LOADING...

28 Jan 2023


కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను నిలిపివేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం: జస్టిస్ నారిమన్

కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజుపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రోహింటన్‌ ఫాలీ నారిమన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొలీజియం సిఫార్సు చేసిన న్యాయమూర్తుల పేర్లను పెండింగ్‌లో ఉంచడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.

బీబీసీ డాక్యుమెంటరీ: దిల్లీ యూనివర్సిటీలో గందరగోళంపై కమిటీ ఏర్పాటు

ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని దిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేయగా, ఆ సమయంలో గందరగోళం నెలకొంది.

ఆరోగ్యం: బాదం, కాజు, వాల్నట్ వంటి గుండెకు మేలు చేసే గింజల గురించి తెలుసుకోండి

ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా గింజలను తినడం వల్ల మీ గుండె పనితీరు మెరుగుపడుతుంది. గింజల్లో అన్ సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

రెండో వన్డేలో సౌతాఫ్రికాతో సమరానికి సిద్ధమైన ఇంగ్లండ్

తొలి వన్డేలో ఇంగ్లండ్ పై విజయం సాధించిన సౌతాఫ్రికా వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. మొదటి వన్డేలో పరాజయం పాలైన ఇంగ్లండ్, రెండో వన్డేలో ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.

డీటీహెచ్, కేబుల్ టీవీ వినియోగదార్లకు షాక్- ఫిబ్రవరి 1నుంచి 30శాతం టారిఫ్ పెంపు

ఫిబ్రవరి 1 నుంచి డీటీహెచ్, కేబుల్ వినియోగదారుల జేబులకు చిల్లులు పడనున్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) ఆదేశాల మేరకు ప్రముఖ బ్రాడ్ కాస్టర్లు తమ టీవీ ఛానళ్ల ధరలను భారీగా పెంచనున్నాయి. 30శాతం టారిఫ్ పెరగనుండటంతో టీవీ ఛానళ్లు మరింత ప్రియం కానున్నాయి.

అదరగొట్టే లుక్ తో మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన మారుతి సుజుకి Alto k10 ఎక్స్‌ట్రా ఎడిషన్

మారుతి సుజుకి తన Alto k10 ప్రత్యేక ఎక్స్‌ట్రా ఎడిషన్‌ను విడుదల చేసింది. కారు సాధారణ మోడల్‌ లాగానే ఉన్నా బయట, లోపల కొన్ని అప్డేట్లతో మార్కెట్లోకి వస్తుంది. ఈ ఎక్స్ట్రా ఎడిషన్ K10లో స్కిడ్ ప్లేట్లు, ORVMలు, రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్‌పై కాంట్రాస్ట్-కలర్ పాప్రికా ఆరెంజ్ హైలైట్‌లను కలిగి ఉంది. ఇది 1.0-లీటర్, K-సిరీస్ ఇంజిన్ తో నడుస్తుంది.

భూతద్దం భాస్కర్ నారాయణ టీజర్: తెలుగులో మరో డిటెక్టివ్ మూవీ

నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ తర్వాత తెలుగులో మళ్లీ డిటెక్టివ్ మూవీ రాలేదు. డిటెక్టివ్ సినిమాలకు అభిమానులు ఎప్పుడూ ఉంటారు.

త్వరలో గూగుల్ ను మించిపోనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ChatGPT

OpenAI ChatGPTకు పెరుగుతున్న ప్రజాదరణ ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో గుబులు పుట్టిస్తుంది. Gmail సృష్టికర్త పాల్ బుచ్‌హీట్ ఈ ChatGPT మరో సంవత్సరం లేదా రెండు సంవత్సరాలలో గూగుల్ సెర్చ్ ఇంజన్ ను మించిపోవచ్చని పేర్కొన్నారు. Yellow Pagesకు గూగుల్ ఎలా చెక్ పెట్టిందో అలాగే సెర్చ్ ఇంజన్‌లకు ఈ AI చెక్ పెడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

banned documentaries: భారత్‌లో నిషేధించిన ఈ ఐదు డాక్యుమెంటరీల గురించి తెలుసుకోండి

2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీ ప్రమేయం ఉందంటూ బీబీసీ 'ఇండియా: ది మోదీ క్వచ్చన్' పేరుతో డాక్యుమెంటరీని రూపొందించింది. డాక్యుమెంటరీ వీడియో లింకులపై కేంద్రం నిషేధం విధించింది. బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రెండో టీ20లో ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ రెడీ

న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా.. టీ20 సిరీస్‌లో మాత్రం తొలి మ్యాచ్‌లోనే బోల్తా కొట్టింది. రోహిత్‌‌శర్మ, విరాట్‌ లేకుండా హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీలో బరిలోకి దిగిన యువ టీమిండియా దారుణంగా విఫలమైంది.

