కోతలు ప్రారంభించిన మెటా

ఫేస్ బుక్-పేరెంట్ సంస్థ మెటా ఈ వారంలో మరిన్ని ఉద్యోగ కోతలు గురించి కంపెనీ ఆలోచిస్తుందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. నవంబర్‌లో 11,000 ఉద్యోగులను అంటే సిబ్బందిలో 13% మందిని తొలగించారు. మెటా 2022 ఆర్థిక అనిశ్చితి, పడిపోతున్న ప్రకటన ఆదాయంతో టిక్‌టాక్‌తో పోటీ పడుతుంది.

గ్రీన్ హైదరాబాద్: ఫ్లై ఓవర్ల కింద ఆక్సిజన్ పార్కుల ఏర్పాటు

గ్రేటర్ హైదరాబాద్‌లో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే నగరంలో పచ్చదనాన్ని పెంపొందించేదుకు అనేక అర్బన్ పార్కులను ఏర్పాటు చేసిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా మరో అడుగు ముందుకేశాయి.

అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్ థియేటర్ లో ఎల్ ఈ డీ స్క్రీన్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఏషియస్ సినిమాస్ థియేటర్ తో భాగస్వామ్యం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఏఏఏ పేరుతో అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్ థియేటర్ ను ప్రారంభించనున్నారు.

IND vs AUS: ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవడానికి టీమిండియా రెడీ

ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో చోటు దక్కాలంటే టీమిండియా చివరి టెస్టు నెగ్గాల్సిందే. మార్చి 9 ఆస్ట్రేలియా-ఇండియా మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో టీమిండియా ఉంది. మూడో టెస్టులో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

బి ఎం డబ్ల్యూ X3 xDrive20d M స్పోర్ట్ vs మెర్సిడెస్-బెంజ్ GLC, ఏది కొనడం మంచిది

జర్మన్ వాహన తయారీ సంస్థ బి ఎం డబ్ల్యూ భారతదేశంలో తన X3 SUV xDrive20d M స్పోర్ట్ వేరియంట్‌ను విడుదల చేసింది. మార్కెట్లో ఇది మెర్సిడెస్-బెంజ్ GLC మోడల్‌తో పోటీపడుతుంది.

జిమ్ కి వెళ్ళకుండా కండలు పెరగాలంటే యోగా తో సాధ్యం

యోగా.. మన భారతదేశంలో ఎప్పటి నుండో అలవాటుగా ఉన్న వ్యాయామం. యోగా వల్ల మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం మన సొంతమవుతుంది. అంతేకాదు జిమ్ కి వెళ్ళకుండానే కండలు పెంచుకోవచ్చు.

దిల్లీ మద్యం కుంభకోణం: హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై అరెస్ట్

దిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్ విచారణలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. పాలసీని రూపొందించి అమలు చేస్తున్నప్పుడు ఇతర నిందితులతో జరిగిన సమావేశాల్లో పిళ్లై 'సౌత్ గ్రూప్'కు ప్రాతినిధ్యం వహించారని అధికారులు తెలిపారు.

జాబ్ స్కామ్ కేసు: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం

ఉద్యోగాల కుంభకోణం కేసులో సోమవారం రబ్రీ దేవిని విచారించిన సీబీఐ అధికారులు, మంగళవారం బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌‌తో పాటు ఆయన కుమార్తె మిసా భారతిపై ప్రశ్నల వర్షం కురిపించారు.

IND vs AUS: ఆహ్మదాబాద్ టెస్టులో రాహుల్-గిల్‌ని ఆడించాలి : రికి పాటింగ్

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ టీమిండియా వెళ్లాలంటే నాలుగో టెస్టును తప్పక గెలవాలి. అయితే తుది జట్టుపై టీమిండియా తర్జనభర్జనలను పడుతోంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య మార్చి 9న నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. తొలి రెండు టెస్టులో విఫలమైన రాహుల్‌ను తప్పించి, యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ కి అవకాశం కల్పించింది. మూడో టెస్టులో గిల్ పూర్తిగా నిరాశపరిచాడు.

వన్డేల్లో షకీబ్ అల్ హసన్ సంచలన రికార్డు

వన్డే క్రికెట్‌లో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ సంచలన రికార్డును సృష్టించారు. ఇంగ్లండ్ తో జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో షకీబ్ అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. 71 బంతుల్లో 75 పరుగులు చేయడంతో పాటు నాలుగు వికెట్లను తీశాడు. దీంతో వన్డే క్రికెట్లో 300 వికెట్లు పూర్తి చేసిన తొలి బంగ్లాదేశ్ ప్లేయర్‌గా షకీబ్ చరిత్రకెక్కాడు.

