04 Feb 2023
మూఢ నమ్మకానికి పరాకాష్ట: ఇనుప రాడ్తో 51సార్లు వాతలు, మూడు నెలల చిన్నారి మృతి
మధ్యప్రదేశ్లోని గిరిజన ప్రాంతమైన షాదోల్ జిల్లాలో దారుణం జరిగింది. మూఢ నమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలైంది.
'మిల్లెట్స్తో ట్రై చేయండి', వంట చేయడంలో 'బిల్ గేట్స్ 'కు ప్రధాని మోదీ టిప్
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ రోటీ తయారు చేస్తున్న వీడియోను తన ఇన్స్టా స్టోరీస్లో ప్రధాని మోదీ శనివారం షేర్ చేశారు. అంతేకాదు బిల్ గేట్స్కు వంటచేయడంలో ఒక టిప్ కూడా ఇచ్చారు.
సెమీస్లో సమరానికి సిద్ధమైన బెంగాల్, మధ్యప్రదేశ్, సౌరాష్ట్ర, కర్నాటక
ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్-ఫైనల్ దశ పూర్తి అయింది. బెంగాల్, మధ్యప్రదేశ్, సౌరాష్ట్ర, కర్ణాటక జట్లు ప్రస్తుతం సెమీఫైనల్కు అర్హత సాధించాడు. రెండు సెమీ-ఫైనల్ మ్యాచ్లు ఫిబ్రవరి 8న ప్రారంభం కానున్నాయి. అయితే ఇంతవరకు వేదికలు నిర్ణయించకపోవడం గమనార్హం.
కింగ్ కోహ్లీపైనే అందరి చూపులు..!
ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ అంటే అంత సులభమేమీ కాదు, ప్రస్తుతం అందరి చూపు ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభమయ్యే భారత్-ఆసీస్ టెస్టు సిరీస్ పైనే ఉంది. ప్రస్తుతం ఈ టెస్టు సిరీస్లో కింగ్ కోహ్లీపై అంచనాలు పెరిగిపోయాయి.
ఆహారంలో చక్కెర ను పూర్తిగా వదిలేసిన మసాబా గుప్తా
ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా చక్కెరను వదిలేస్తానని టార్గెట్ పెట్టుకుంది. 21రోజుల పాటు చక్కెరకు సంబంధించిన ఆహారాలు ముట్టుకోనని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
జుట్టుకు మృదుత్వాన్ని, అందాన్ని తీసుకొచ్చే హెయిర్ టోనర్ గురించి తెలుసుకోండి
జుట్టుకు కావాల్సిన ఆరోగ్యాన్ని అందిస్తామని చెప్పి మార్కెట్లో రకరకాల ప్రోడక్ట్స్ వస్తుంటాయి. అదే మాదిరిగా ఇటీవల హెయిర్ టోనర్ వచ్చింది. జుట్టుకు అందాన్ని, సరైన ఆకారాన్ని తీసుకొచ్చే హెయిర్ టోనర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.
ప్రకటన ఆదాయాన్ని బ్లూ సబ్స్క్రిప్షన్ ఉన్న క్రియేటర్లతో పంచుకోనున్న ట్విట్టర్
ఎలోన్ మస్క్ ట్విట్టర్ ప్రకటన ఆదాయాన్ని క్రియేటర్లకు షేర్ చేస్తుందని ప్రకటించారు. అయితే, ట్విట్టర్ బ్లూ వెరిఫైడ్ ఉన్న క్రియేటర్లతో మాత్రమే కంపెనీ ప్రకటనల నుండి వచ్చే ఆదాయాన్ని పంచుకుంటుంది.ఈ విధానం ఈరోజు నుండే ప్రారంభమవుతుంది.
భారతదేశంలో 2023 మారుతి సుజుకి Fronx బుకింగ్స్ ప్రారంభం
భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఆటో ఎక్స్పో 2023లో సరికొత్త -SUV, Fronxని మార్కెట్ లో విడుదల చేయబోతుంది. కాంపాక్ట్ SUV కోసం బుకింగ్స్ ప్రారంభం కావడమే కాదు ఇప్పటికే 5,000 ప్రీ-ఆర్డర్లు కూడా వచ్చాయి. ఇది సిగ్మా, డెల్టా, డెల్టా+, జీటా, ఆల్ఫా అనే ఐదు ట్రిమ్ స్థాయిలలో అందుబాటులో ఉంటుంది.
భారతదేశంలో విడుదల కాబోతున్న Infinix ZERO 5G 2023 సిరీస్
Infinix భారతదేశంలో ZERO 5G 2023 సిరీస్ ను ప్రవేశపెట్టింది, ఇందులో స్టాండర్డ్, టర్బో మోడల్లు ఉన్నాయి. స్టాండర్డ్ మరియు టర్బో మోడల్లు డైమెన్సిటీ 920, డైమెన్సిటీ 1080 చిప్సెట్లతో వస్తాయి.ఈ ఫోన్లు ఫిబ్రవరి 11 నుండి ఫ్లిప్కార్ట్ ద్వారా అందుబాటులోకి వస్తాయి. Infinix బ్రాండ్ బడ్జెట్ స్మార్ట్ఫోన్లకు ప్రసిద్ది చెందింది. ఇప్పుడు ఈ బ్రాండ్ ZERO 5G 2022తో 5G విభాగంలోకి ప్రవేశించింది.