ఎలాంటి వ్యసనం నుండైనా దూరం కావాలంటే చేయాల్సిన పనులు

ఏ అలవాటుకైనా వ్యసనంగా మారితే దాని నుండి తప్పించుకోవడం కష్టమవుతుంది. ముందు అలవాటు రూపంలో మీరు దాన్ని పట్టుకుంటారు. ఆ తర్వాత వ్యసనం రూపంలో అది మిమ్మల్ని వదిలిపెట్టదు.

ఆస్ట్రేలియా ఓపెన్ 2023 ఫైనల్‌లో సిట్పిపాస్ వర్సస్ నోవాక్ జకోవిచ్

ఆదివారం జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023లో పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో మూడో సీడ్ స్టెఫానోస్ సిట్సిపాస్, నాలుగో సీడ్ నోవాక్ జకోవిచ్‌తో తలపడనున్నాడు.

దక్షిణ చైనా సముద్రంలో అమెరికా యుద్ధ విమానాల విన్యాసాలు

దక్షిణ చైనా సముద్రంలో అమెరికా యుద్ధ నౌక కదలికలతో చైనా మండిపడుతోంది. రెండు వారాల క్రితం దక్షిణ చైనా సముద్రంలోకి అమెరికా అతిపెద్ద యుద్ధనౌక 'నిమిట్జ్‌' వచ్చింది. తాజాగా డజన్ల కొద్దీ యుద్ధ విమానాలు, హెలికాప్టర్‌లను దక్షిణ చైనా సముద్రంలో ఆగ్రరాజ్యం ప్రదర్శించింది. దీంతో చైనా అగ్గిలం మీద గుగ్గిలం అవుతోంది.

వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్‌కు 2022 ఆర్ధిక సంవత్సరంలో BharatPe 1.7కోట్లు చెల్లించింది

రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (RoC)కి దాఖలు చేసిన ప్రకటన ప్రకారం, BharatPe వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ కు రూ.1.69 కోట్లు,అతని భార్య మాధురీ జైన్ గ్రోవర్‌లకు రూ.63 లక్షలు చెల్లించింది. నిధుల దుర్వినియోగం ఆరోపణలపై సంస్థ గత ఏడాది వీరిద్దరిని BharatPe తొలగించింది. అతని వ్యవస్థాపకుడి పదవిని కూడా తొలగించింది. ఆర్థిక అవకతవకలకు పాల్పడినందుకు రూ.88 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని అతనిపై దావా వేసింది.

బాలయ్య తర్వాతి సినిమాకు హీరోయిన్ కష్టాలు తీరినట్లే?

అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో వరుస విజయాలు అందుకున్న బాలకృష్ణ, తర్వాతి సినిమా కోసం సిద్ధమవుతున్నారు. బాలకృష్ణ కెరీర్లో 108వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా జరుగుతున్నాయి.

ఐసిసితో స్కై స్పోర్ట్స్ కీలక ఒప్పందం

స్కై స్పోర్ట్స్ ఎనిమిదేళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2024 నుండి 2031 వరకు యునైటెడ్ కింగ్‌డమ్, ఐర్లాండ్‌లో జరిగే అన్ని ప్రపంచకప్‌లను ఈ సంస్థ ప్రసారం చేయనుంది. ఈ విషయాన్ని శుక్రవారం ఐసీసీ ధ్రువీకరించింది.

జనవరి 28న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

బరువు తగ్గడం: పొట్టకొవ్వు పెరుగుతుంటే ఈ పండ్లను మీ ఆహారంలో చేర్చుకోండి

బరువు తగ్గాలని ఆలోచించే వారు పొట్టచుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కొన్ని సార్లు వాళ్లలో పెద్ద మార్పేమీ ఉండదు.