ప్రధాని మోదీ సమక్షంలో మేఘాలయ సీఎంగా కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం

నేషనల్ పీపుల్స్ పార్టీ అధినేత కాన్రాడ్ సంగ్మా మంగళవారం మేఘాలయ ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రులుగా ప్రిస్టోన్ టైన్‌సాంగ్, స్నియాభలాంగ్ ధర్ ప్రమాణ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోంమంత్రి, అమిత్ షా, నడ్డా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

హోళీ: మీ ప్రియమైన వారికి ఇవ్వాల్సిన గిఫ్ట్ ఐడియాస్

పండగ అంటే పది మంది ఒకదగ్గర చేరి చేసుకునే సంతోషం. ఆ సంతోషాన్ని మరింత పెంచేవే బహుమతులు. హోళీ సందర్భంగా మీ ప్రియమైన వారికి మంచి మంచి బహుమతులు ఇవ్వండి.

కొత్త ట్విట్టర్ ఫీచర్లను ప్రకటించిన ఎలోన్ మస్క్

ట్విట్టర్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది అయితే ప్లాట్‌ఫారమ్‌లో వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి ఎలోన్ మస్క్ చేయని ప్రయత్నం లేదు. ఇప్పుడు ఈ వేదికకు కొన్ని కొత్త ఫీచర్లను సిఈఓ ప్రకటించారు.

పుష్ప ఫేమ్ జగదీష్ ప్రతాప్ నటించిన సత్తిగాని రెండెకరాలు టీజర్ రిలీజ్

పుష్ప సినిమాల్లో అల్లు అర్జున్ స్నేహితుడిగా కేశవ పాత్రలో నటించిన జగదీష్ ప్రతాప్, ఆ సినిమాతో ఎంతో పేరు తెచ్చుకున్నాడు. అంతకుముందు మల్లేశం సినిమాలో కనిపించినా పెద్దగా పేరు రాలేదు.

బాబర్‌ను విడిచే ప్రసక్తే లేదు : షోయబ్ అక్తర్

పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ లక్ష్యంగా విమర్శలు సంధిస్తున్న పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ జట్టు సారిథి బాబర్ ఆజమ్‌కు ఇంగ్లీష్ రాదని, ఆతడికి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని, అందుకే బ్రాండ్ కాలేకపోయాడనికి గతంలో షోయబ్ చేసిన విమర్శలు మరోసారి పెద్ద దూమారం అయ్యాయి.

మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను నడిపిన బిల్ గేట్స్

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, బిలియనీర్ బిల్ గేట్స్ ఇటీవల తన భారత పర్యటనలోని ఆసక్తికర అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను నడిపిన వీడియోను బిల్ గేట్స్ తన ఇన్ స్టాలో షేర్ చేశారు. తన క్లాస్‌మెట్, వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాను కలుసుకున్న సందర్భంలో ఇది జరిగింది.

ఆకాశాన్నంటుతున్న ధరలు, 30 సంవత్సరాల కనిష్టానికి పడిపోయిన భారతీయుల పొదుపు

అధిక ఇన్‌పుట్ ఖర్చుల నుండి తమ మార్జిన్‌లను కాపాడుకోవడానికి పరిశ్రమలు పెంచుతున్న ధరలను భారతీయులను ఇబ్బంది పెడుతున్నాయి. తక్కువ-మధ్య ఆదాయ జనాభా మీద ఎక్కువగా ప్రభావం పడుతుంది, వినియోగం తీవ్ర తగ్గుదలను చూస్తోంది, గృహా పొదుపులు మూడు దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయాయి.

WPL: మహిళలందరికీ ఉచిత ప్రవేశం.. బీసీసీఐ బంపరాఫర్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు బీసీసీఐ బంపరాఫర్ ప్రకటించింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా మార్చి 8 నాటి మ్యాచ్‌ను ఉచితంగా వీక్షించే అరుదైన అవకాశాన్ని కల్పించింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో గుజరాత్ జెయింట్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ మధ్య బుధవారం మ్యాచ్ జరగనుంది.

బిడ్డకు జన్మనిచ్చాక చర్మాన్ని, జుట్టును, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు టిప్స్

ప్రెగ్నెన్సీ అనేది అందమైన ప్రయాణం. ఆ తొమ్మిది నెల్లల్లో మీలో రకరకాల మార్పులు కలుగుతుంటాయి. ఐతే బిడ్డ పుట్టాక కొందరి శరీరాల్లో కొన్ని మార్పులు వస్తుంటాయి.

