LOADING...

31 Jan 2023


బడ్జెట్ 2023లో పన్ను తగ్గింపులు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ 2023పై వేతన జీవులు, చిన్న, మధ్య, భారీ పారిశ్రామిక వర్గాలతో పాటు పేదలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

మార్స్‌పై శాంపిల్ డిపోను పూర్తి చేసిన నాసాకు చెందిన మిషన్ రోవర్

రోవర్ మార్స్‌పై శాంపిల్ డిపో నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. రోవర్ జనవరి 29న 10 నమూనా ట్యూబ్‌లలో చివరిదాన్ని వదిలేయడంతో ఈ శాంపిల్ డిపో పూర్తయింది.

వరల్డ్ టాప్10 సంపన్నుల జాబితా నుంచి అదానీ ఔట్

భారత పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల జాబితాలో చోటు కోల్పోయారు. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థలకు సంబంధించిన షేర్లు పతనవుతూ వస్తున్నాయి.

భారతదేశంలో 20 లక్షల లోపల అందుబాటులో ఉన్న CNG హైబ్రిడ్ కార్లు

భారతదేశంలో కారును కొనే ముందు ముఖ్యంగా పరిగణలోకి తీసుకునేవి మైలేజ్ ఒకటి. దీన్ని దృష్టిలో ఉంచుకుని, హోండా, టాటా మోటార్స్, మారుతి సుజుకి, టయోటా వంటి బ్రాండ్‌లు మైలేజ్ ఎక్కువ అందించే వాహనాలను భారతదేశంలో ప్రవేశపెట్టాయి.

మీకు నిద్ర సరిగా ఉండట్లేదా? ఈ పొరపాట్లు చేస్తున్నారేమో చెక్ చేసుకోండి

పొద్దున్న నిద్రలోంచి లేవాలని అనిపించకపోవడం, అలాగే రాత్రి నిద్ర పట్టకపోవడం చాలామందికి జరుగుతుంటుంది. దానికి కారణాలు చాలా ఉన్నాయి. మీరు చేసే పొరపాట్లే మీ నిద్ర భంగానికి కారణాలుగా నిలుస్తాయి.

ఆగ్రస్థానికి ఎగబాకిన జర్మనీ

ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ తాజాగా ప్రకటించిన ర్యాకింగ్స్ లో జర్మనీ ఆగ్రస్థానంలో నిలిచింది. పెనాల్టీ షూటౌట్‌లో జర్మనీ 5-4తో బెల్జియాన్ని ఓడించి మూడోసారి ప్రపంచకప్ ను ముద్దాడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా, ఒడిశాలో ముగిసిన ఈవెంట్‌కు ముందు జర్మన్లు ​​నాల్గవ స్థానంలో ఉండగా.. ప్రస్తుతం మొదటి స్థానంలో ఉంది.

అన్నిటికి ఉపయోగపడే యాప్ కోసం పేమెంట్ టూల్స్ పై పని చేస్తున్న ట్విట్టర్

ఎలోన్ మస్క్ ట్విటర్‌ని పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌గా తయారుచేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఫైనాన్షియల్ టైమ్స్ ప్రకారం, ఈ సోషల్ మీడియా సంస్థ పేమెంట్ టూల్స్ పై పనిచేయడం ప్రారంభించింది.

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి అప్డేట్

నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి, ట్విట్టర్ వేదికగా అప్డేట్ ఇచ్చారు. యువగళం పేరుతో లోకేష్ మొదలెట్టిన పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న అస్వస్థతకు గురయ్యారు.

జొకోవిచ్, నాదల్ సాధించిన రికార్డులివే

జొకోవిచ్, నాదల్ ఇద్దరూ గొప్ప టెన్నిస్ ఆటగాళ్ళు, ఇద్దరి పేరుమీద మెరుగైన రికార్డులున్నాయి. ఆస్ట్రేలియా ఓపెన్ 2023 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రికార్డు స్థాయిలో తన కెరీర్‌లో వరుసగా 10వ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిట్ ను గెలుచుకున్నాడు.

Asaram Bapu: అత్యాచార కేసులో ఆశారాం బాపునకు జీవిత ఖైదు

అత్యాచార కేసులో ఆశారాం బాపునకు గుజరాత్‌లోని గాంధీనగర్ సెషన్స్ కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో ఇప్పటికే ఆశారాం బాపును కోర్టు ఇప్పటికే దోషిగా తేల్చగా తాజాగా శిక్షను ఖరారు చేసింది.