తెలంగాణ అసెంబ్లీ: ప్రభుత్వంపై అక్బరుద్దీన్ విమర్శలు, మంత్రి కేటీఆర్ కౌంటర్
తెలంగాణ అసెంబ్లీలో ఏఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రి కేటీఆర్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. హైదరాబద్ అభివృద్ధి, ప్రభుత్వం పనితీరుపై అక్బరుద్దీన్ ఘాటుగా విమర్శలు గుప్పించారు. మంత్రి కేటీఆర్ సైతం అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.
రంజీ ట్రోఫీలో సెమీస్కు చేరిన సౌరాష్ట్ర
రంజీ ట్రోఫీ 2022-23లో భాగంగా క్వార్టర్ ఫైనల్ పోరులో పంజాబ్పై 71 పరుగుల తేడాతో సౌరాష్ట్ర విజయం సాధించి, సెమీ-ఫైనల్కు దూసుకెళ్లింది.
భారత్ జిమ్మాస్ట్ దీపా కర్మాకర్పై నిషేధం
ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్ లో భారత ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన భారత స్టార్ జమ్మాస్ట్ దీపా కర్మాకర్ పై అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ 21 నెలల పాటు నిషేధం విధించింది. నిషేధిత పదార్థాన్ని తీసుకున్నందుకు కర్మాకర్ను ఇంటర్నేషన్ టెస్టింగ్ ఏజెన్సీ దోషిగా తేల్చింది.
పెరుగుతున్న ధరల వల్ల శాలరీ సరిపోక ఒత్తిడి పెరుగుతోందా? ఈ టిప్స్ పాటించండి
పెరుగుతున్న నిత్యావసర ధరలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఆర్థికంగా బలంగా ఉన్న దేశమైన యుకే కూడా ధరల పెరుగుదలను తట్టుకోలేకపోతుంది. ఇక పాకిస్తాన్ లాంటి దేశాల్లో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది.
'ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతల్లో ప్రధాని మోదీ నంబర్ 1'
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు ప్రధాని మోదీ అని అమెరికాకు చెందిన కన్సల్టింగ్ సంస్థ 'మార్నింగ్ కన్సల్ట్' వెల్లడించింది. ఈ సంస్థ 'గ్లోబల్ లీడర్ అప్రూవల్' పేరుతో చేసిన సర్వేలో 78 శాతం అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా ప్రధాని మోదీని ఆమోదించినట్లు పేర్కొంది.
స్టీవ్ స్మిత్ను అశ్విన్ అపగలడా..?
ఫిబ్రవరి 9నుంచి నాగ్ పూర్ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే భారత్కు చేరుకున్న ఆస్ట్రేలియా నెట్స్లో చెడటోడుస్తోంది. ముఖ్యంగా భారత స్పిన్నర్లను ఎదుర్కొనడం కోసం వ్యూహాలను రచిస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్ రన్ మెషీన్ స్టీవ్ స్మిత్, టీమిండియా స్పిన్ మాంత్రికుడు రవించంద్రన్ అశ్విన్ మధ్య పోరు జరగనుంది.
కేరళలో మరో మూడు నగరాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G సేవలు
భారతి ఎయిర్టెల్ తన 5G సేవలను కేరళలోని కోజికోడ్, త్రివేండ్రం, త్రిస్సూర్లో విడుదల నగరాల్లో ప్రారంభించింది. ఈ నగరాల్లో ఎయిర్టెల్ వినియోగదారులు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ప్రస్తుత 4G నెట్వర్క్ కంటే 20-30 రెట్లు వేగవంతమైన వేగంతో ఆనందించవచ్చు. ప్రస్తుతం ఎయిర్ టెల్ తన 5G డేటా ప్లాన్లను ఇంకా వెల్లడించలేదు.
ఎన్నెన్నో జన్మల బంధం ఈనాడే కన్నుమూసింది, సింగర్ వాణీజయరాం హఠాన్మరణం
భారతీయ సినిమా పాటలకు తన గొంతునిచ్చిన ప్రఖ్యాత గాయని, భారత ప్రభుత్వంచే ఇటీవల పద్మభూషణ్ అవార్డు అందుకున్న దిగ్గజం వాణీ జయరాం ఈరోజు కన్నుమూసారు.
ప్రీమియర్ లీగ్లో డ్రాగా ముగిసిన ఫుల్హామ్, చెల్సియా మ్యాచ్
ప్రీమియర్ లీగ్ 2022-23 మ్యాచ్లో ఫుల్హామ్, చెల్సియా మ్యాచ్ డ్రాగా ముగిసింది. చెల్సియా అటాకింగ్ థర్డ్లో ఎటువంటి గోల్ను సాధించలేదు. గోల్-స్కోరింగ్ అవకాశాలు ఉన్నా సద్వినియోగం చేసుకోలేకపోయింది. అనంతరం మిడ్ఫీల్డ్లో అరంగేట్రం చేసిన ఎంజో ఫెర్నాండెజ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
బీజేపీ యాక్షన్ ప్లాన్ షూరూ- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జ్గా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
బీజేపీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జ్ కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను, కో-ఇన్ఛార్జ్గా బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కె.అన్నామలైని అధిష్టానం నియమించింది.
భారతదేశంలో సెల్టోస్ (ఫేస్ లిఫ్ట్)ని విడుదల చేయనున్న కియా మోటార్స్
దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ కియా మోటార్స్ ఈ ఏడాది మధ్యలో భారతదేశంలో సెల్టోస్ 2023 అప్డేట్ వెర్షన్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఫేస్లిఫ్టెడ్ SUV ఇప్పటికే దక్షిణ కొరియాతో పాటు USలో అందుబాటులో ఉంది
మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తారకరత్న?