సూపర్ సెంచరీతో అదరగొట్టిన జాసన్ రాయ్

ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. దక్షిణాఫ్రికా జరిగిన మొదటి వన్డేలో అద్భుత సెంచరీతో అదరగొట్టాడు. 91 బంతుల్లో 113 పరుగులు చేశాడు. మొత్తం మీద రాయ్ వన్డేల్లో 11వ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. 4వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా జాసన్ రాయ్ చరిత్రకెక్కాడు.

'భారత్ జోడో యాత్రకు భద్రత కల్పించండి', అమిత్ షాకు ఖర్గే లేఖ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో జనవరి 27న జరిగిన భద్రతా లోపంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లేఖ రాశారు. జమ్మకాశ్మీర్‌లో జరుగుతున్న 'భారత్ జోడో యాత్ర'కు తగిన భద్రత కల్పించడంలో వ్యక్తిగత జోక్యం చేసుకోవాలని కోరారు.

అదానీ గ్రూప్ షేర్ 22% పడిపోవడంతో నష్టాన్ని చవిచూసిన LIC

అదానీ గ్రూప్ షేర్లు శుక్రవారం ఒక్క రోజులో మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో రూ. 3.37 లక్షల కోట్లు నష్టపోయాయి, మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం ఐదు అతిపెద్ద అదానీ గ్రూప్ కంపెనీలలో ఏకైక అతిపెద్ద నాన్-ప్రమోటర్ దేశీయ వాటాదారైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC). అదానీ గ్రూప్ కంపెనీలలో తన హోల్డింగ్స్ విలువ క్షీణించిన కారణంగా రూ.16,627 కోట్లు కోల్పోయింది.

ఆర్సెనల్‌ను ఓడించిన మాంచెస్టర్ సిటీ

మాంచెస్టర్ సిటీ చేతిలో ఆర్సెనల్ జట్టు పరాజయం పాలైంది. నాల్గవ రౌండ్ లో 1-0తో ఆర్సెనల్ ను మాంచెస్టర్ సిటీ ఓడించింది. సిటీ తరుపున నాథన్ అకే ఒకే ఒక గోల్ చేయడం గమనార్హం.

ధోని చూస్తుండగా వారెవ్వా అనిపించిన ఇషాన్ కిషన్

రాంచి వేదికగా శుక్రవారం జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్ భారత్‌ను ఓడించింది. 177 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన ఇండియా.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. అయితే బ్యాటింగ్‌లో నిరాశ పరిచిన ఇషాన్ కిషన్ ఫీల్డింగ్ లో మెరిశాడు.

75వ వార్షికోత్సవం సందర్భంగా లిమిటెడ్ ఎడిషన్ GranTurismo PrimaSerieను లాంచ్ చేయనున్నMaserati

ఇటాలియన్ లగ్జరీ, స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ Maserati గ్లోబల్ మార్కెట్ల కోసం లిమిటెడ్ ఎడిషన్ GranTurismo PrimaSerie మోడల్‌ను ప్రకటించింది, కేవలం 75 కార్లను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక ఎడిషన్ మోడల్ విభిన్నమైన గ్రిజియో లామిరా కాంట్రాస్టింగ్ బ్రైట్ రెడ్ యాక్సెంట్‌, నీరో కామెటా సబ్టిల్ పుదీనా గ్రీన్ రంగుల్లో లభిస్తుంది

బుట్టబొమ్మ ట్రైలర్ టాక్: మలుపులతో కూడిన ప్రేమకథ

సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్ఛూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న బుట్టబొమ్మ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది. అనికా సురేంద్ర, అర్జున్ దాస్, సూర్య వశిష్ట, నవ్యస్వామి ప్రధాన పాత్రల్లో కనిపించారు.

27 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై సౌతాఫ్రికా విజయం

తొలి వన్డేలో దక్షిణాఫ్రికా 27 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. సౌతాఫ్రికా 50 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది. వాన్ డెర్ డస్సెన్ 117 బంతుల్లో 111 పరుగులు, డేవిడ్ మిల్లర్ 53 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. లక్ష్య చేధనకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 44.2 ఓవర్లకు 271 పరుగులు చేసి ఆలౌటైంది.

