LOADING...

12 Jun 2023


వారాహి యాత్రకి ముందు జనసేనాని ధర్మ పరిరక్షణ యాగం 

వారాహితో వాహనంతో ఈ నెల 14 నుంచి జనసేనాని ప్రచార పర్వాన్ని ప్రారంభించనున్నారు. అయితే ధర్మ పరిరక్షణ, ప్రజా క్షేమాన్ని, ఆకాంక్షిస్తున్న జనసేన చీఫ్, మంగళగిరిలోని పార్టీ స్టేట్ ఆఫీసులో ఈ యాగాలను నిర్వహిస్తున్నారు.

కేరళ: వీధి కుక్కల దాడిలో 11ఏళ్ల మూగ బాలుడు మృతి 

కేరళలోని కన్నూర్ జిల్లాలోని ముజప్పిలంగడ్‌లో దారుణం జరిగింది. వీధి కుక్కల దాడికి 11ఏళ్ల మూగ బాలుడు బలయ్యాడు.

ఈగిల్ టైటిల్ తో రవితేజ కొత్త సినిమా: సంక్రాంతి బరిలో మాస్ మహారాజ 

మాస్ మహారాజ రవితేజ సినిమాల స్పీడు పెంచుతున్నాడు. ధమాకా విజయం తర్వాత మంచి జోష్ లో ఉన్న రవితేజ, వెంటనే వాల్తేరు వీరయ్య సినిమాలో కనిపించాడు. ఆ తర్వాత రిలీజైన రావణాసుర నిరాశ పరిచింది.

మరో ఐదు రోజులు నిప్పులు చిమ్మనున్న భానుడు.. జాడలేని వర్షాలు

సగం జూన్ నెల గడుస్తున్నా దేశంలో ఇప్పటికీ వర్షాల జాడ లేదు. వానలు సంగతి అటుంచితే ఇంకా ఎండల వేడి తగ్గనేలేదు. పగటి ఉష్ణోగ్రతలు ఏమాత్రం తగ్గలేదు.

రాష్ట్రాలకు మూడో విడత పన్నుల పంపిణీ; రూ.1.1 లక్షల కోట్లను విడుదల చేసిన కేంద్రం 

ప్రభుత్వ పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వాటాను సోమవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలకు వేళాయేరా.. రిటర్నింగ్‌ ఆఫీసర్ గా జమ్మూ కశ్మీర్‌ సీజే

భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్య్లూఎఫ్ఐ) ఎలక్షన్స్ ను జూలై 4న నిర్వహించాలని భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేసింది.

Lionel Messi detained: పోలీసుల అదుపులో లియోనల్ మెస్సీ..ఎందుకంటే!

ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు.

వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఇక ఈజీగా పని అయిపోతుంది!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నిత్యం సరికొత్త ఫీచర్లను యూజర్ల కోసం పరిచయం చేస్తోంది. ముఖ్యంగా వాట్సాప్ ఇటీవల కాలంలో తీసుకొస్తున్న కొన్ని ఫీచర్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.

అసోంలో దారుణం: మహిళా బీజేపీ నాయకురాలు జోనాలి నాథ్ హత్య! 

అసోం బీజేపీ నాయకురాలు జోనాలి నాథ్ గోల్‌పరా జిల్లాలో అనునాస్పదస్థితిలో శవమై కనిపించారు.

హైదరాబాద్ ఆదాయపు పన్ను ఆఫీస్‌కు బాంబు బెదిరింపు.. భయం భయంలో అధికారులు

హైదరాబాద్ మహానగరం బషీర్ బాగ్ పరిధిలోని ఆదాయపన్ను శాఖ కార్యాలయానికి సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు బాంబు బెదిరింపులు చేశారు.

ప్రేరణ: నీ చుట్టూ ఉన్న ప్రపంచం మారాలంటే నీ ఆలోచనలు మారాలి 

మీ ఆలోచనలను బట్టి మీ ప్రవర్తన ఉంటుంది. మీరు దేని గురించైతే ఆలోచిస్తుంటారో అదే ప్రపంచం మీ చుట్టూ తయారవుతుంది.