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఆసుపత్రిలో నందమూరి బాలకృష్ణ, తారకరత్న పరిస్థితిని దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు.
కేరళ: దేశంలోనే తొలిసారిగా తల్లిదండ్రులు కాబోతున్న టాన్స్జెండర్ జంట
దేశంలోనే తొలిసారిగా కేరళకు చెందిన ఓ ట్రాన్స్ మన్ తల్లి కాబోతోంది. గత మూడేళ్లుగా సహజీవనం చేస్తున్న జహాద్, జియా పావల్ తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించారు. మార్చిలో జహ్హాద్ తమ బిడ్డను ప్రసవించనున్నట్లు జియా పావల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
టీమిండియాను చూసి ఆసీస్ భయపడుతోంది
టీమిండియా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కు సిద్ధమైంది. ఫిబ్రవరి 9న ఆస్ట్రేలియాతో టీమిండియా పోటీ పడనుంది. ప్రతిష్టాత్మక బోర్డర్-గావస్కర్ కోసం రెండు జట్లు హోరాహోరీగా పోటీ పడనున్నాయి. ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ చేరినప్పటికీ ప్యాట్ కమిన్స్ బృందం.. గతంలో ఎన్నడూ లేని విధంగా 18 మంది సభ్యులతో భారత పర్యటనకు వచ్చింది. ఆసీస్ ఆటగాళ్లు ఇప్పటికే నెట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు.
వికీపీడియాను బ్యాన్ చేసిన పాకిస్థాన్, కంటెంట్పై అభ్యంతరాలు
దాయాది దేశం పాకిస్థాన్ వికీపీడియాను బ్లాక్ చేసింది. చట్టవిరుద్ధమైన కంటెంట్ ఉన్నందునే బ్యాన్ చేస్తున్నట్లు పాకిస్థాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ(పీటీఏ) వెల్లడించింది.
ఆస్ట్రేలియాకు భారీ షాక్, తొలిటెస్టుకు ఆల్ రౌండర్ దూరం
భారత్తో టెస్టు ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాకు గట్టి షాక్ తగిలింది. తొలి టెస్టుకు ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ దూరం కానున్నాడు.బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఫిబ్రవరి 4న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్లో 100 మిలియన్ డౌన్లోడ్లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్లోని ఐటెమ్లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
గ్రామీ అవార్డ్స్ చరిత్ర, ప్రత్యేకత, ఈ సంవత్సరం నామినేషన్లు, ఎక్కడ చూడవచ్చో తెలుసుకోండి
65వ గ్రామీ అవార్డుల ప్రధానోత్సవం భారతదేశ కాలమానం ప్రకారం ఫిబ్రవరి 6వ తేదీన ఉదయం 6:30గంటలకు అందజేయబడతాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ బుధవారమే మొదలైంది.
ఫిబ్రవరి 12న భారత్-పాకిస్తాన్ మ్యాచ్
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 8వ ఎడిషన్ ఫిబ్రవరి 10న ధక్షిణాఫ్రికా వేదికగా ప్రారంభం కానుంది. ఐదుసార్లు విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా మళ్లీ టైటిల్ పై కన్నేసింది.
ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ ఇంట్లో కాల్చుకుని సీఆర్పీఎఫ్ జవాన్ ఆత్మహత్య
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) అసిస్టెంట్ సబ్ దిల్లీలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డైరెక్టర్ నివాసంలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
వాలెంటైన్స్ డే: మీకు ట్రావెలింగ్ ఇష్టమైతే ఈ రోడ్ ట్రిప్స్ వెళ్ళండి
వాలెంటైన్స్ డే బహుమతిగా మీ భాగస్వామికి ఏదైనా బహుమతి ఇవ్వాలనుకుంటే పూలు, గ్రీటింగ్ కార్డులకు బదులుగా రోడ్ ట్రిప్స్ ప్లాన్ చేయండి. మీకు ట్రావెలింగ్ ఇష్టమైతే ప్రకృతిలో పరుగెలుడుతూ, అందాన్ని ఆస్వాదిస్తూ భారతదేశ రోడ్ల మీద మీ బండిని ఎక్కించండి.
వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదు
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో కొన్నిరోజులుగా వైసీసీ తీరుగుబాటు నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వార్తల్లో నిలుస్తున్నారు. వైసీపీకి చెందిన కీలక నేతలతోపాటు, ప్రభుత్వంలోని మంత్రులను టార్గెట్ చేస్తూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు.
మార్చి 4నుంచి 26 వరకు ముంబాయిలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్
మార్చి 4 నుంచి 26 వరకు ముంబైలోని రెండు వేదికలపై ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్ మొత్తాన్ని ఆడేందుకు భారత క్రికెట్ బోర్డు యోచిస్తోందని క్రిక్బజ్ తెలిపింది. డివై పాటిల్, సీసీఐ స్టేడీయాలు వేదిక కానున్నాయి.
రికార్డు ఆదాయాన్ని రాబట్టిన ఆపిల్, భారత్పై అతినమ్మకాన్ని పెంచుకుంటున్న టిమ్ కుక్
ఆపిల్ సీఈవో టిమ్ కుక్ భారత్పై చాలా నమ్మకాన్ని పెంచుకుంటున్నారు. దానికి కారణం భారతదేశంలో 2022 చివరి త్రైమాసికంలో కంపెనీ రికార్డ్-సెట్టింగ్ పనితీరును చూపించింది.
