LOADING...

05 Aug 2023


Chandrayaan-3: చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్ -3; ఈ నెల 23న జాబిల్లిపై మిషన్ ల్యాండింగ్ 

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రయోగం కీలక దశకు చేరుకుంది.

బీజేపీ ఎంపీ రామ్ శంకర్ కతేరియాకు రెండేళ్ల జైలుశిక్ష; అనర్హత వేటు పడే అవకాశం

2011లో జరిగిన దాడి కేసులో బీజేపీ ఎంపీ రామ్ శంకర్ కతేరియాకు ఆగ్రా కోర్టు శనివారం రెండేళ్ల జైలు శిక్ష విధించింది.

తెలంగాణలో సంక్షేమం తప్ప సంక్షోభం లేదు; అసెంబ్లీలో మంత్రి కేటీఆర్  

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. ఈ మేరకు పల్లె, పట్టణ ప్రగతిపై శనివారం ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడారు. తెలంగాణలో సంక్షేమం తప్ప, సంక్షోభం లేదని తేల్చి చెప్పారు.

టీమిండియాకు గుడ్ న్యూస్.. 140 కి.మీ ఫాస్ట్ బౌలింగ్ ఎదుర్కొంటున్న రిషబ్ పంత్

టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. వికెట్ కీపర్, స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ కు సంబంధించి తాజా అప్‌డేట్‌ వచ్చింది. ఈ మేరకు నేషనల్ క్రికెట్ అకాడమీలో పంత్ ప్రాక్టీస్‌ ప్రారంభించాడు.

'రూల్స్ రంజన్' నుంచి అప్డేట్.. రేపు 'ఎందుకురా బాబు' సాంగ్ రిలీజ్

రూల్స్ రంజన్ చిత్రానికి సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి ఎందుకురా బాబు అనే పాటను ఆదివారం రిలీజ్ చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.

టీటీడీ బోర్డు కొత్త సారథిగా భూమన కరుణాకర్‌ రెడ్డి నియమాకం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి నూతన ఛైర్మన్‌గా భూమన కరుణాకర్‌ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ ఎంపిక చేశారు. ప్రస్తుత బోర్డు పదవీకాలం ఆగస్ట్ 8తో పూర్తి కానుంది.

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స.. యువతి పొట్టలో వెంట్రుకల చుట్ట తొలగింపు 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ యువతికి పొట్టలో భారీగా వెంట్రుకలున్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ మేరకు ఆపరేషన్ చేసి చుట్టుకున్న వెంట్రుకలను తొలగించారు.

Oils for Hair: మీ జుట్టు పెరుగుదల, ఆరోగ్యానికి ఈ నూనెలు వాడండి

విపరీతమైన కాలుష్యం, పోషకాహార లోపం వంటి కారణాలతో చిన్న వయసులోనే ఈరోజుల్లో జట్టు రాలిపోవడం పరిపాటిగా మారింది. కొన్ని ఆయిల్స్‌ను జుట్టుకు పట్టించడం ద్వారా మీ వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. జట్టు ఊడిపోవడం కూడా తగ్గుతుంది. అవేంటో ఏంటో ఇప్పుడు చూద్దాం.

అమ్మవారి ఆలయంలో దొంగతనం.. దుర్గాభవాని ఆభరణాలతో పాటు సీసీటీవీ కెమెరాలు చోరీ

హైదరాబాద్‌లోని అమ్మవారి ఆలయంలో భారీ దొంగతనం జరిగింది.

వినియోగదారులకు ఉల్లి షాక్.. ఆగస్ట్ చివరి నాటికి కిలో ఉల్లి రూ.70పైనే!

భారతదేశంలో ఉల్లిగడ్డ ధరలు భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు క్రిసిల్ మార్కెట్ అంచనా వేసింది. ఆగస్ట్ ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు కిలో రూ. 70కి చేరే అవకాశం ఉందని క్రిసిల్ మార్కెట్ తాజా నివేదికలో ప్రకటించింది.