మద్దతు ధర కోసం కురుక్షేత్ర-ఢిల్లీ జాతీయ రహదారిని దిగ్బంధించిన రైతులు 

పొద్దుతిరుగుడు పంటను కనీస మద్దతు ధరకు(ఎంఎస్‌పీ) కొనుగోలు చేయకూడదన్న హర్యానా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కురుక్షేత్రలో రైతులు సోమవారం మహాపంచాయత్ నిర్వహించారు.

హ్యుందాయ్​ కొత్త ఎస్​యూవీకి బ్రాండ్​ అంబాసిడర్​గా గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా

హ్యుందాయ్ మోటర్ఇండియా కొత్త ఎస్‌యూవీ ఎక్స్ టర్ ను జులై 10న లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ తరుణంలో హ్యుందాయ్ మోటర్ క్రేజ్ ను పెంచడానికి సరికొత్త నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్ మంత్రికి ఝలక్ ఇచ్చిన స్టాఫ్.. పేషీ సిబ్బందికి 8 నెలలుగా జీతాల్లేవ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శాలరీస్ లేటుగా మాత్రమే వస్తున్నాయని అందరూ అనుకుంటున్నారు. కానీ ఎనిమిది నెలలుగా అసలు జీతాల ఊసే లేదనే విషయం తాజాగా వెలుగులోకి రావడం గమనార్హం.

దిల్లీలో బైక్ ట్యాక్సీలకు బ్రేక్ వేసిన సుప్రీంకోర్టు 

క్యాబ్ అగ్రిగేటర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బైక్-టాక్సీ అగ్రిగేటర్‌లు రాపిడో, ఉబర్‌ బైక్ సర్వీసులను నడపడానికి అనుమతిస్తూ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది.

ఆదిపురుష్: హనుమంతుడి పక్కన సీటు ఖరీదుపై నిర్మాణ సంస్థ క్లారిటీ 

ప్రభాస్ రాముడిగా రూపొందిన ఆదిపురుష్ చిత్రాన్ని ప్రదర్శించే ప్రతీ థియేటర్లో ఒక ఖాళీ సీటును వదిలివేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

తీవ్రంగా మారుతున్న బిపోర్‌జాయ్ తుపాను; అరేబియాలో ఎగిసిపడుతున్న రాకాసి అలలు 

తూర్పు-మధ్య అరేబియా సముద్రం మీదుగా బిపోర్‌జాయ్ తుపాను గత ఆరు గంటల్లో 7కి.మీ వేగంతో ఉత్తర దిశగా అత్యంత వేగంగా కదులుతోందని ఐఎండీ తెలిపింది.

హైదారాబాద్ క్రికెట్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. ఉప్పల్‌లో నో వరల్డ్ కప్ మ్యాచ్!

ఈ ఏడాది ఆక్టోబర్‌లో వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే వన్డే ప్రపంచ కప్ కు సంబంధించిన షెడ్యూల్ ను ఐసీసీ సోమవారం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

బిపోర్‌జాయ్‌ తుపానుపై ప్రధాని హై లెవల్ మీటింగ్.. అప్రమత్తంగా ఉండాలని ఆదేశం

బిపోర్‌జాయ్‌ తుపాను అతి తీవ్ర రూపం దాల్చుతూ పెను ముప్పుగా రూపాంతరం చెందుతోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో తుపాను గుజరాత్ వైపే దూసుకెళ్తోంది. ఈ మేరకు భారత తీర ప్రాంతాలను అప్రమత్తం చేశారు.