హెచ్3ఎన్2 వైరస్ కూడా కరోనా తరహాలోనే వ్యాపిస్తుంది; ఎయిమ్స్ మాజీ చీఫ్ హెచ్చరిక

దేశంలో హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎయిమ్స్-ఢిల్లీ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా హెచ్చరించారు.

ట్రావెల్: సందర్శన కోసం వేరే ప్రాంతం వెళ్ళిన ప్రతీసారీ ఆరోగ్యం దెబ్బతింటుందా? ఇలా చేయండి

ట్రావెలింగ్ కొందరికి బాగా ఇష్టముంటుంది. కానీ కొంతమందికి ట్రావెలింగ్ చేస్తుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. కొత్త ప్రాంతానికి వెళ్లగానే అలసిపోవడం, నీరసంగా మారిపోవడం జరుగుతుంటుంది.

ఎరిన్ హాలండ్‌‌ను చంకన ఎత్తుకున్నన్యూజిలాండ్ మాజీ క్రికెటర్

న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డానీ మోరిసన్ క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. తన అద్భుత బౌలింగ్‌తో మేటీ బ్యాటర్లను సైతం ముప్పుతిప్పలు పెట్టారు. ఇక ఐపీఎల్‌ టోర్నిలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యాఖ్యాతలలో కూడా డానీ ఒకరు. అలాంటి డానీ ఒక్కోసారి తన వింత ప్రవర్తనతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంటాడు

నేడు మేఘాలయ, నాగాలాండ్ ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం; ప్రధాని మోదీ హాజరు

ఎన్‌డీపీ చీఫ్ నీఫియు రియో, ఎన్‌పీపీ చీఫ్ కాన్రాడ్ సంగ్మా నాగాలాండ్, మేఘాలయ ముఖ్యమంత్రులుగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

WPL: ముంబై ఇండియన్స్‌కి విజయాన్ని అందించిన నాట్ స్కివర్ బ్రంట్

మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్‌పై 9 వికెట్ల తేడాతో ముంబై గెలుపొందింది. ముంబై స్టార్ ఓపెనర్ హేలీ మాథ్యూస్ (77), నాట్ స్కివర్ బ్రంట్ (55) చెలరేగడంతో బెంగళూర్‌కు మళ్లీ నిరాశ తప్పలేదు. వీరిద్దరూ విధ్యంసకర బ్యాటింగ్‌తో ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించారు. నటాలీ స్కివర్-బ్రంట్ బౌలింగ్‌లో రెండు వికెట్లతో సత్తా చాటింది.

కేజీఎఫ్ వివాదం: వెంకటేష్ మహా మాటలకు నవ్విన డైరెక్టర్ సారీతో వచ్చాడు

సినిమాల్లో మహిళా పాత్రల గురించి సాగిన రౌండ్ టేబుల్ సమావేశంలో దర్శకులు ఇంద్రగంటి మోహనకృష్ణ, బీవీ నందినీ రెడ్డి, శివ నిర్వాణ, వెంకటేష్ మహా, వివేక్ ఆత్రేయ పాల్గొన్నారు.

ఉత్తరాఖండ్‌లో కార్చిచ్చు: 107 హెక్టార్ల విస్తీర్ణంలో అడవి దగ్ధం

ఉత్తరాఖండ్‌లో గత కొన్ని నెలలుగా అడవుల్లో మంటలు చెలరేగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఉత్తరాఖండ్‌లో 107 హెక్టార్లకు పైగా అటవీ విస్తీర్ణం కార్చిచ్చు వల్ల దగ్ధమైనట్లు రాష్ట్ర అటవీ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గర్హ్వాల్ ప్రాంతంలో 40.68 హెక్టార్లు, కుమావోన్ ప్రాంతంలో 35.55 హెక్టార్ల విస్తీర్ణం దగ్ధమైనట్లు తెలుస్తోంది.

WPL 2023: బెంగళూరును చిత్తుగా ఓడించిన ముంబాయి ఇండియన్స్

ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ను చిత్తు చేసిన ముంబాయి ఈసారి బెంగళూరును చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ముంబాయి, ఆర్సీబీపై 9 వికెట్ట తేడాతో ఘన విజయం సాధించింది.

కేజీఎఫ్ - వెంకటేష్ మహా కాంట్రవర్సీ: సారీ అంటూ వీడియో

ఒకానొక ఇంటర్వ్యూలో కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా మాట్లాడుతూ, కేజీఎఫ్ సినిమా మీద చాలా కామెంట్లు చేసారు. ఆ సినిమాలోని రాఖీ భాయ్ పాత్ర మీదా, అమ్మ పాత్ర మీదా అనరాని మాటలు అన్నాడు.

మార్చి 7న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.