క్లబ్ మేనేజర్‌గా సీన్ డైచే, ధ్రువీకరించిన ఎవర్టన్

వెస్ట్ హామ్ యునైటెడ్‌తో 2-0 తేడాతో క్లబ్ ఓడిపోవడంతో తమ మేనేజర్ ఫ్రాంక్ లాంపార్డ్‌ను తొలగించిన విషయం తెలిసిందే. తర్వాత క్లబ్ నూతన పురుషుల సీనియర్ టీమ్ మేనేజర్‌గా సీన్ డైచే నియామకాన్ని ఎవర్టన్ ఫుట్‌బాల్ క్లబ్ ప్రస్తుతం ధ్రువీకరించింది.

రెండు భాగాలుగా రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్ ఓజీ

బాహుబలి సినిమా నుండి మొదలైన రెండు భాగాల పర్వం ఇప్పట్లో ఆగేలా లేదు. పాన్ ఇండియా అనగానే ప్రతీ ఒక్కరూ రెండు భాగాలుగా తమ సినిమాలను తీసుకొస్తున్నారు.

ఆర్థిక సర్వే: 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6.5శాతం వృద్ధి నమోదు

2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధిరేటు 6.5శాతం నమోదవుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. 2022-23 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరం 7శాతం నమోదు అవుతుందని, 2021-22లో 8.7శాతం నమోదైనట్లు ఆర్థిక సర్వే పేర్కొంది.

అలా ప్రవర్తించడం నాకే నచ్చలేదు : మెస్సీ

అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ తన కెరీర్ లో లోటుగా ఉన్న ఫిఫా వరల్డ్ కప్ ను గతేడాది అందుకున్నాడు. ఫిఫా వరల్డ్ కప్ ను అందుకోవడంలో నాలుగుసార్లు విఫలమైన మెస్సీ ఐదో ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు. జట్టును అంతా తానై నడిపించి, ఫైనల్లో ఫ్రాన్స్ పై షూటౌట్ ద్వారా విజేతగా నిలిపాడు. టోర్నిలో ఏడు గోల్స్ కొట్టి గోల్డెన్ బాల్ అవార్డును కైవసం చేసుకున్నాడు.

పిల్లల పెంపకం: మీ పిల్లలు మీ తోడు లేకుండా ఆడుకోవాలంటే మీరు చేయాల్సిన పనులు

పిల్లలతో ఆడటం సరదాగా ఉంటుంది. కానీ వాళ్ళు ఆడాలనుకున్న ప్రతీసారీ పెద్దలు వెళ్ళి ఆడించడానికి సమయం ఉండదు. అలాంటప్పుడు ఎవరి తోడు లేకుండా ఎలా ఆడుకోవాలో పిల్లలకు నేర్పించాలి. దానికోసం ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.

భారతదేశంలో చౌకైన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ గా ecoDryftను లాంచ్ చేయబోతున్నPURE EV

PURE EV భారతదేశంలో తన ఎకోడ్రైఫ్ట్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. ప్రస్తుతానికి బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి, డెలివరీలు మార్చిలో ప్రారంభమవుతాయి. ఈ బైక్ పూర్తి-LED లైటింగ్ సెటప్ తో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ తో వస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్‌తో 130కిమీల వరకు నడుస్తుంది.

నేషనల్ హాట్ చాక్లెట్ డే 2023: నోరూరించే చాక్లెట్ రెసీపీలను ప్రయత్నించండి

చాక్లెట్స్ అంటే అందరికీ ఇష్టమే. హాట్ చాక్లెట్స్ కనిపిస్తే అందరికీ నోరూరుతుంది. ఈరోజు అమెరికాలో నేషనల్ హాట్ చాక్లెట్ డే జరుపుకుంటారు. సో, అద్భుతమైన రుచితో చాక్లెట్ రెసిపీలను ఇంటి దగ్గరే తయారు చేద్దాం

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం, సీఎం జగన్ ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి విశాఖపట్నం కొత్త రాజధాని కానుందని సీఎం జగన్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో తాను విశాఖకు షిఫ్ట్ కాబోతున్నట్లు వెల్లడించారు. మార్చి 3, 4 తేదీల్లో కొత్త రాజధాని విశాఖలో పెట్టుబడుల సదస్సును ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. సదస్సుకు వ్యాపారవేత్తలు, పెట్టబడిదారులను ఆహ్వానించారు.

క్లీన్ స్వీప్ కోసం సౌతాఫ్రికా, పరువు కోసం ఇంగ్లండ్

సౌతాఫ్రికాతో జరిగిన తొలి రెండు వన్డేలు ఇంగ్లండ్‌కు చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. రేపు ఇంగ్లండ్ తో మూడో వన్డేకి న్యూజిలాండ్ సిద్ధమైంది. ఆఖరి వన్డేలోనూ విజయం సాధించి.. సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని ఆత్మవిశ్వాసంతో న్యూజిలాండ్ బరిలోకి దిగుతోంది. ఎలాగైనా ఓ మ్యాచ్ నెగ్గి పరువు నిలుపుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది.