మైమరపించే కంగనా రనౌత్ అందం.. 'చంద్రముఖి 2' ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల 

జాతీయ అవార్డు గ్రహీత కంగనా రనౌత్ చాలా ఏళ్ల తర్వాత ఓ సౌత్ సినిమాలో నటిస్తోంది.

గవర్నర్‌ తమిళిసైతో ఆర్టీసీ కార్మీక యూనియన్ కీలక చర్చలు.. త్వరలోనే బిల్లుకు గ్రీన్ సిగ్నల్ 

టీఎస్ఆర్టీసీ బిల్లు-2023పై తెలంగాణ గవర్నర్‌ సానుకూలంగా స్పందించారు. బిల్లులోని 5 అంశాలపై ఇప్పటికే తమిళిసై ప్రభుత్వ వివరణ కోరారు. తాజాగా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులతో ఆమె చర్చలకు ముందుకొచ్చారు.

నూహ్‌లో బుల్డోజర్‌ యాక్షన్‌.. మెడికల్‌ షాపులు, దుకాణాలు నేలమట్టం

హర్యానాలోని నుహ్‌లో రెండో రోజైన శనివారం కూడా బుల్డోజర్లు రంగంలోకి దిగాయి. ఈ మేరకు అక్రమ కట్టడాల కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. అధికారులు కూల్చుతున్న ఆయా కట్టడాలు అల్లర్లకు పాల్పడ్డ నిందితులకు చెందినవిగా సమాచారం.

Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు భారీ షాక్; తోషాఖానా కేసులో మూడేళ్ల జైలు శిక్ష.. అరెస్టు 

తోషాఖానా కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ భారీ షాక్ తగిలింది. ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్‌ను ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు దోషిగా తేలింది.

తెలుగు హీరో నుంచి రూ.25కోట్లు తీసుకోవడంపై స్పందించిన సమంత 

దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత మైయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే.

ఓలా కీలక నిర్ణయం.. ఇకపై హైదరాబాద్‌లోనూ ప్రైమ్ ప్లస్ సేవలు

ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఓలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ప్రైమ్ ప్లస్ సేవలను తాజాగా మరో 3 మహానగరాలకు విస్తరించింది. పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో హైదరాబాద్, ముంబై, పుణె సిటీల్లో శుక్రవారం నుంచే సేవలు అందుబాటులోకి వచ్చాయి.

కోర్టు ప్రాంగణంలో నాలుగో పెళ్లి పంచాయతీ.. లాయర్ భర్తను చితకబాదిన ముగ్గురు భార్యలు

జార్ఖండ్‌లోని ఓ కోర్టులో ఓ భార్త, ముగ్గురు భార్యలకు మధ్య పంచాయితీ మొదలైంది. భర్తను ముగ్గురు సతీమణులు కలిసి చితకబాదిన సంఘటన రాంచీ సివిల్‌ కోర్టు ప్రాంగణంలో చోటు చేసుకుంది.

మణిపూర్‌‌లో మళ్లీ చెలరేగిన హింస; తుపాకీ కాల్పుల్లో ముగ్గురు మృతి, ఇళ్లు దగ్ధం

జాతి ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో శుక్రవారం అర్థరాత్రి మళ్లీ హింస చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలో సాయుధులు తుపాకులతో రెచ్చిపోయారు.

ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ కీలక వ్యాఖ్యలు.. ఆ అంశాలను బిల్లులో పొందుపర్చాలని ప్రభుత్వానికి సూచన

టీఎస్ఆర్టీసీ బిల్లు-2023పై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. బిల్లులోని పలు అంశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే పలు సందేహాలకు ప్రభుత్వం నుంచి వివరణ కోరారు.

ఆగస్టు 31నుంచి ముంబైలో 'ఇండియా' కూటమి సమావేశాలు 

ఇండియా కూటమి మరోసారి సామావేశం కానుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై వేదికగా రెండు రోజుల పాటు భేటీ కానున్నారు. ఆగస్ట్ 31, సెప్టెంబరు 1న రెండు రోజుల ఈ సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

హాలీవుడ్‌లో విషాదం; 'బ్రేకింగ్ బాడ్' నటుడు మార్క్ మార్గోలిస్ కన్నుమూత

హాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు మార్క్ మార్గోలిస్(83) కన్నుమూశారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు శుక్రవారం వెల్లడించారు.