ఐఏఎఫ్: మధ్యప్రదేశ్‌లో కుప్పుకూలిన రెండు యుద్ధ విమానాలు , ఒక పైలెట్ మిస్సింగ్

భారత వాయుసేనకు చెందిన రెండు యుద్ధ విమానాలు శనివారం మధ్యప్రదేశ్‌లోని మోరెనాలో కుప్పకూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు గాయాలతో ప్రాణాలతో బయటపడగా, మరో పైలెట్ కోసం వెతుకున్నట్లు అధికారులు తెలిపారు.

దిల్లీలో స్కూటీని ఢీకొట్టి 350మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు, ఇద్దరు యువకులు మృతి

దిల్లీలోని సుల్తాన్‌పురిలో జరిగిన అంజలి తరహా ఘటన దేశ రాజదానిలో మరొకటి చోటుచేసుకుంది. స్కూటీ‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను కారు ఢీకొట్టింది. ఆ తర్వాత వారిని 350 మీటర్లు లాక్కెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు.

ఫైనల్‌లో తలపడనున్న బెల్జియం, జర్మనీ

పురుషుల హాకీ వరల్డ్‌కప్ ఫైనల్స్ లో బెల్జియం, జర్మనీ ప్రవేశించాయి. సెమీఫైనల్స్ లో ఆస్ట్రేలియాపై జర్మనీ విజయం సాధించి, ఫైనల్స్ కి చేరకుంది.

ఉద్యోగాలను తగ్గించాలనే గూగుల్ నిర్ణయంపై 'Xooglers' స్పందన

ఈ నెల ప్రారంభంలో, ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో సిబ్బందిని తొలగించిన కంపెనీల లిస్ట్ లో గూగుల్ చేరింది. గూగుల్ పేరెంట్ సంస్థ ఆల్ఫాబెట్ 12,000 మంది ఉద్యోగులను తొలగించాలని తీసుకున్న నిర్ణయం చాలామంది జీవితాలను తలకిందులు చేసింది. ఇది బాధిత ఉద్యోగుల నుండి వ్యతిరేకతకు దారితీసింది.

Maserati MC20 Cielo v/s Ferrari Portofino M, ఏది మంచిది

Maserati భారతదేశంలో సరికొత్త MC20 Cielo కోసం బుకింగ్ ప్రారంభించింది. ఓపెన్-టాప్ స్పోర్ట్స్ కారు, హై-ఎండ్ పెర్ఫార్మెన్స్ కార్ సెగ్మెంట్‌లో Ferrari Portofino Mకు పోటీగా ఉంటుంది. లగ్జరీ, స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ Maserati గత ఏడాది మేలో MC20 కన్వర్టిబుల్ వెర్షన్‌ను ప్రకటించింది.

S23 అల్ట్రా నుండి కోకా-కోలా ఫోన్ వరకు భారతదేశంలో త్వరలో లాంచ్ కాబోతున్న స్మార్ట్‌ఫోన్‌లు

2023 సంవత్సరం మొదలుకాగానే భారతదేశంలో iQOO 11, TECNO PHANTOM X2 సిరీస్, Redmi Note 12 సిరీస్ లాంచ్ అయ్యాయి. సామ్ సంగ్, OnePlus వంటి బ్రాండ్‌లు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి, అయితే Realme ప్రత్యేకమైన Coca-Cola బ్రాండెడ్ ఫోన్ ని కూడా లాంచ్ చేస్తుంది.

మెగాస్టార్ నెక్స్ట్: చిరంజీవి చేసిన మార్పులకు ఒప్పుకున్న యంగ్ డైరెక్టర్?

వాల్తేరు వీరయ్య విజయం సాధించడంతో చిరంజీవి, తన నెక్స్ట్ సినిమా గురించి ఆలోచించే పనిలో పడ్డారు. ప్రస్తుతం చిరంజీవి చేతిలో భోళాశంకర్ సినిమా మాత్రమే ఉంది.

ప్రధాని మోదీ రాజస్థాన్‌ పర్యటనలో రాజకీయ కోణం? ‌అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమా?

ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తొమ్మిది రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా రాజస్థాన్‌‌పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో డిసెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని బీజేపీ భావిస్తోంది. అందుకే మోదీ కూడా రాజస్థాన్‌పై శ్రద్ధ కనబరుస్తున్నారు.