రెండు పుస్తకాలు రాసిన నాలుగేళ్ళ పిల్లాడు: గిన్నిస్ రికార్డులో చోటు 

ప్రపంచ రికార్డులు సృష్టించడం తేలికైన విషయం కాదు. నాలుగేళ్ళ వయసులో ప్రపంచ రికార్డులో స్థానం సంపాదించుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వాయిస్ స్కామ్‌లు; తస్మాత్ జాగ్రత్త 

ఆధునిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ అనేది సాంకేతిక విప్లవం అని చెప్పాలి. ఏఐ వల్ల సాంకేతిక రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి.

ధోనీ వల్ల ఆ రెండు వరల్డ్ కప్‌లను గెలవలేదు.. యువరాజ్ వల్లే గెలిచాం : గంభీర్

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై మరోసారి గౌతమ్ గంభీర్ ఫైర్ అయ్యాడు. 2007, 2011 విజయాలు కేవలం ధోనీ వల్లే సాధ్యమైనట్లుగా అతడి పీఆర్ టీమ్ జోరుగా ప్రచారం చేసిందని, నిజానికి ఆ రెండు విజయాల్లోనూ యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించాడని గంభీర్ పేర్కొన్నారు.

భూమి వైపే రెండు భారీ గ్రహ శకలాలు.. ముప్పు లేదంటున్న శాస్త్రవేత్తలు!

రెండు భారీ గ్రహ శకలాలు, దాదాపు కిలోమీటరు వ్యాసార్థం కలిగినవి భూమివైపు దూసుకొస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ క్రమంలో వాటితో అంతగా ప్రమాదమేమీ లేదని, అవి భూమిని ఢీకొట్టలేవని ప్రకటించారు.

భీమా ఫస్ట్ లుక్: పోలీస్ ఆఫీసర్ గా ఉగ్రరూపంలో గోపీచంద్ 

మ్యాచో స్టార్ గోపీచంద్ విజయం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. ఈ మధ్య గోపీచంద్ హీరోగా వచ్చిన సినిమాలు బాక్సాఫీసు వద్ద ప్రభావాన్ని చూపలేకపోయాయి.

మా దేశంలో ఉన్న ఆ ఒక్క భారతీయ జర్నలిస్టు వెళ్లిపోవాల్సిందే: చైనా 

ఒక్క భారతీయ జర్నలిస్టు కూడా చైనాలో ఉండొద్దని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్: చైతన్య ఎక్కడంటూ నీహారిక పోస్టుపై కామెంట్లు పెడుతున్న నెటిజన్లు

మెగా ఇంట్లో పెళ్ళి సందడి మొదలైంది. మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ నిశ్చితార్థం, హీరోయిన్ లావణ్య త్రిపాఠితో జూన్ 9వ తేదీన జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.

శుభ్‌మాన్ గిల్‌కి షాకిచ్చిన ఐసీసీ.. టీమిండియాకు భారీ జరిమానా

డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడిన టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్లో ఓవర్ రేటు కారణంగా టీమిండియాకు ఐసీసీ భారీ జరిమానా విధించింది. మ్యాచు ఫీజులో వందశాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది.

రిజల్యూషన్ ప్రాసెస్‌ని కంట్రోల్ చేయనున్న గో ఫస్ట్ రుణదాతలు

గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ సంస్థ నియంత్రణ పూర్తిగా రుణదాతల చేతుల్లోకి వెళ్లింది. ఈ మేరకు దాఖలైన దివాళా పిటిషన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్.సీ.ఎల్.టీ) గతంలోనే ఆమోదించింది.

ధోనీ ఒక్కడే వరల్డ్ కప్ గెలిచాడా? మహిపై హర్భజన్ సింగ్ సెటైర్

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. దీంతో క్రికెట్ అభిమానులు మరోసారి మహేంద్ర సింగ్ ధోనీ నామస్మరణ చేస్తున్నారు.

ఆర్మీ జవాన్ భార్యపై వేధింపుల ఆరోపణలపై తమిళనాట దుమారం 

తమిళనాడులో 40 మందికి పైగా జవాన్ భార్యపై వేధింపులకు పాల్పడిన ఘటన తీవ్ర దుమారాన్ని రేపుతోంది.