గోల్డ్ మెడల్ గెలిచిన భారత జట్టు.. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌ కైవసం

ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌ షిప్‌లో భారతదేశానికి మొట్టమొదటి బంగారు పతకం లభించింది. జర్మనీ రాజధాని బెర్లిన్‌ లో జరిగిన పోటీల్లో వెన్నం జ్యోతి సురేఖ, ప్రణీత్‌ కౌర్‌, అదితి గోపీచంద్‌ స్వామిలతో కూడిన భారత జట్టు అద్భుతమే చేసింది. ఫలితంగా గోల్డ్ మెడల్ ను ఒడిసిపట్టింది.

తెలంగాణలో ముగిసిన ఆర్టీసీ కార్మికుల ధర్నా.. రాజ్‌భవన్‌ ముట్టడికి ప్లాన్

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రెండు గంటల ధర్నా ముగిసింది. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించకపోవడంపై నిరసిస్తూ విధులను బహిష్కరించారు. ఈ మేరకు దాదాపు రెండు గంటల పాటు బస్సులను నిలిపివేశారు.

Jammu Kashmir: కుల్గామ్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు; ముగ్గురు ఆర్మీ జవాన్లు వీరమరణం 

జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఉగ్రవాదులతో జరిగిన ఎదుకాల్పుల్లో ముగ్గురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు.

ఆగస్టు 5న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

ఆగస్టు 5వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

04 Aug 2023


మనీలాండరింగ్ కేసు విచారణలో రానా కపూర్‌కు చుక్కెదురు.. బెయిల్‌ నిరాకరించిన సుప్రీంకోర్టు  

ఎస్ బ్యాంక్ (YES BANK) సహ వ్యవస్థాపకుడు రానా కపూర్‌ కు సుప్రీంకోర్టులో చుక్కైదురైంది.

జ్ఞానవాపి మసీదులో సర్వేకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. నిర్మాణాలకు నష్టం జరగకూడదని స్పష్టం

జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సైంటిఫిక్ సర్వేకి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ మేరకు శాస్త్రీయ సర్వే కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఓ షరతు విధించింది.

Australia Open: సెమీస్‌కు అర్హత సాధించిన ప్రణయ్, ప్రియాన్షు

ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, ప్రియాన్షు సత్తా చాటుతున్నారు. ఈ టోర్నీలో వారిద్దరూ సెమీస్‌కు అర్హత సాధించారు.

ప్రేరణ: అద్భుతంగా పనిచేయాలన్న ఆలోచనతో పనిని మొదలుపెట్టడంలో ఆలస్యం పనిని ఆపేసే ప్రమాదం 

మీరొక పని మొదలు పెట్టాలని అనుకున్నారు. ఆ పని గురించి మీకేమీ తెలియదు. అందుకోసమే రీసెర్చ్ మొదలుపెట్టారు. ఆ రీసెర్చ్ లో ఆ పని గురించి ఎన్నో విషయాలు మీకు తెలుస్తున్నాయి.

అన్నమయ్య జిల్లాలో హై టెన్షన్.. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య దాడులు

టీడీపీ అధినేత చంద్రబాబు రాయలసీమ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.

Kashmir: హిజ్బుల్‌ కమాండర్‌ ఇంటిపై ఎన్ఐఏ దాడులు.. 5 చోట్ల ఏకకాలంలో దాడులు

కాశ్మీర్‌లోని ఉగ్ర నాయకుడి ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలను నిర్వహించింది. హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ ఒమర్ ఘనీపై ఉగ్రకార్యకలాపాలకు సంబంధించిన కేసులో ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది.

దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్లకు మహర్దశ.. ఆగస్ట్ 6న మోదీ శంకుస్థాపన

దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్ల ఆధునీకీకరణ పనులకు ముహుర్తం ఖరారైంది. ఆగస్టు 6న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది.