బాగా అలసిపోయాను, కొంచె రెస్ట్ కావాలి: డేవిడ్ వార్నర్

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ మధ్య విశ్రాంతి లేకుండా మ్యాచ్ లు ఆడుతున్నాడు. జింబాబ్వే, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్ లతో జరిగిన వన్డే సిరీస్ లలో బిజిగా గడిపాడు. టీ20, టెస్టు సిరీస్‌లోనూ విరామం లేకుండా ఆస్ట్రేలియా తరుపున బరిలోకి దిగాడు.

పెట్: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెంపుడు జంతువుల గురించి తెలుసుకోండి

పెంపుడు జంతువుల్లో కొన్ని అరుదైన జాతులను కొనుక్కోవడానికి ఆస్తులు అమ్మాల్సి ఉంటుంది. సమాజంలో స్థాయి కోసం ఇలాంటి పెంపుడు జంతువులను చాలామంది పెంచుకుంటారు.

మహారాష్ట్ర కొత్త గవర్నర్‌గా కెప్టెన్ అమరీందర్ సింగ్ నియామకం!

బీజేపీ నాయకుడు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మహారాష్ట్ర కొత్త గవర్నర్‌గా నియామకమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తొలుత సుమిత్రా మహాజన్‌ను తదుపరి గవర్నర్‌గా నియమించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సుమిత్రకు బదులుగా అమరీందర్ నియామకానికే కేంద్రం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

వాషింగ్టన్ సుందర్ మెరిసినా, టీమిండియా పరాజయం

రాంచి వేదికగా శుక్రవారం జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్ 21 పరుగుల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన ఇండియా.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.

అన్ స్టాపబుల్: త్రివిక్రమ్ తో స్నేహం చేయాల్సొచ్చిందన్న పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. బాలయ్య వ్యాఖ్యాతగా ఉన్న అన్ స్టాపబుల్ షో నుండి పవన్ కళ్యాణ్ ప్రోమో విడుదలైంది.

27 Jan 2023


ఉద్యోగ కోతల లిస్ట్ లో చేరిన మరో సాఫ్ట్వేర్ దిగ్గజం SAP, 3,000 మంది తొలగింపు

జర్మన్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం SAP కూడా ఉద్యోగులను తొలగించే టెక్ కంపెనీల లిస్ట్ లో చేరింది. సంస్థ 3,000 మందిని అంటే ప్రపంచవ్యాప్తంగా 2.5%మంది సిబ్బందిని తొలగించనున్నట్లు ప్రకటించింది.

డీజీసీఏ: ప్రయాణికులను ఎక్కించుకోకుండా వెళ్లిపోయిన 'గో ఫస్ట్‌' విమానానికి రూ.10లక్షల జరిమానా

బెంగళూరు విమానాశ్రయంలో 55 మంది ప్రయాణికులను ఎక్కించుకోకుండా వెళ్లిపోయిన 'గో ఫస్ట్‌' విమానానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.10 లక్షల జరిమానా విధించింది.

మీ పిల్లలకు చదువు మీద ఆసక్తి కలిగించడానికి చేయాల్సిన పనులు

పిల్లల్ని పెంచడం ఒక కళ. దానికి చాలా నేర్పు కావాలి, ఓర్పు కావాలి. పిల్లల పెంపకంలో మిగతా విషయాలను వదిలేస్తే, వాళ్ళకు చదువు మీద ఆసక్తి కలిగించడానికి చాలా ప్రయాస పడాల్సి వస్తుంది.

Women's Under 19 T20 World Cup ఫైనల్లో ఇండియా

అండర్ 19 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు భారత్ చేరుకుంది. సెమీఫైనల్లో న్యూజిలాండ్ ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్ బెర్తును ఇండియా ఖరారు చేసుకుంది.

లెట్స్ గెట్ మ్యారీడ్ అనే సినిమాతో వస్తున్న మాజీ కెప్టెన్ ధోనీ

భారత క్రికెట్ జట్టుకు వన్డే ఇంటర్నేషనల్ ప్రపంచ కప్, 20-20 ఇంటర్నేషనల్ ప్రపంచ కప్ అందించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, క్రికెట్ నుండి విశ్రాంతి తీసుకున్నాక ధోనీ ఎంటర్ టైన్ మెంట్స్ పేరుతో సినిమా ప్రొడక్షన్ కంపెనీని మొదలు పెట్టాడు.