జనవరి 31న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

ఆర్థిక సర్వే 2023: బడ్జెట్ వేళ ఆర్థిక సర్వే ప్రాముఖ్యతను తెలుసుకోండి

కేంద్ర బడ్జెట్-2023 సమావేశాలు మంగళవారం ప్రారంభయ్యమాయి. ఈ క్రమంలో 'ఆర్థిక సర్వే 2023'ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ఆర్థిక సర్వేను నిర్మల లోక్‌సభ ముందుంచారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆర్థిక సర్వే ప్రముఖ్యత, చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం.

టీ20 సిరీస్‌పై కన్నేసిన టీమిండియా

న్యూజిలాండ్ తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో ఓడిపోయిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో నెగ్గి సత్తా చాటింది. రెండో వన్డేలో వంద పరుగల లక్ష్యాన్ని చేధించడానికి టీమిండియా కష్టపడాల్సి వచ్చినా రెండో టీ20 గెలిచి సిరీస్ 1-1తో భారత్ సమం చేసింది.

ధమాకా తో వందకోట్లు కొల్లగొట్టిన రవితేజ నెగెటివ్ రోల్స్ చేయబోతున్నాడా?

మాస్ మహరాజ్ రవితేజ, డీజేటిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ తో కలిసి వెండితెరను పంచుకోనునున్నట్లు తెలుస్తోంది.

విస్తారా విమానంలో ఇటాలియన్ ప్రయాణికురాలి బీభత్సం, మద్యం మత్తులో అర్ధనగ్న ప్రదర్శన

విమానాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనలు ఇటీవల తరుచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అబుదాబి నుంచి ముంబయికు వస్తున్న విస్తారా ఎయిర్‌లైన్ ఫ్లైట్ (యూకే 256)లో మరో సంఘటన జరిగింది. ఇటాలియన్ ప్రయాణీకురాలు విమానంలో మద్యం మత్తులో బీభత్సం చేయడంతో అమెను పోలీసులకు అప్పగించారు.

డ్రాగా ముగిసిన FA కప్ 5వ రౌండ్

FA కప్ 2022-23 5వ రౌండ్‌ డ్రాగా ముగియడంతో ఛాంపియన్‌షిప్ జట్టు అయిన మాంచెస్టర్ సిటీ, బ్రిస్టల్ సిటీతో తలపడనుంది. మాంచెస్టర్ యునైటెడ్, సోమవారం జరిగిన 4వ రౌండ్ పోరులో డెర్బీ కౌంటీని 2-0తో ఓడించింది. దీంతో వెస్ట్ హామ్ యునైటెడ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. సౌతాంప్టన్, బ్రైటన్, స్పర్స్, లీడ్స్, లీసెస్టర్ సిటీ ఇంకా రేసులో ఉన్నాయి.

మెటాలో మరిన్ని ఉద్యోగ కోతలు జరిగే అవకాశం, జూకర్ బర్గ్ అసంతృప్తే కారణం

మెటా గత సంవత్సరం, 11,000 మంది ఉద్యోగులను అంటే సిబ్బందిలో 13% మంది ఉద్యోగులను తొలగించింది. సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ సంస్థ ప్రస్తుతం మెటా సంస్థాగత నిర్మాణంపై అసంతృప్తిగా ఉన్నారు. దానికి కారణం మానేజ్మెంట్ లో వివిధ టీంలు ఉండడం. ఖర్చులను తగ్గించే ఆలోచనలో ఉన్న జుకర్‌బర్గ్ మరికొన్ని తొలగింపులను దృష్టిలో ఉంచుకున్నట్లు కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి.

Budget 2023: 'రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం', పార్లమెంట్‌లో రాష్ట్రపతి ముర్ము

కేంద్ర బడ్జెట్-2023 పార్లమెంట్ సమావేశాలు మంగళవారం ప్రారంభయ్యమాయి. అయితే ఉభయ సమభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్‌లో ప్రసంగించారు. ముర్ము రాష్ట్రపతి అయ్యాక పార్లమెంట్‌లో ఇదే ఆమె తొలి ప్రసంగం.