తెలుగులో సూర్య మార్కెట్ పదిలం: డబ్బింగ్ సినిమా రీ రిలీజ్ కు అభిమానుల హంగామా 

టాలీవుడ్ లో రీ రిలీజ్ ల సందడి జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సూర్య నటించిన సూర్య సన్నాఫ్ క్రిష్ణన్ సినిమా మళ్ళీ విడుదలైంది. ఈ సినిమా రీ రిలీజ్ కు భారీగా బుకింగ్స్ నమోదయ్యాయి.

Stock Market : భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ లో నష్టాలకు బ్రేక్ పడింది. సూచీల వారాంతంలో భారీ లాభాలను నమోదు చేశాయి.

ఆరోగ్యం: కావాల్సిన దానికన్నా ఎక్కువగా నీళ్ళు తాగితే ఎలాంటి నష్టాలు వస్తాయో తెలుసుకోండి 

పంచభూతాల్లో ఒకటైన నీరు, మన పంచప్రాణాలను కాపాడే ముఖ్యమైన మూలకం. శరీరంలో నీరు తగ్గితే మనిషి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. అలాగే నీరు ఎక్కువగా తాగితే కూడా ప్రమాదకరమే.

RCB: ఆర్సీబీ నూతన కోచ్‌గా జింబాబ్వే మాజీ కెప్టెన్

ఐపీఎల్ 2024 కు ముందు ఆర్సీబీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు హెడ్ కోచ్‌గా జింబాబ్వే మాజీ కెప్టెన్ అండీ ఫ్లవర్‌ను యాజమాన్యం నియమించింది.

చంద్రయాన్-3: చంద్రుడి దారిలో మరింత దగ్గరగా స్పేస్ క్రాఫ్ట్ 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటివరకు చంద్రయాన్-3 అంతరిక్ష నౌక హెల్త్ సాధారణంగానే ఉందని ఇస్రో తెలిపింది.

ఇండియా కూటమికి దిల్లీ హైకోర్టు నోటీసులు.. వివరణ ఇవ్వాలని 26 విపక్షాలకు ఆదేశం 

ఇండియా కూటమికి దిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాజకీయ కూటమికి ఇండియా పేరు పెట్టడంపై పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చిది.

హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఏకంగా రూ.2 లక్షల వరకు తగ్గింపు!

కస్టమర్లను ఆకర్షించేందుకు ఆటోమొబైల్ సంస్థలు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. దేశంలో పండుగ సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఆటో మొబైల్ సంస్థలు క్రేజీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి.

మోదీ ఇంటి పేరు కేసులో రాహుల్‌ గాంధీకి ఊరట.. జైలు శిక్షపై స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు 

ఎట్టకేలకు పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది.ఈ మేరకు సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

థియేటర్లలో వసూళ్ళ మోత మోగించిన బేబి ఓటీటీలోకి: ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కానుందంటే? 

తక్కువ బడ్జెట్ లో చిన్న సినిమాగా విడుదలైన బేబి మూవీ బాక్సాఫీసు వద్ద సునామీ సృష్టిస్తోంది. జులై 14వ తేదీన రిలీజైన ఈ సినిమా, ఇప్పటివరకు 85కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

TSRTC బిల్లుపై సస్పెన్స్.. ఇంకా ఆమోదించని గవర్నర్

బీఆర్ఎస్ సర్కారుకు గవర్నర్ తమిళ సై మళ్లీ షాకిచ్చింది. ఇటీవల వరద ప్రాంతాలను సందర్శించిన గవర్నర్ తమిళ సై ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

సిరియాలో టెర్రర్ దాడులు.. ఘర్షణల్లో మరణించిన ఐఎస్ఐఎస్ చీఫ్ ఖురాషీ 

ఇస్లామిక్ స్టేట్ నాయకుడు అబూ హుస్సేన్ అల్-హుస్సేనీ అల్ ఖురాషీ మరణించారు.