గుజరాత్: దంపతులు వెళ్తున్న బైక్‌ను ఢీకొని, భర్తను 12కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు

దిల్లీలోని సుల్తాన్‌పురిలో అంజలిని కారు ఢీకొట్టి 13 కిలోమీటర్లు లాక్కెళ్లిన తరహా ఘటన తాజాగా గుజరాత్‌లో జరిగింది. సూరత్‌లో దంపతులు వెళ్తున్న బైక్‌ను ఓ కారు ఢీకొట్టి, బైకర్‌ను దాదాపు 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో భర్త అక్కడిక్కడే మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలైన ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

భారతదేశంలో డీజిల్ ఇంజిన్ తో ఉన్న ఇన్నోవా Crysta అమ్మకాలు ప్రారంభించిన టయోటా సంస్థ

ఒక చిన్న విరామం తర్వాత, టయోటా ఇన్నోవా Crysta భారత మార్కెట్లో తిరిగి వచ్చింది. అయితే ఈ సారి కేవలం డీజిల్ తో మాత్రమే నడిచే మోడల్ వినియోగదారుల ముందుకు వచ్చింది. జనాదరణ పొందిన MPVని ఇప్పుడు రూ. 50,000 టోకెన్ అమౌంట్‌తో బుక్ చేసుకోవచ్చు. ఇన్నోవా హైక్రాస్ మోడల్‌ టయోటా మొదట నిలిపేసినా, దాని డిమాండ్ కారణంగా మళ్ళీ తిరిగి తీసుకువచ్చింది.

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం ఐసీసీ చరిత్రాత్మక నిర్ణయం

మహిళల టీ20 ప్రపంచకప్ కోసం ఐసీసీ చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ ఐసీసీ ఈవెంట్‌లో మహిళా అధికారులను నియమిస్తూ ప్రకటనను విడుదల చేసింది. ఎనిమిదో ఎడిషన్ ప్రతిష్టాత్మక పోటీలో 13 మంది మహిళా అధికారులు ప్రస్తుతం పనిచేయనున్నారు.

అమెజాన్ లో రూ. 77,000 తగ్గింపుతో అందుబాటులో ఉన్న ASUS ROG Zephyrus M16

ASUS ROG Zephyrus M16 (2022) ల్యాప్‌టాప్, అత్యుత్తమ-నాణ్యమైన స్క్రీన్, సమర్థవంతమైన CPU/GPU కాన్ఫిగరేషన్ తో పాటు దీర్ఘకాలం ఉండే బ్యాటరీతో వస్తుంది. తక్కువ CPU లోడ్‌లు, సమర్థవంతమైన GPUతో శక్తివంతమైన గేమింగ్ మెషీన్ కావలనుకుంటే, ఈ అమెజాన్ డీల్‌ గురించి తెలుసుకోండి.

ఫిబ్రవరి 5న బీఆర్ఎస్‌లో చేరనున్న ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్!

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ తన కుమారుడు శిశిర్‌తో కలిసి బీజేపీని వీడి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)లో చేరనున్నట్లు ప్రకటించారు.

దుఃఖాన్ని ఆపుకుంటూ సంతోషం కోసం చూస్తున్నారా? పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నట్టే

బాధగా ఉంటే బాధపడాలి, సంతోషంగా అనిపిస్తే ఎగిరి గంతేయాలి. అంతేకానీ బాధల్లో ఉన్నప్పుడు పాజిటివిటీని వెతుక్కుని మరీ సంతోషంగా ఉండాలని ప్రయత్నిస్తే అది మీ పాలిట యమపాశంలా మారి మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.

టీమిండియా గొప్ప జట్టు : పాక్ ప్లేయర్

టీమిండియాపై పాకిస్తాన్ వెటరన్ వికెట్ కీపర్ కమ్రాన్ ఆక్మల్ ప్రశంసలు కురిపించాడు. భారత జట్టును తక్కువ చేయాల్సిన పనిలేదని, దశాబ్ద కాలంగా ఐసీసీ ట్రోఫీ గెలవకపోయినా భారత్ గొప్ప జట్టేనని తెలిపాడు.