అర్బన్ క్రూయిజర్ హైరైడర్ CNG కారును విడుదల చేసిన టయోటా

జపాన్ వాహన తయారీ సంస్థ టయోటా తన అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కారులో CNG వెర్షన్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఇది S, G వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

8వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై టీమిండియా ఘన విజయం

ఈస్ట్ లండన్‌లోని బఫెలో పార్క్‌లో జరిగిన టీ20 ట్రై-సిరీస్‌ ఆరో మ్యాచ్‌లో సోమవారం వెస్టిండీస్ మహిళలపై భారత్ మహిళలు 8 వికెట్ల తేడాతో గెలుపొందారు. దీప్తిశర్మ (3/11)తో అద్భుతంగా బౌలింగ్ చేయడంతో విండీస్ 6వికెట్ల నష్టానికి 94 పరుగులే చేయగలిగింది.

ఇంటికి అందాన్ని మనసుకు ఆహ్లాదాన్నిచ్చే ఈ రంగులను మీ హాల్ గోడలకు వేయండి

ఇంట్లో హాల్ ఆకర్షణీయంగా ఉండాలి. ఎందుకంటే హల్లోనే అందరూ కలుస్తారు, మాట్లాడతారు, పిల్లలు ఆడుకుంటారు. హాల్ ఆకర్షణీయంగా లేకపోతే ఇల్లు అందంగా కనిపించదు.

ఉక్రెయిన్‌కు షాకిచ్చిన అమెరికా, ఎఫ్-16 యుద్ధ విమానాలను పంపట్లేదని బైడెన్ ప్రకటన

ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ క్రమంలో రష్యా సేనలను ధీటుగా ఎదుర్కోవడానికి, ఉక్రెయిన్ సైనిక శక్తిని బలోపేతం చేయడానికి ఆధునిక ట్యాంకులు, యుద్ధ విమానాలను సాయం చేయాలని మిత్ర దేశాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరారు.

ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డులు-2023.. విజేతలు వీరే..

ఆస్ట్రేలియా తమ దేశానికి చెందిన మెన్, ఉమెన్ క్రికెట్ ప్లేయర్లకు అవార్డులకు ప్రకటించింది. ఆస్ట్రేలియన్ క్రికెట్ అవార్డ్స్ 2023లో భాగంగా ఆసీస్‌ రన్ మెషిన్ స్టీవ్ స్మిత్ అలెన్ బోర్డర్ మెడల్‌ను కైవసం చేసుకున్నాడు. ఉమెన్ ప్లేయర్ బెత్ మూనీ బెలిండా క్లార్క్ అవార్డును సొంతం చేసుకుంది.

ఆర్ఆర్ఆర్: అరుదైన అవార్డును అందించిన అమెరికా వైబ్ సైట్

రాజమౌళి రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్, తన అవార్డుల పంటను ఇప్పుడప్పుడే ఆపేలా కనిపించట్లేదు. అంతర్జాతీయ స్థాయిలో వరుసపెట్టి అవార్డులను అందుకుంటూనే ఉంది ఆర్ఆర్ఆర్.

డ్రాగా ముగిసిన జర్మన్-ప్యారిస్ మ్యాచ్

లీగ్ 1 2022-2023లో భాగంగా ఆదివారం సెయింట్ జర్మన్, లీడర్స్ ప్యారిస్ మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. రీమ్స్ చివరి 96వ నిమిషంలో ఈక్వలైజర్‌ను కనుగొన్న ప్యారిస్ సెయింట్-జర్మన్‌కు సంబంధించిన మూడు పాయింట్లను తిరస్కరించింది.

ఆయుర్వేద పదార్థాలతో చర్మాన్ని సురక్షితంగా ఉంచుకునే మార్గాలు

చర్మ సంరక్షణ కోసం మార్కెట్లో రకరకాల సాధనాలు ఉన్నాయి. మొటిమలు పోగొట్టడానికి, చర్మం మీద ఏర్పడ్డ నల్లమచ్చలను దూరం చేయడానికి రకరకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి.

IMF: 2023లో భారత వృద్ధి 6.1శాతంగా అంచనా, 2022తో పోలిస్తే 0.7శాతం తక్కువ

2023 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి 6.1 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మంగళవారం జనవరికి సంబంధించిన వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్‌ను విడుదల చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థలో కొంత మందగమనాన్ని నమోదు చేస్తుందని ఐఎంఎఫ్ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.8శాతం వృద్ధిని నమోదు చేస్తుందని ప్రకటించింది.

వరల్డ్ కప్ టీమిండియా ఓటమి కారణంగా టీమ్ కోచ్ రాజీనామా

భారత హాకీ జట్టు కోచ్ గ్రహం రీడ్ రాజీనామా చేశారు. ఇటీవల ఒడిశాలో జరిగిన హాకీ ప్రపంచ కప్ లో టీమిండియా వైఫల్యం కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. రీడ్‌తో పాటు కోచ్ గ్రెగ్ క్లార్క్, సైంటిఫిక్ అడ్వైజర్ మిచెల్ డేవిడ్ పెంబర్టన్ సైతం తమ పదవులకు రాజీనామా చేశారు.