టెలిగ్రామ్ లో కొవిన్ డేటా లీక్.. ఆధార్​, పాన్​ కార్డు వివరాలు అవుట్

ప్రముఖ దేశీయ మెసేజింగ్​ యాప్​ టెలిగ్రామ్​ లీకులకు గురైంది. ఈ మేరకు సదరు యాప్ లో ఆధార్​, పాన్​ కార్డు డేటా లీకేజీ జరిగినట్టు ఓ నివేదిక స్పష్టం చేసింది.

ఆదిపురుష్ యాక్టర్లకు కోట్లు గుమ్మరింపు: రెమ్యునరేషన్ వివరాలివే 

ప్రస్తుతం భారతీయ సినిమా ఇండస్ట్రీ చూపు మొత్తం ఒకే సినిమా మీద ఉంది. అదే ఆదిపురుష్. ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ కావడంతో టిక్కెట్ల అమ్మకాలు విపరీతంగా ఉంటున్నాయని తెలుస్తోంది.

అమెరికా కాంగ్రెస్‌లో రెండోసారి ప్రసంగించనున్న ప్రధాని మోదీ; తొలి భారతీయుడిగా రికార్డు 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 21 నుంచి జూన్ 24 వరకు అగ్రరాజ్యంలో పర్యటించనున్నారు.

సింగరేణి కార్మికులకు రూ.700 కోట్ల బోనస్ బొనాంజ.. దసరాకి చెల్లిస్తామన్న సీఎం

సింగరేణి ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం బోనస్‌ బొనాంజా ప్రకటించింది. వార్షిక లాభాల్లో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంస్థ రూ.2184 కోట్ల లాభాలను వచ్చినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఉద్యోగ, కార్మికులకు రూ.700 కోట్ల ప్రొడక్షన్ బోనస్ రాబోతోంది.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా సాధించిన రికార్డులపై ఓ లుక్కేయండి 

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో టీమిండియా పరాజయం పాలైంది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్లో జరిగిన ఈ మ్యాచులో 209 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయింది.

బాలీవుడ్ లో కంటే సౌత్ లోనే నెపోటిజం ఎక్కువ: ఉయ్యాల జంపాల హీరోయిన్ కామెంట్లు వైరల్ 

ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా మారిన అవికా గోర్, దక్షిణాది సినిమా మీద విపరీతమైన కామెంట్లు చేసింది.

అమెరికా: న్యూజెర్సీ రెస్టారెంట్‌లో 'మోదీ జీ థాలీ'; ఆ వంటకం ప్రత్యేకలు ఇవే 

జూన్ నెలాఖరులో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు సిద్ధమవుతున్నారు.

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్‌లో ఆస్ట్రేలియా సాధించిన రికార్డులివే..!

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్‌గా ఆస్ట్రేలియా అవతరించింది. పాట్ కమిన్స్ సారథ్యంలో టీమిండియాను 209 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చిత్తు చేసింది. ఈ ఫైనల్లో మొదటి రోజు నుంచి ఆసీస్ అధిపత్యం ప్రదర్శించింది.

బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం: చరిత్ర, తెలుసుకోవాల్సిన విషయాలు, పంచుకోవాల్సిన కొటేషన్లు 

ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం ప్రతీ ఏడాది జూన్ 12వ తేదీన జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం 2002లో ప్రారంభమైంది.

సరిహద్దులో డ్రాగన్ కవ్వింపులు.. భారీగా అణ్వస్త్రాలను పోగేసుకున్న చైనా 

భారత్‌ - చైనా దేశాల సరిహద్దుల్లో మధ్య గత కొంతకాలంగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. దీన్ని అదనుగా తీసుకుంటున్న డ్రాగన్ దేశం భారీ ఎత్తున అణ్వస్త్రాలను (న్యూక్లియర్ వార్ హెడ్స్ ను) పెంచుకున్నట్లు సమాచారం.