గేమ్ ఛేంజర్ సినిమాపై కియారా ఆసక్తికర వ్యాఖ్యలు: అభిమానులకు పూనకాలే 

బాలీవుడ్ లో బిజీగా ఉన్న కియారా అద్వానీ ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ సరసన గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తోంది.

మణిపూర్‌లో మళ్లీ అలజడి.. బెటాలియన్‌పై దాడి చేసి తుపాకులు చోరీ

మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సాయుధ బలగాల క్యాంప్‌లపై ఓ వర్గం దాడి చేసి భారీగా ఆయుధాలను ఎత్తుకెళ్లారు.

మంచు మనోజ్ హోస్ట్ గా టాక్ షో ప్లాన్ చేస్తున్న బ్రో సినిమా నిర్మాతలు?

మంచు మనోజ్ హీరోగా సినిమా వచ్చి చాలా ఏళ్ళు ఐపోయింది. అనేక కారణాల వల్ల సినిమాల్లో మంచు మనోజ్ నటించలేకపోయారు.

కేదార్‌నాథ్ యాత్రలో విషాదం.. కొండచరియలు విరిగిపడి 12 మందికిపైగా గల్లంతు

ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో కొండచరియలు భారీగా విరిగిపడి 12 మందికిపైగా గల్లంతయ్యారు.

సైలెంట్‌గా ఉండకపోతే.. మీ ఇంటికి ఈడీ వస్తుంది : ప్రతిపక్షాలకు కేంద్రమంత్రి హెచ్చరిక 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హట్ టాపిక్‌గా మారాయి. గురువారం లోక్ సభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆమె కొన్ని వ్యాఖ్యలను చేసింది.

కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో టెస్లా ఉన్నతాధికారుల కీలక చర్చలు

ప్రముఖ లగ్జరీ ఈవీ కార్ల తయారీ సంస్ఠ టెస్లా కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ తో కీలక చర్చలు జరిపారు.

సీమా హైదర్ పొలిటికల్ ఎంట్రీ.. ఆ రాజకీయ పార్టీ బంఫర్ ఆఫర్! 

పబ్‌జీ గేమ్‌తో ప్రేమలో పడిన పాక్ మహిళ సీమా గులాం హైదర్ భారత్ కు అక్రమంగా వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి.

థమన్ పై మళ్ళీ ట్రోలింగ్: ఈసారి స్కంద సాంగ్ కాపీ అంటూ విమర్శలు 

టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న థమన్ పై ట్రోలింగ్ సర్వ సాధారణంగా మారిపోయింది. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న థమన్ పై తాజాగా స్కంద సాంగ్ విషయంలో ట్రోలింగ్ జరుగుతోంది.

P.V. Sindhu: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పీవీ సింధుకు చేదు అనుభవం

ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి.సింధుకి ఆస్ట్రేలియా ఓపెన్ లో చేదు అనుభవం ఎదురైంది.

హర్యానా: రంగంలోకి బుల్డోజర్లు.. నూహ్‌ అల్లర్ల నిందితుల ఇళ్లు కూల్చివేత

హర్యానాలోని బీజేపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. నూహ్‌ అల్లర్లకు పాల్పడ్డ నిందితుల అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఆయా ఇళ్లను స్థానిక అధికారులు బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారు.

పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబో సినిమా టైటిల్ ఇదే? 

ఇటీవల బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కూడా నటించిన సంగతి తెలిసిందే.

Hyderabad: కోకాపేట భూములకు రికార్డు ధర.. బుద్వేల్ భూముల వేలానికి నోటిఫికేషన్

కోకాపేట భూములకు రికార్డు స్థాయిలో ధర పలకడంతో హైదరాబాద్ శివారులోని బుద్వేల్ భూములను కూడా వేలం వేయడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది.

ఫెడరల్‌ కోర్టుకు హాజరైన అమెరికా మాజీ అధ్యక్షుడు.. తాను నిర్దోషినని కోర్టుకు చెప్పిన ట్రంప్

అమెరికా తాజా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి న్యాయ విచారణను ఎదుర్కొంటున్నారు.