టాప్ హీరో దగ్గర పిల్ల స్కూలు ఫీజులకు డబ్బుల్లేవా అంటూ పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డ సీనియర్ దర్శకుడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి ఆయన మీద ఏదో ఒక రకంగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఆ విమర్శలు రాజకీయాన్ని దాటి వ్యక్తిగతంగా కూడా వచ్చిన సంగతి తెలిసిందే.

భారతదేశంలో AMD సపోర్టెడ్ Aspire 3 ల్యాప్‌టాప్‌ను విడుదల చేసిన Acer

Acer భారతదేశంలో అనేక అప్‌గ్రేడ్‌లతో Aspire 3 ల్యాప్‌టాప్ రిఫ్రెష్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఈ Acer Aspire 3 భారతదేశంలో Ryzen 5 7000 సిరీస్ ప్రాసెసర్‌తో వచ్చిన మొదటి ల్యాప్‌టాప్‌.

30 Jan 2023


అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మురళీ విజయ్

భారత్ వెటనర్ క్రికెటర్ మురళీవిజయ్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 2008లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ద్వారా అరంగ్రేటం చేసిన విజయ్ చివరి టెస్టును ఆ దేశంపైనే ఆడడం గమనార్హం.

భారతదేశంలో 2023 బి ఎం డబ్ల్యూ X1 vs వోల్వో XC40 ఏది మంచిది

జర్మన్ వాహన తయారీ సంస్థ బి ఎం డబ్ల్యూ ఎట్టకేలకు భారతదేశంలో తన X1 SUV యొక్క 2023 వెర్షన్‌ను విడుదల చేసింది. కారు సరికొత్త డిజైన్ తో పాటు విలాసవంతమైన టెక్-లోడెడ్ క్యాబిన్‌ తో వస్తుంది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌ల ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది. ఇది మార్కెట్ లో లగ్జరీ SUV విభాగంలో వోల్వో XC40కి పోటీగా ఉంటుంది.

గోరఖ్‌నాథ్ ఆలయంపై దాడి కేసులో నిందితుడికి మరణశిక్ష, ఎన్ఐఏ కోర్టు సంచలన తీర్పు

2022 ఏప్రిల్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయం వద్ద ఉన్న భద్రతా సిబ్బందిపై దాడి కేసులో అరెస్టయిన అహ్మద్ ముర్తాజా అబ్బాసీకి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు సోమవారం మరణశిక్ష విధించింది.

కొబ్బరి చక్కెర గురించి మీకు తెలుసా? చక్కెరలోని రకాలు తెలుసుకోండి

సాధారణంగా మన ఇళ్ళలో వాడే చక్కెర గురించే అందరికీ తెలుస్తుంది. చక్కెరలో చాలా రకాలున్నాయి. వేరువేరు రకాల చక్కెరలను వేరు వేరు ఆహారాల్లో ఉపయోగిస్తారు.

టీమిండియా టెస్టు సిరీస్‌కు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎంట్రీ..?

డబ్ల్యూటీసీ 2021-23లో భాగంగా నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా భారత పర్యటనకు రానుంది. ఫిబ్రవరి 9-మార్చి 13 వరకు ఈ టెస్టు సిరీస్‌ జరగనుంది. నాగ్‌పూర్‌ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది.

మరో 6,000 మంది ఉద్యోగులను తొలగించనున్న ఫిలిప్స్ సంస్థ

డచ్ హెల్త్ టెక్నాలజీ కంపెనీ ఫిలిప్స్ 6,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. స్లీప్ అప్నియా ట్రీట్‌మెంట్ డివైజ్‌లను వెనక్కి రప్పించడంతో కంపెనీ నష్టాల బారిన పడింది. దీని కారణంగా ఫిలిప్స్ తన మార్కెట్ వాల్యుయేషన్‌లో 70% కోల్పోయింది. గత ఏడాది అక్టోబర్‌లో సంస్థ ప్రకటించిన 4,000 మంది ఉద్యోగుల తొలగింపుకు అదనంగా మరో 6,000 మందిని తొలగించబోతుంది.

'నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు', వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైసీపీ ఎమెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పోలీసు, ఇంటెలిజెన్స్ అధికారులు తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు.

రోమాపై విజయం సాధించిన నాపోలి

AS రోమాపై 2-1 తేడాతో నాపోలి గెలుపొందింది. మూడు దశాబ్దాలకు పైగా మొదటి సీరీ A టైటిల్‌ను సాధించడంలో నాపోలి, గియోవన్నీ సిమియోన్ సహాయపడింది.