బిపోర్‌జాయ్ తుపాను బీభత్సం; ముంబై ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలపై ఎఫెక్ట్ 

అరేబియా సముద్రంలో బిపోర్‌జాయ్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. దీంతో ముంబైలోని విమాన కార్యకలాపాలు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దెబ్బతిన్నాయి.

జూన్‌ త్రైమాసికంలో 6-6.3 శాతంగా జీడీపీ వృద్ధిని అంచనా వేసిన మూడీస్

భారత ఆరిక్థ వ్యవస్థ జూన్‌ త్రైమాసికంలో 6 నుంచి 6.3 శాతం వృద్ధిని నమోదు చేసేందుకు అవకాశం ఉందని ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ సంస్థ మూడీస్ వెల్లడించింది. ఈ మేరకు తాము అంచనా వేసినట్లు ఆదివారం పేర్కొంది.

ఆ నిర్ణయం షాక్‌కు గురి చేసింది: సచిన్‌

టీమిండియాపై ఆస్ట్రేలియా గెలుపొంది టెస్టు ఛాంపియన్ గా నిలిచింది. దీంతో ఆస్ట్రేలియాపై ప్రశంసలు వెల్లువత్తున్నాయి. అదే సమయంలో భారత్ ఓటమిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మధు మంతెన పెళ్ళి వేడుకకు హాజరైన అల్లు అర్జున్, హృతిక్ రోషన్, ఆమీర్ ఖాన్; వైరల్ అవుతున్న ఫోటోలు 

బాలీవుడ్ నిర్మాత మధు మంతెన, యోగా గురువు ఐరా త్రివేదిల వివాహం ఆదివారం రోజు ముంబైలో జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ సెలెబ్రిటీలు హాజరయ్యారు.

వరి పంటకు వాతావరణ గండాలు.. అన్నదాతకు నీటి కటకటాలు

నానాటికీ భూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కారణంగా వరికి గండాలు అదే స్థాయిలో హెచ్చుతోంది. ఈ కారణంగా కోట్లాది భారత ప్రజలకు కావాల్సిన ఆహారం, జీవనోపాధికి ముప్పు తప్పేలా కనిపించట్లేదు.

హ్యాపీ బర్త్ డే గోపీచంద్: మ్యాచో స్టార్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాలు 

గోపీచంద్.. హీరోగా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత విలన్ గా పేరు తెచ్చుకుని మళ్ళీ హీరోగా కొనసాగుతున్న హీరో. గోపీచంద్ మొట్టమొదటి సినిమా తొలివలపు, 2001లో రిలీజైంది. థియేటర్ల దగ్గర ఈ సినిమా నిరాశ పర్చింది.

దూసుకొస్తున్న బిపోర్‌జాయ్ తుపాను; గుజరాత్ తీర ప్రాంతాల్లో హై అలర్ట్

తూర్పు-మధ్య అరేబియా సముద్రం తీరంపై బిపోర్‌జాయ్ తుపాను తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దూసుకొస్తున్న తుపాను మరికొద్ది గంటల్లో గుజరాత్ తీరాన్ని తాకనుంది.

సీనియర్లపై మండిపడ్డ గవాస్కర్.. వరల్డ్ కప్ గెలిచే మొఖాలేనా ఇవి?

డబ్య్లూటీసీ ఫైనల్‌లో టీమిండియా ఓడిపోవడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. టీమిండియా ఆటగాళ్లు ఔట్ అయిన విధానంపై సీనియర్లు మండిపడుతున్నారు.

ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీలో జాబ్ తెచ్చుకున్న 14ఏళ్ళ బాలుడు కైరాన్ క్వాజీ 

సాధారణంగా ఒక జాబ్ చేయడానికి ఇంత వయసు ఉండాలని చెబుతారు. తక్కువ వయసున్న వారిని ఉద్యోగాల్లోకి తీసుకోరు. కానీ వయసుతో సంబంధం లేకుండా ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కైరాన్ క్వాజీ జాబ్ తెచ్చుకున్నాడు.