'కాశ్మీరీ పండిట్లను లెఫ్టినెంట్ గవర్నర్ 'బిచ్చగాళ్లు' అంటున్నారు', మోదీకి రాసిన లేఖలో రాహుల్
జమ్ముకశ్మీర్లో పండిట్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధాని మోదీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. వారి మమస్యలకు పరిషారం చూపాలని విజ్ఞప్తి చేశారు.
మహీంద్రా సంస్థ రూపొందించిన ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ SUVల గురించి తెలుసుకుందాం
స్వదేశీ SUV స్పెషలిస్ట్ మహీంద్రా గత సంవత్సరం ఆగస్టులో బ్రాండ్ యూరోపియన్ డిజైన్ స్టూడియోలో ఐదు కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ SUVలను ప్రకటించింది. అవి XUV.e8, XUV.e9, BE.05, BE.07, BE.09 మోడల్స్. కొత్త XUV.e, BE సబ్-బ్రాండ్ల క్రింద వస్తాయి. ఫిబ్రవరి 10న ఈ వాహనాలను తొలిసారిగా భారతదేశంలో ప్రదర్శిస్తుంది.
కోహ్లీని దూషించిన పాక్ పేసర్ సోహైల్ ఖాన్..!
2015 ఫిబ్రవరిలో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో భారత్- పాకిస్తాన్ తలపడింది. ఈ చిరకాల ప్రత్యర్థి పోరులో ఎప్పటిలాగే టీమిండియానే గెలుపొందింది. ఈ విజయంలో కింగ్ కోహ్లీ వన్ డౌన్ లో వచ్చి ముఖ్య పాత్ర వహించిన విషయం తెలిసిందే.
మరో చైనా 'గూఢచారి' బెలూన్ను గుర్తించిన అమెరికా, డ్రాగన్ వ్యూహం ఏంటి?
మరో చైనా 'గూఢచారి' బెలూన్ను అమెరికా గుర్తించింది. లాటిన్ అమెరికా గగన తలంలో ఈ బెలూన్ కనిపించిందని పెంటగాన్ తెలిపింది.
మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమాలో ఖైదీ విలన్ ?
మహేష్ బాబు 28వ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈమధ్యే సారధి స్టూడియోలో చిత్రీకరణ ప్రారంభమయ్యింది.
ఇకపై యూట్యూబ్ లో 'Go Live Together'ను ఇద్దరు క్రియేటర్లు కలిసి లైవ్ చేసే అవకాశం
గత ఏడాది నవంబర్లో, ఇద్దరు క్రియేటర్లు కలిసి లైవ్ చేయడానికి వీలు కల్పించే 'Go Live Together' ఫీచర్ను యూట్యూబ్ ప్రకటించింది. ఇప్పుడు, ఈ ఫీచర్ ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లకు అందుబాటులో వచ్చింది.
నిజం విత్ స్మిత: నెపోటిజాన్ని ఎంకరేజ్ చేస్తుంది ప్రేక్షకులే అంటున్న నాని
సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం గురించి తరచుగా చర్చ జరుగుతూ ఉంటుంది. సోషల్ మీడీయాలో నెపోటిజం మీద విమర్శలు వస్తూనే ఉంటాయి. నెపోటిజంపై చర్చ, సినిమాలను బాయ్ కాట్ చేయాలనే డిమాండ్ వరకూ వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి.
గాబ్రియేల్ మార్టినెల్లి ఆర్సెనల్తో కొత్త ఒప్పందం
ప్రీమియర్ లీగ్ 2022-23 లీడర్స్ ఆర్సెనల్తో గాబ్రియేల్ మార్టినెల్లి కొత్త ఒప్పందంపై సంతకం చేశాడు. 21 ఏళ్ల బ్రెజిలియన్ మార్టినెల్లి మునుపటి ఒప్పందం వచ్చే సీజన్ చివరిలో ముగియనుంది. అయితే, అతను అదనపు సంవత్సరం కోసం ఎంపికతో, నూతనంగా నాలుగున్నర సంవత్సరాల ఒప్పందాన్ని అంగీకరించాడు.
ఉత్తర్ప్రదేశ్, హర్యానాలో భూకంపం, రిక్టర్ స్కేలుపై 3.2తీవ్రత నమోదు
హర్యానా, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి భూ ప్రకంపం సంభవించింది. స్వల్పంగా భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
03 Feb 2023
ఫోన్ ట్యాపింగ్: వైసీపీ వర్సెస్ కోటంరెడ్డి మధ్య డైలాగ్ వార్- మోదీ జోక్యం చేసుకుంటారా?
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వర్సెస్ వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్కు ముగింపు పడే అవకాశం కనిపించడం లేదు. శుక్రవారం ఇరువర్గాల మధ్య ఢీఅంటేఢీ అనేలా మాటల తూటాలు పేలాయి.
మెంటల్ వీక్ నెస్ పై జనాల్లో ఉన్న అపోహాలను ఇప్పుడే వదిలేయండి
రోజువారి పనుల్లో యాక్టివ్ గా ఉండడానికి శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు, మానసికంగా బలంగా ఉండాలి. కానీ వ్యసనాలు, ఒత్తిడి, డిప్రెషన్, స్క్రిజోఫీనియా, ఈటింగ్ డిజార్డర్స్ మొదలగు వాటివల్ల మానసికంగా వీక్ అవుతారు.