ఇండియాలో వన్ ప్లస్ నార్డ్ CE3 5G అమ్మకాలు ఈరోజు నుండే ప్రారంభం 

భారతదేశంలో వన్ ప్లస్ నార్డ్ CE3 5G అమ్మకాలు ఈరోజు మొదలు కానున్నాయి.

టాటా పంచ్ సీఎన్‌జీ నేడే లాంచ్.. బుకింగ్స్ ప్రారంభం

ఇండియన్ మార్కెట్లో అత్యంత నమ్మకమైన ఆటోమొబైల్ తయారీదారుగా టాటా మోటర్స్ ప్రజాదరణ పొందింది.

జ్ఞానవాపి మసీదులో కొనసాగుతున్న శాస్త్రీయ సర్వే.. బహిష్కరించిన మసీదు కమిటీ

జ్ఞానవాపి మసీదు ఆవరణలో శుక్రవారం ఉదయం సర్వే ప్రారంభమైంది. ఈమేరకు శాస్త్రీయ సర్వేను భారత పురావస్తు శాఖ(ASI) నిర్వహిస్తోంది.

ఎల్ జీ ఎమ్ రివ్యూ: వెండితెర మీద టీవీ సీరియల్

నటీనటులు: హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు తదితరులు

లా లిగా 2023-24: టాప్ ప్లేయర్లను దక్కించుకున్న ప్రాంచైజీలు

లా లిగా 2023-24 సీజన్ ఈసారి అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఆగస్ట్ 11న మొదటి మ్యాచులో అల్మెరియాతో రేయో వల్లేకానోతో పోటీ పడనుంది.

నుహ్ ఎస్పీ వరుణ్ సింగ్లాపై బదిలీ వేటు.. మత అల్లర్లే కారణం

హర్యానా రాష్ట్రం మత ఘర్షణలతో అట్టుడుకుతోంది. ఈ మేరకు నుహ్ జిల్లా ఎస్పీ వరుణ్ సింగ్లాపై బదిలీ వేటు పడింది.

ఆహారం: పండ్లు తినేటపుడు చేసే పొరపాట్ల వల్ల కలిగే నష్టాలు 

ఆరోగ్యకరమైన ఆహారం అనే మాట వచ్చినప్పుడు అందులో పండ్లు తప్పకుండా ఉంటాయి. పండ్లలో ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో పోషకాలు ఉంటాయి.

IND Vs WI 1st T20 : టీమిండియాకు ఝలక్ ఇచ్చిన వెస్టిండీస్.. భారత్ ఓటమి

వెస్టిండీస్ జట్టు టీమిండియాకు షాకిచ్చింది. విండీస్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచులో భారత్ పరాజయం పాలైంది. సులువుగా గెలవాల్సిన మ్యాచులో భారత బ్యాటర్లు తడబడ్డారు.

మెక్సికోలో లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రమాదంలో ఆరుగురు భారతీయుల దుర్మరణం

మెక్సికోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం ఓ బస్సు లోయలో పడిపోయిన దారుణ ఘటన నాయారిట్ రాష్ట్రంలో జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందడం కలకలం సృష్టించింది.

మీ వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేస్తున్నారా? ఆ అలవాటును ఇలా మానుకోండి 

సోషల్ మీడియాలో కానీ, బయట ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మీ గురించి ఎక్కువగా చెబుతున్నారా? మీ వ్యక్తిగత విషయాలను ఎక్కువగా పంచుకుంటున్నారా?

పోలవరంపై ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు.. దిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన అంబటి రాంబాబు

ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రతిష్టాత్మమైన పోలవరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

కృష్ణగాడు అంటే ఒక రేంజ్ మూవీ రివ్యూ: మేకలు తోలుకునే అబ్బాయి ప్రేమకథ ఆకట్టుకుందా? 

నటీనటులు: రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ , వినయ్ మహదేవన్, రఘు, స్వాతి పొలిచర్ల తదితరులు

ఆగస్టు 4న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు. గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.