Pakistan Blast: పాకిస్థాన్ మసీదులో ఆత్మాహుతి దాడి, 25మంది మృతి

పాకిస్థాన్‌‌లో దారుణం జరిగింది. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని మసీదులో ఆత్మాహుతి దాడి జరిగి 25మంది మృతి చెందగా, మరో 120 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని వాయువ్య నగరం పెషావర్‌లో మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో ఈ సంఘటన జరిగింది.

నాసా వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ గుర్తించిన చారిక్లో అనే గ్రహశకలం

జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను ఉపయోగించి శాస్త్రవేత్తలు చారిక్లో అనే గ్రహశకలాన్ని దగ్గరగా చూడగలిగారు. 2013లో సుదూర నక్షత్రం ముందు చారిక్లో వెళుతుండగా కనిపించింది. మరో రెండు చిన్న వస్తువులు కూడా నక్షత్రం ఎదురుగా కనిపించాయి, అవి చారిక్లో వలయాలుగా తర్వాత గుర్తించారు.

దసరా టీజర్: ఒంటికి మట్టి, చేతికి సీసా, నోట్లో బీడీతో నాని విశ్వరూపం

నేచురల్ స్టార్ నాని కొత్త చిత్రం దసరా టీజర్ ఇంతకుముందే రిలీజైంది. ఇదివరకు సినిమాల్లో నాని చేసిన పాత్రలన్నీ దాదాపుగా సాఫ్ట్ నేచర్ కలిగి ఉన్నవే. కృష్ణార్జున యుద్ధంలో ఒక పాత్రలో మాస్ గా కనిపించాడు గానీ అది కూడా పూర్తి మాస్ కాదు.

ఫిబ్రవరి 5న నాందేడ్‌లో బీఆర్ఎస్ సభ, సరిహద్దు ప్రాంతాలపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్

భారత రాష్ట్ర సమితి రెండో బహిరంగ సభను మహారాష్ట్రలోని నాందేడ్‌లో నిర్వహించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే బహిరంగ సభ ఏర్పాట్లను పార్టీ ముఖ్య నాయకులకు అప్పగించారు.

Australia Open 2023 విజేతగా నోవాక్ జకోవిచ్

ఆస్ట్రేలియా ఓపెన్ 2023 పురుషుల సింగిల్స్ టైటిల్ ను సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్ సొంతం చేసుకున్నారు. ఆదివారం జరిగిన ఫైనల్లో నోవాక్ జకోవిచ్ 6-3, 7-6(7/4), 7-6(7/5) తేడాతో గ్రీక్ ప్లేయర్ స్టెఫనోస్ సిట్సిపాస్‌ను ఓడించాడు.

2024 సంక్రాంతిని టార్గెట్ చేసుకుని రెడీ అవుతున్న సినిమాలివే

తెలుగు సినిమాల విడుదలకు సంక్రాంతిని మించిన పెద్ద పండగ మరొకటి లేదు. ప్రతీ ఒక్కరూ తమ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటారు. ఈసారి సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల మధ్య గట్టిపోటీ నడిచింది.

వరుస ఓటములతో ఇంగ్లండ్ చెత్త రికార్డు

వరుస ఓటములతో ఇంగ్లండ్ పేలవ ప్రదర్శన చేస్తోంది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ పరాజయం పాలైంది. ఇంగ్లండ్ 50 ఓవర్లలో 342/7 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా 49.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-0 తో కైవసం చేసుకుంది.

యూనిలీవర్ కొత్త సీఈఓగా హీన్ షూమేకర్‌ నియామకం

కన్స్యూమర్ గూడ్స్ దిగ్గజం యూనిలీవర్ సంస్థ సోమవారం తన కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా హీన్ షూమేకర్‌ను ప్రకటించింది. జూలై 1 నుండి అలాన్ జోప్ స్థానంలో హీన్ షూమేకర్‌ కొనసాగుతారు.

భారత్-చైనా: 1962 యుద్ధం, 2020లో ఘర్షణ మధ్య పోలిక లేదు: జైరామ్ రమేష్

1962లో అప్పటి ప్రధాని నెహ్రూ హయాంలో చైనాతో యుద్ధం తర్వాత భారత్ తన భూభాగాన్ని కోల్పోయిందని, మోదీ హయాంలో కాదని విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవల చేసిన ప్రకటనపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది.

ట్రావెల్: ఆనాటి రాచరికానికి గుర్తుగా నిలిచిన కోల్ కతా లోని రాజభవనాలు

స్వాతంత్య్రానికి ముందు బ్రిటీషర్ల పాలనలో ఉన్న ఇండియాలో అనేక రాజభవనాలు నిర్మింపబడ్డాయి. ఆనాటి రాచరికానికి గుర్తుగా ఆ రాజభవనాలు ఇప్పటికీ ఇంకా మిగిలే ఉన్నాయి.