GPT-3.5 ఫీచర్లతో Teams ప్రీమియం ఆఫర్ ను ప్రకటించిన మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ GPT-3.5 ఫీచర్లతో Teams ప్రీమియంను ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ తన సెర్చ్ ఇంజన్ బింగ్తో ChatGPT కనెక్ట్ చేసే ఆలోచనను ఇటీవలే ప్రకటించింది.
వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు జింబాబ్వే సై
ఫిబ్రవరి 4 నుంచి జింబాబ్వేతో జరిగే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు వెస్టిండీస్ సిద్ధమైంది. జింబాబ్వేకు కీలకమైన ఆటగాళ్లు దూరం కావడంతో జట్టు బలహీనంగా కనిపిస్తోంది. క్రెయిగ్ ఎర్విన్ జింబాబ్వే టెస్టు పగ్గాలను చేపట్టనున్నారు. మరోవైపు, కరీబియన్ జట్టు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.
ఆంధ్రాపై విజయం సాధించి సెమీస్కు చేరిన మధ్యప్రదేశ్
రంజీ ట్రోఫీ 2022-23 క్వార్టర్ ఫైనల్స్లో మధ్యప్రదేశ్ ఆంధ్రపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీస్కు అర్హత సాధించింది. రికీభుయ్, కరణ్ షిండేల సెంచరీలతో ఆంధ్ర తొలి ఇన్నింగ్స్లో 379 పరుగులు చేసింది. అయితే 2వ ఇన్నింగ్స్లో ఆంధ్ర 93 పరుగులకే ఆలౌటైంది.
హైదరాబాద్ టాకీస్ నిర్వహిస్తున్న ఇళయరాజా లైవ్ కాన్సెర్ట్
మేస్ట్రో ఇళయరాజా హైదరాబాద్ లో లైవ్ కాన్సెర్ట్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 26వ తేదీన హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ లైవ్ కాన్సెర్ట్ ఉండనుంది. ఈ కాన్సెర్ట్ లో 100మంది సంగీత కళాకారులు పాల్గొంటున్నారు.
ఒంటిచేత్తో విహారి బ్యాటింగ్, స్పందించిన దినేష్ కార్తీక్
టీమిండియా ప్లేయర్ హనుమాన్ విహారికి క్రికెట్ పట్ల ఎంతో నిబద్ధత ఉందని మనకు తెలుసు. ఈ మధ్య ఆస్ట్రేలియా టూరులో ఆ టీమ్ బౌలర్లు విసురుతున్న బంతులకు తన శరీరాన్ని అడ్డుగా పెట్టి అప్పట్లో విరోచితంగా పోరాడిన విషయం తెలిసిందే.
'ముంబయిలో తాలిబన్ ఉగ్రదాడులు', ఎన్ఐఏకు బెదిరింపు మెయిల్
ముంబయిలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కార్యాలయానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. ముంబయిలో ఒక వ్యక్తి ఉగ్రదాడికి పాల్పడతాడని అందులోని సారాంశం.
సామ్ సంగ్ Galaxy S23 vs ఆపిల్ ఐఫోన్ 14 ఏది మంచిది
దక్షిణ కొరియా సంస్థ సామ్ సంగ్ Galaxy S23 సిరీస్ని కొన్ని హార్డ్వేర్ అప్గ్రేడ్లతో ప్రకటించింది, అయితే ఇది S22 మోడల్ లాగానే ఉంది. మార్కెట్ లో Galaxy S23 స్టాండర్డ్ మోడల్ ఆపిల్ ఐఫోన్ 14 తో పోటీ పడుతుంది.
రిటైర్మెంట్ ప్రకటించిన టీ20 వరల్డ్ కప్ హీరో
టీమిండియా బౌలర్ జోగిందర్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మంట్ ప్రకటించారు. ధోని సారథ్యంలో 2007 టీ20 వరల్డ్ కప్ లో జోగిందర్ చివరి ఓవర్ వేసి టీమిండియాకు విజయాన్ని అందించాడు. పాకిస్తాన్ ఫైనల్ చివరి ఓవర్లో మిస్బాను ఔట్ చేసి అప్పట్లో వార్తల్లోకెక్కాడు.
జమ్ముకశ్మీర్లో జోషిమఠ్ తరహా పరిస్థితులు, రోజురోజుకు కుంగిపోతున్న 'దోడా' ప్రాంతం
ఉత్తరాఖండ్లోని జోషిమఠ్, కర్ణప్రయాగ్లో భూమి కుంగిపోయి ఇళ్లకు పగుళ్లు ఎలా ఏర్పడ్డాయో, అలాంటి పరిస్థితులే తాజాగా జమ్ముకశ్మీర్లోని దోడా జిల్లాలో నెలకొన్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ప్రజలు భయాందోళకు గురవుతున్నాయి.
మద్యాహ్నం కునుకు మంచిదే? దాని లాభాలు తెలుసుకోండి
మద్యాహ్నం కునుకు వల్ల మెదడు పనితీరులో చాలా మార్పులు వస్తాయి. తినగానే కళ్ళు మూసుకుపోతుంటే పెద్దగా ఆలోచించకుండా కొంత సమయం పాటు కునుకు తీయండి.