కరీంనగర్: ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం

భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుకు ఘోర ప్రమాదం జరిగింది.

హనీమాన్ కి ఇండోనేషియా వెళ్లిన తమిళ వైద్యజంట.. ప్రమాదవశాత్తు సముద్రంలో పడి మృతి

పెళ్లై పట్టుమని 10 రోజులైనా కాలేదు, అప్పుడే ఈ నవ డాక్టర్ దంపతుల విషయంలో విధి కన్నెర చేసింది. కళ్ల ముందే ప్రజలకు సేవలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న యంగ్ కపుల్ పై యమపాశాలను ప్రయోగించింది.

హీరో ప్యాషన్ ప్లస్ Vs బజాజ్ ప్లాటినా 100.. రెండిట్లో ఏదీ బెస్ట్..?

దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హీరో మోటో కార్పర్ అప్‌డేట్ వర్షెన్ ప్యాషన్ ప్లస్‌ను తీసుకొచ్చింది. ఈ బైక్ త్వరలోనే లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ మోడల్ బజాబ్ ప్లాటినా 100కు గట్టి పోటినిస్తుందని మార్కెట్లో అంచనాలు వెలువడుతున్నాయి.

రామాలయాలకు ఉచితంగా ఆదిపురుష్ టిక్కెట్లు: కేవలం ఆ జిల్లాలో మాత్రమే 

ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ చిత్రం జూన్ 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.

తెలంగాణలో పునఃప్రారంభమైన పాఠశాలలు.. 41 వేల స్కూళ్లు, గురుకులాల రీ ఓపెన్

విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వేసవి సెలవులు నేటితో ముగిశాయి. దాదాపు 45 రోజుల విరామం తర్వాత బడి గంటలు మోగుతున్నాయి.

టెన్నిస్ చరిత్రలో రారాజు.. ఫ్రెంచ్ ఓపెన్ విజేత జొకోవిచ్

సెర్బియా ఆటగాడు, టెన్నిస్ దిగ్గజ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఫ్రెంచ్ ఓపెన్‌ను మూడోసారి సాధించి రికార్డును సృష్టించాడు.

అమెరికా: మేరీల్యాండ్‌లో కాల్పుల మోత; ముగ్గురు మృతి

అమెరికాలోని మేరీల్యాండ్‌ అన్నాపోలిస్‌లోని ఒక ప్రైవేట్ నివాసంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు.

జూన్ 12న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.

11 Jun 2023


స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోయి మెడనొప్పితో బాధపడుతున్నారా? ఈ చిట్కాలతో నొప్పిని తగ్గించేయండి 

ఇంట్లో మొబైల్ ఫోన్లకు, ఆఫీసుల్లో లాప్టాప్ లకు అతుక్కుపోవడం వల్ల మెడనొప్పి అందరికీ సాధారణ సమస్యగా మారిపోయింది.

తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే మాయాబజార్ విశేషాలు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో గొప్ప సినిమాల జాబితా తీసుకుంటే మొదటి వరుసలో ఉండే సినిమా మాయాబజార్.

ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజాకు అస్వస్థత; ఆస్పత్రిలో చేరిక 

ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా, నగిరి ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి రోజా సెల్వమణి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

జూన్ 11న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.

కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా 'ఆప్' మహా ధర్నా; భారీగా బలగాల మోహరింపు 

దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాల నియంత్రణపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రామ్‌లీలా మైదానంలో 'మహా ర్యాలీ' నిర్వహించనుంది.

బిపోర్‌జాయ్ సైక్లోన్ ఎఫెక్ట్: పాకిస్థాన్‌లో భారీ వర్షాలతో 25మంది మృతి 

పాకిస్థాన్‌లోని వాయువ్య ప్రాంతంలో వర్షాలు బీభత్సం సృష్టించడంతో కనీసం 25 మంది మరణించారు. 140 మంది గాయపడ్డారు.