ఆగ్మెంటెడ్ రియాలిటీతో పాటు అదిరిపోయే డిజైన్ తో రాబోతున్న Audi యాక్టివ్‌స్పియర్

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ Audi బెర్లిన్‌లో జరిగిన "సెలబ్రేషన్ ఆఫ్ ప్రోగ్రెస్" ఈవెంట్‌లో యాక్టివ్‌స్పియర్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. EV లాంటి క్రాస్‌ఓవర్ డిజైన్‌ తో పాటు వర్చువల్ ఇంటర్‌ఫేస్ కోసం ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్‌సెట్‌లు, ట్రాన్స్‌ఫార్మింగ్ రియర్ సెక్షన్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించిన డేవిడ్ మిల్లర్

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ అద్భుతంగా రాణించారు. కేవలం 37 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 58 పరుగులు చేశాడు.

రియల్ సొసిడాడ్ చేతిలో రియల్ మాడ్రిడ్ పరాజయం

2022-23 లా లిగాలో రియల్ మాడ్రిడ్ పరాజయం పాలైంది. రియల్ సోసిడాడ్ చేతిలో రెండు కీలకమైన పాయింట్లను కోల్పోవడంతో రియల్ మాడ్రిడ్ ఓడిపోయింది.

బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై ఫిబ్రవరి 6న సుప్రీంకోర్టులో విచారణ

ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.

జనవరి 30న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

బాలయ్య పాటల రీమేక్: అప్పుడు పటాస్ లో మాస్ సాంగ్, ఇప్పుడు అమిగోస్ లో రొమాంటిక్ సాంగ్

నందమూరి కళ్యాణ్ రామ్ మంచి ఫామ్ లో ఉన్నారు. చాలారోజుల తర్వాత బింబిసార సినిమాతో మంచి విజయం దక్కించుకున్నారు. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే ఎక్కువ వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది బింబిసార.

తల్లి పాలలో పురుగుమందుల అవశేషాలు, 111మంది నవజాత శిశువులు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌లో గత 10నెలల్లో 111మంది శిశువులు అనుమానాస్పద కారణాలతో మరణించారు. ఈ మరణాలపై లక్నోలోని క్వీన్ మేరీ హాస్పిటల్ బృందం పరిశోధన చేయగా, షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహారాజ్‌గంజ్‌లోని గర్భిణుల పాలల్లో పురుగుమందులు అవశేషాలను ఉండటం గమనార్హం.

షాహీన్ అఫ్రిది ముందు బుమ్రా పనికి రాడు: పాక్ మాజీ ప్లేయర్

ప్రపంచంలోని గొప్ప పేస్ బౌలర్లలో ఇండియాకు చెందిన జస్ప్రీత్ బుమ్రా, పాకిస్తాన్ షాహీన్ అఫ్రిది ముందుంటారు. యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను బోల్తా కొట్టించడంలో ఈ ఇద్దరూ సిద్ధహస్తులే.. గతేడాది ఆసియా కప్ తర్వాత బుమ్రా మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టలేదు. బుమ్రా సేవలను టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఎంతగానో మిస్ అయింది.

జాతీయవాదం ద్వారా చేసిన మోసాన్నిఅదానీ కప్పిపుచ్చలేరంటున్న హిండెన్‌బర్గ్

హిండెన్‌బర్గ్ చేసిన స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసాల ఆరోపణల నివేదికపై స్పందిస్తూ ఇది భారతదేశంపై దాడిగా అదానీ గ్రూప్ పేర్కొంది.

ఘనంగా ప్రారంభమైన పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ చాలా బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు ఇంకా సెట్స్ మీద ఉండగానే మరో మూవీ మొదలెట్టేసారు పవన్ కళ్యాణ్.

దక్షిణాఫ్రికా సిరీస్‌పై‌ కన్నేసిన షఫాలీ వర్మ

అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్ విజేతగా ఇండియా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ లో ఇంగ్లాండ్ పై ఇండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 17.1 ఓవర్లలో 68 పరుగులకే ఆలౌటైంది.

నన్ను చంపుతానని పుతిన్ బెదిరించారు: బోరిస్ జాన్సన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనను చంపేస్తానని బెదిరించారని బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోపించారు. యూకేపై క్షిపణిని వదలడానికి తనకు ఒక నిమిషం మాత్రమే పడుతుందని పుతిన్ హెచ్చిరినట్లు జాన్సన్ వెల్లడించారు. బీబీసీ రూపొందించిన 'పుతిన్ v ది వెస్ట్' అనే మూడు భాగాల డాక్యుమెంటరీలో ఈ సంచలన విషయాలను వెల్లడయ్యాయి.