ప్రపంచ బిలియనీర్ల జాబితా టాప్ 20లో స్థానం కోల్పోయిన గౌతమ్ అదానీ
ప్రపంచంలోని ఫోర్బ్స్ ప్రపంచ రియల్-టైమ్ బిలియనీర్ల జాబితాలో టాప్ 20 సంపన్నుల జాబితాలో పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ తన స్థానాన్ని కోల్పోయారు. US షార్ట్-సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్పై చేసిన నివేదిక ఆ సంస్థ స్టాక్స్ ను దారుణంగా పడిపోయేలా చేసింది. శుక్రవారం 22వ స్థానంలో ఉన్నారు. గౌతమ్ అదానీ సంపద 21.77 శాతం అంటే 16.2 బిలియన్ డాలర్లు క్షీణించింది.
ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నం: ఎమ్మెల్సీ కవిత
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
ఝార్ఖండ్ పై విజయం సాధించి సెమీస్కు చేరిన బెంగాల్
2022-23 రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో జార్ఖండ్పై ఘన విజయం సాధించి బెంగాల్ సెమీఫైనల్కు అర్హత సాధించింది.ఝార్ఖండ్ పేసర్ ఆకాశ్ దీప్ ఆరు వికెట్లు పడగొట్టడంతో, 9 వికెట్ల తేడాతో బెంగాల్ గెలుపొందింది.
మరిన్ని ఇబ్బందుల్లోకి అదానీ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని సవరించాలనంటున్న బంగ్లాదేశ్
బొగ్గు ఉత్పత్తి చేసే విద్యుత్ ధర ఖరీదు ఎక్కువ కావడంతో అదానీ పవర్ లిమిటెడ్తో 2017 విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని సవరించాలని బంగ్లాదేశ్ కోరింది. ఒప్పందాన్ని సవరించాలని కోరుతూ భారతీయ కంపెనీతో కమ్యూనికేట్ చేసామని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డ్ (BPDC) అధికారి తెలిపారు.
సమంత ఎస్ చెప్పడంతో రెండు సినిమాలను ఒకేసారి తీసుకురానున్న విజయ్ దేవరకొండ
లైగర్ సినిమాతో అపజయం అందుకున్న విజయ్ దేవరకొండ, ఈసారి గట్టిగా కొట్టాలని రెండు సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు. మళ్ళీరావా, జెర్సీ చిత్రాల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తో కలిసి విజయ్ దేవరకొండ ఒక సినిమా చేస్తున్నాడు.
ఉత్తరాఖండ్ను చిత్తు చేసి సెమీస్కు చేరిన కర్ణాటక
2022-23 రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో ఉత్తరాఖండ్పై సంచనల విజయంతో కర్ణాటక సెమీ ఫైనల్కు చేరుకుంది. కర్ణాటక విజయంలో శ్రేయాస్ గోపాల్, మురళీధర్ వెంకటేష్, కీలక పాత్ర పోషించారు.
టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్లో మంటలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్
పైలట్ అప్రమత్తంగా ఉండటం వల్ల అబుదాబి నుంచి కేరళలోని కోజికోడ్కు వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వినామానికి పనుప్రమాదం తప్పింది.
మీ పెంపుడు కుక్కపిల్ల నార్మల్ గా కంటే ఎక్కువ నిద్రపోతుందా? కారణాలు తెలుసుకోండి
మీ కుక్కపిల్ల ఈ మధ్య ఎక్కువగా నిద్రపోతుందా? గతంలో మాదిరి యాక్టివ్ గా ఉండలేకపోతుందా? దీనికి చాలా కారణాలున్నాయి.
ఆర్టెమిస్ 2 మిషన్ కోసం సిద్దంగా ఉన్న నాసా SLS రాకెట్
నాసా స్పేస్ లాంచ్ సిస్టమ్ (SLS) రాకెట్ చంద్రునిపై వ్యోమగాములను తీసుకువెళ్ళే పెద్ద మిషన్ కోసం సిద్ధమవుతుంది. ఆర్టెమిస్ 1 మిషన్తో తన తొలి ప్రయోగాన్ని చేసిన ఈ రాకెట్ ఇప్పుడు రెండోసారి తయారుగా ఉంది.
'హిండెన్బర్గ్' ఎఫెక్ట్: ఫిబ్రవరి 6న ఎల్ఐసీ, ఎస్బీఐ ఆఫీస్ల ఎదుట కాంగ్రెస్ నిరసన
గౌతమ్ అదానీపై ప్రముఖ రీసెర్చ్ కంపెనీ హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశం పార్లమెంట్ను కూడా కుదిపేస్తోంది.
మాజీ ప్రియురాలిపై ఆసీస్ టెన్నిస్ స్టార్ దాడి
మాజీ ప్రియురాలిపై టెన్నిస్ స్టార్ ఆటగాడు నిక్ కిర్గియోస్ దాడి చేసినట్లు ఒప్పుకున్నాడు. మానసిక ఆరోగ్య సమస్యల కారణం వల్లే దాడికి పాల్పడినట్లు కిర్గియోస్ తరుపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీంతో నేరారోపణ నుండి కెర్గియోస్ తప్పించుకున్నాడు.
RDE-కంప్లైంట్ ఇంజన్ తో సిరీస్ మొత్తాన్ని అప్డేట్ చేసిన Renault
ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ Renault భారతదేశంలోని మొత్తం సిరీస్ ను RDE భద్రతా నిబంధనలకు అనుగుణంగా అప్డేట్ చేసింది. KWID, Kiger, Triber ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ఆప్షన్స్ తో అప్డేట్ అయ్యాయి.
బీబీబీ డాక్యుమెంటరీని నిషేధించడంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని నిషేధించడంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బీబీసీ డాక్యుమెంటరీ నిషేధానికి వ్యతిరేకంగా మహువా మోయిత్రా, జర్నలిస్టు ఎన్ రామ్, న్యాయవాది ప్రశాంత్ భూషణ్, న్యాయవాది ఎంఎల్ శర్మ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది.
టెస్టు సిరీస్కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన, ఆలౌరౌండర్ రీ ఎంట్రీ
ఇంగ్లండ్తో ఫిబ్రవరి 16న స్వదేశంలో న్యూజిలాండ్ రెండు టెస్టులను ఆడనుంది. ఇందుకోసం 14మంది సభ్యులతో కూడిన జట్టును న్యూజిలాండ్ ప్రకటించింది. టిమ్ సౌతీ న్యూజిలాండ్ టెస్టుకు సారథిగా నియమితులయ్యారు.
399cc ఇన్లైన్-ఫోర్ ఇంజన్తో రాబోతున్న 2023 Kawasaki Ninja ZX-4RR 399cc
Kawasaki ట్రాక్-ఫోకస్డ్ 2023 Kawasaki Ninja ZX-4RRని గ్లోబల్ మార్కెట్ల లో $9,699 (సుమారు రూ. 8 లక్షలు) ధరతో విడుదల చేయనుంది. సూపర్స్పోర్ట్ ఎంట్రీ-లెవల్ ZX-25R మరియు మిడ్-కెపాసిటీ ZX-6R మధ్య ఉంటుంది.
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: సంక్షేమంలో రాష్ట్రం భేష్: గవర్నర్ తమిళసై
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రాంరభమయ్యాయి. తొలిరోజు గవర్నర్ తమిళసై ప్రసంగంతో సభ మొదలైంది. ఎలాంటి సంచలనాలకు తావు లేకుండా గవర్నర్ ప్రసంగం ముగియడం గమనార్హం.
బుట్టబొమ్మ సినిమాకు రివ్యూ ఇచ్చిన డీజే టిల్లు ఫేమ్ సిద్ధు
మళయాల మూవీ కప్పెలా సినిమాకు తెలుగు రీమేక్ గా వస్తున్న సినిమా బుట్టబొమ్మ. ఫిబ్రవరి 4వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
ఫైనల్కు చేరుకున్న బ్రిస్బేన్ హీట్
బిగ్బాష్ లీగ్ ఫైనల్కు బ్రిస్బేన్ హీట్ చేరుకుంది, సిడ్నీ సిక్సర్స్పై నాలుగు వికెట్ల తేడాతో బ్రిస్బేన్ హీట్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన సిడ్నీ సిక్సర్ నిర్ణీత 20 ఓవర్ల కు 9 వికెట్ల నష్టానికి 116 పరుగులను మాత్రమే చేసింది.
మీకు స్వార్థం ఉందా? ఎలాంటి విషయాల్లో స్వార్థం మంచిదో తెలుసుకోండి
మారుతున్న ప్రపంచంలో స్వార్థంగా ఉన్నవారే మంచి జీవితాన్ని పొందుతారన్న మాటను ఎక్కువ మంది నమ్ముతున్నారు.
స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోవడం కింగ్ కోహ్లీకి కష్టమే..!
భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 9న నాగ్పూర్లో ప్రారంభం కానున్న నాలుగు మ్యాచ్ల సిరీస్లో విరాట్ కోహ్లీ పరుగుల వరద పాటించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
హైవేపై విరిగి పడ్డ కొండచరియలు, చిక్కుకుపోయిన 53మంది ప్రయాణికులు
హిమాచల్ ప్రదేశ్లోని లాహౌల్ & స్పితి జిల్లాలోని తిండి-కిలాడ్ రహదారిపై కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో స్టేట్ హైవే-26పై ట్రాఫిక్ స్తంభించిపోయింది.
గాయాలపై పోరాటం చేయలేకపోయా : షాహీన్ ఆఫ్రిది
ప్రపంచంలో అత్యుత్తమ బౌలర్గా షామీన్ ఆఫ్రిదికి పేరుంది. యార్కర్లతో ప్రత్యర్థులకు బోల్తా కొట్టించే సత్తా ఆఫ్రిదికి ఉంది. అద్భుత బౌలింగ్ ఫెర్ఫామెన్స్తో పాకిస్తాన్ విజయంలో కీలకపాత్ర పోషిస్తాడు. 2018లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆఫ్రిది 25 టెస్టులు ఆడి 99 వికెట్లు పడగొట్టాడు.
ఫిబ్రవరి 3న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్లో 100 మిలియన్ డౌన్లోడ్లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్లోని ఐటెమ్లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
సరికొత్త కథలతో థియేటర్లను షేక్ చేయడానికి రెడీ అవుతున్న ఈ వారం సినిమాలు
సంక్రాంతి తర్వాత వేసవి వచ్చే వరకు తెలుగు సినిమా బాక్సాఫీసు వద్ద పెద్దగా సందడి ఉండదు. పెద్ద సినిమాలు లేకపోవడమే దానికి కారణం. ఐతే ఈసారి మాత్రం వేసవికి ముందే థియేటర్లు షేక్ అయ్యేలా కనిపిస్తున్నాయి.
అదానీ గ్రూప్ లో 3 సంస్థలను పరిశీలిస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి
పెట్టుబడిదారులకు భరోసా ఇవ్వడానికి భారతీయ బిలియనీర్ అదానీ చేసిన ప్రయత్నం విఫలమైంది గౌతమ్ అదానీ వ్యాపారాల షేర్లు గురువారం మరింత పడిపోయాయి. అతను తన సంపదలో $100 బిలియన్లను కోల్పోయారు.