ఒత్తిడిని దూరం చేయడం నుండి సంతాన ప్రాప్తి వరకు శిలాజిత్ వల్ల కలిగే ప్రయోజనాలు

శిలాజిత్.. ఇది హిమాలయ కొండల్లో దొరికే ఆహార పదార్థం. ఎన్నో ఏళ్ళ క్రితం కుళ్ళిపోయిన మొక్కల వల్ల ఇది తయారైంది. పుష్కలమైన పోషకాలు ఉండే శిలాజిత్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

భారతదేశంలో అమ్మకానికి సిద్దమైన Fire-Bolt Ninja-Fit

Fire-Bolt కొత్తగా ప్రారంభించిన స్మార్ట్‌వాచ్, Ninja-Fit, ఇప్పుడు భారతదేశంలో ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది. ఫిట్‌నెస్-సపోర్ట్ మోడ్‌లతో పాటు "అప్‌గ్రేడెడ్ హెల్త్ సూట్" ఇందులో వస్తుంది. దీనికి 1.69-అంగుళాల స్క్రీన్, IP67-రేటెడ్ సేఫ్టీ, బ్లూటూత్ కాలింగ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

నేడు శ్రీనగర్‌లో 'భారత్ జోడో యాత్ర' ముగింపు వేడుక, 21 పార్టీలకు కాంగ్రెస్ ఆహ్వానం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' సోమవారంతో మూగియనుంది. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు విజయవంతంగా పూర్తి చేసుకొన్నయాత్ర శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో గల చారిత్రాత్మక క్లాక్ టవర్ వద్ద జాతీయ జాతీయ జెండాను ఆవిష్కరించడంతో అధికారికంగా ముగియనుంది.

జర్మనీదే హాకీ ప్రపంచ కప్

పురుషుల హాకీ ప్రపంచకప్ 2023 విజేతగా జర్మనీ నిలిచింది. ఆదివారం భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్‌లో బెల్జియంను జర్మనీ ఓడించింది. జర్మనీ 5-4 తేడాతో బెల్జియంను ఓడించి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.

మెదడు పనితీరును దెబ్బ తీసి మతిమరుపును తీసుకొచ్చే ఆహారాలు

మన శరీరంలో అన్నికంటికంటే ముఖ్యమైనది మన మెదడు. అందుకే మెదడుకు మంచి పోషకాలు అందించాలి. లేదంటే మెదడు పనితీరులో ఇబ్బందులు ఏర్పడి మతిమరుపు బహుమతిగా వస్తుంది.

ఎక్సర్‌సైజ్ టాప్‌చీ-2023: భారత ఆయుధ సంపత్తి ప్రదర్శన, చైనాకు సవాల్

మహారాష్ట్రలోని దేవ్‌లాలీలోని విశాలమైన ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వద్ద భారత సైన్యం తన ఆయుధ సత్తా ఏంటో చూపించింది. వివాదాస్పద వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసీ) వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో శక్తివంతమైన ఆయుధాలను ప్రదర్శించి చైనాకు భారత్ సవాల్ విసిరింది. 'ఎక్సర్‌సైజ్ టాప్‌చీ-2023' పేరుతో భారత సైన్యం ఈ ప్రదర్శనను చేపేట్టింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 తో పోలిస్తే JAWA 42 ఎందులో బెటర్

JAWA మోటార్‌సైకిల్స్ ఇటీవల భారతదేశంలో 42 మోడల్‌కు మరింత ఆకర్షణీయంగా ఉండేలా కొత్త మెటాలిక్ కాస్మిక్ కార్బన్ కలర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ రెట్రో బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కు సబ్-400cc కేటగిరీలో పోటీగా ఉంటుంది.

వారసుడు ఇష్యూ మహేష్ బాబు సినిమాకు రిపీట్ కానుందా?

ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల మధ్య థియేటర్ల గురించి పెద్ద ఇష్యూ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు సినిమాల మధ్య థియేటర్ల పంపకాల గురించిన చర్చ రోజూ వార్తల్లో వచ్చింది.

రెండో టీ20లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన టీమిండియా

న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన రెండో టీ20లో భారత్ విజయం సాధించింది. తొలి టీ20లో ఎదురైన పరాభవానికి హార్ధిక్ సేన ప్రతీకారం తీర్చుకుంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 99 పరుగుల టార్గెట్ ను భారత్ కష్టంగా చేధించింది.