పాల ధరలు పెంచిన 'అమూల్', లీటరుపై రూ.3 వడ్డన
గుజరాత్ డెయిరీ కోఆపరేటివ్ అమూల్ పాల ధరలను మరోసారి పెంచింది. అన్ని రకాల పాల ప్యాకెట్ ధరలను లీటరు రూ.3 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలు నేటి నుంచి( ఫిబ్రవరి 3వ తేదీ) అమల్లోకి వస్తాయని తెలిపింది.
ఫైనల్లో భారత్ మహిళలు ఓటమి
సౌతాఫ్రికా మహిళలతో జరిగిన టీ20 ట్రై సిరీస్ ఫైనల్లో టీమిండియా మహిళలు దారుణంగా విఫలమయ్యారు. లీగ్ దశలో చక్కటి ప్రదర్శన కనబర్చిన భారత మహిళలు పేలవ ప్రదర్శనతో ఫైనల్లో చతికిలపడ్డాడరు. ఫలితంగా ముక్కోణపు టోర్నీలో సౌతాఫ్రికా మహిళలు విజేతగా నిలిచారు.
అమెరికా అణు ప్రయోగ కేంద్రంపై చైనా 'గూఢచారి' బెలూన్, పెంటగాన్ అలర్ట్
అమెరికాలో చైనా భారీ సాహసానికి ఒడిగట్టింది. మోంటానాలోని అణు ప్రయోగ కేంద్రం గగన తలంలోకి 'గూఢచారి' బెలూన్ను పంపి చైనా అడ్డంగా దొరికిపోయింది. ఈ విషయాన్ని అమెరికా సీనియర్ రక్షణ అధికారి ఒకరు నిర్ధారించారు.
సికిల్ సెల్ అనీమియా అంటే ఏమిటి? కేంద్ర బడ్జెట్ లో పస్తావన ఎందుకు వచ్చింది?
కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెడుతున్నప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిని 2047 సరికల్లా పూర్తిగా నిర్మూలిస్తామని తెలిపింది.
మూడువారాలు పాటు ఆటకు దూరం కానున్న ఎంబాపే
ఛాంపియన్స్ లీగ్ చివరి-16, ఫస్ట్-లెగ్ టై వర్సెస్ బేయర్న్ మ్యూనిచ్కు ఎంబాపే దూరమయ్యాడు. గాయంతో మోంట్పెల్లియర్తో జరిగిన పీఎస్జీ మ్యాచ్ ప్రారంభంలోనే పిచ్ను వదిలి బయటికి వెళ్లాడు. గాయం తీవ్రత వల్ల మూడువారాలు పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు వెల్లడించారు. లియోనెల్ మెస్సీ గోల్ చేయడంతో పీఎస్జీ 3-1తో మ్యాచ్ను గెలుచుకుంది.
మార్కెట్ లో మరిన్ని రంగుల్లో విడుదల కాబోతున్న 2023 సుజుకి Hayabusa
జపనీస్ తయారీ సంస్థ సుజుకి Hayabusa 2023 అప్డేట్ ను లాంచ్ చేసింది. ఈ సూపర్బైక్ మూడు డ్యూయల్-టోన్ రంగుల్లో అంటే పెర్ల్ వైగర్ బ్లూ/పెర్ల్ బ్రిలియంట్ వైట్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్/గ్లాస్ స్పార్కిల్ బ్లాక్, మెటాలిక్ థండర్ గ్రే/క్యాండీ డేరింగ్ రెడ్ లో లభిస్తుంది. స్పోర్టి టూరర్ అవుట్గోయింగ్ మోడల్ మొత్తం డిజైన్ తో, 1,340cc ఇన్లైన్-ఫోర్ ఇంజన్ తో నడుస్తుంది.
రెండు భాగాలుగా రానున్న ప్రభాస్ ప్రాజెక్ట్ కె సినిమా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాల లిస్ట్ చూస్తే ఎవరికైనా ఆశ్వర్యమేస్తుంది. ఇండియాలో ఏ స్టార్ చేతిలోనూ అన్నేసి సినిమాలు లేవు.
తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం: కళాతపస్వి కే విశ్వనాథ్ కన్నుమూత
శంకరాభరణం, సాగర సంగమం, సిరివెన్నెల, స్వాతిముత్యం చిత్రాల దర్శకుడు కళాతపస్వి కే విశ్వనాథ్, గురువారం అర్థరాత్రి హైదరాబాద్ లో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
ఫిబ్రవరి 10న విడుదల కానున్న Realme కోకా-కోలా స్మార్ట్ఫోన్ ఎడిషన్
Realme ఫిబ్రవరి 10న భారతదేశంలో కోకా-కోలా-బ్రాండెడ్ స్మార్ట్ఫోన్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ Realme మిడిల్ సిరీస్ 10 Pro 5G లాగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: గవర్నర్ తమిళసై ప్రసంగం ఎలా ఉండబోతోంది?
రాష్ట్ర ప్రభుత్వం, రాజ్భవన్ మధ్య ఉప్పు- నిప్పు చందంగా ఉన్న నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 12.10గంటలకు 'బడ్జెట్ 2023-24' సమావేశాలు మొదలు కానుండగా, అందరి దృష్టి తెలంగాణ అసెంబ్లీపైనే ఉంది.