లోకేశ్ పాదయాత్రలో కుప్పకూలిన నందమూరి తారకరత్న, ఆస్పత్రికి తరలింపు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 'యువ‌గళం' పేరుతో తన పాదయాత్రను శుక్రవారం కుప్పం మొదలుపెట్టారు. అయితే తొలిరోజు పాదయాత్రలో పాల్గొన్న సినీనటుడు నందమూరి తారకరత్న.. లోకేశ్‌తో నడుస్తున్న క్రమంలో అస్వస్థతకు గురై, ఒక్కసారిగా కుప్పకూలి పోయారు.

హిండెన్‌బర్గ్‌ పై చట్టపరమైన చర్యలకు సిద్దమైన అదానీ సంస్థ

అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసానికి పాల్పడినట్లు హిండెన్‌బర్గ్ ఆరోపించడంతో ఇప్పుడు అదానీ గ్రూప్ దానిపై చట్టపరమైన చర్యల తీసుకోవడానికి సిద్దమైంది. హిండెన్‌బర్గ్ ఆరోపణల తర్వాత, బుధవారం మార్కెట్ విలువలో అదానీ గ్రూప్ కంపెనీలు రూ. రూ.85,761 కోట్లు కోల్పోయాయి.బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఒక రోజులో సుమారు $6 బిలియన్లను ఆ సంస్థ కోల్పోయింది.

కుప్పంలో లోకేశ్ 'యువగళం' పాద‌యాత్ర ప్రారంభం

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 'యువగళం' పేరుతో తన పాద యాత్రకు శ్రీకారం చుట్టారు.

స్మార్ట్ ఫోన్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నారా? మెదడు పనితీరు ఎలా దెబ్బతింటుందో తెలుసుకోండి

స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మనలో ఒక అవయవంగా మారిపోయింది. దాన్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారు. ఏ సమాచారం కావాలన్నా స్మార్ట్ ఫోన్ మీదే ఆధారపడుతున్నారు.

ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డును గెలుచుకున్న ఆసిఫ్ షేక్

నేపాల్ వికెట్ కీపర్ ఆసిఫ్ షేక్ మైదానంలో గొప్ప క్రీడాస్ఫూర్తిని చాటుకోవడంతో అరుదైన గౌరవం లభించింది. ఫిబ్రవరిలో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌కి చెందిన బ్యాటర్ ఆండీ మెక్‌బ్రైన్ పరుగు తీసే క్రమంలో మధ్యలో పడిపోయాడు. అతడ్ని రనౌట్ చేసే అవకాశం ఉన్నా ఆసిఫ్ చేయలేదు.

ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడులను ఖండించిన భారత్

ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జనవరి 12 నుంచి 23 మధ్య మెల్‌బోర్న్‌లో మూడు హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. భారత్‌పై వ్యతిరేక భావజాలంతో 74వ గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో ఖలిస్థాన్ మద్దతుదారులు ఈ దాడులు చేశారు.

హీరో సూర్యకు గొంతునందించిన డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇక లేరు

పాపులర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి ఈరోజు ఉదయం చెన్నైలో తన నివాసంలో కన్నుమూసారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా శ్రీనివాస మూర్తి తుదిశ్వాస విడిచాడు.

మారుతీ సుజుకి Fronx v/s హ్యుందాయ్ VENUE, ఏది మంచిది

మారుతి సుజుకి ఇటీవల ముగిసిన ఆటో ఎక్స్‌పో 2023లో సరికొత్త SUV Fronxను విడుదల చేసింది. ఈ సంస్థ భారతదేశంలో కాంపాక్ట్ SUV కేటగిరీలో ఫీచర్-లోడెడ్ హ్యుందాయ్ VENUEకి పోటీగా దీనిని పరిచయం చేసింది.

ప్రియురాలిని పెళ్లి చేసుకున్న టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలైన మేహా పటేల్‌ను అక్షర్ గురువారం పెళ్లి చేసుకున్నాడు. బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల మధ్య వడోదరలో వైభవంగా జరిగింది. పెళ్లికి పలువురు క్రికెటర్లు, ప్రముఖులు హజరయ్యారు. ప్రస్తుతం అక్షర్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నేడు దిల్లీ యూనివర్శిటీలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన

ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించినా దేశంలో ప్రదర్శనలు ఆగడం లేదు. ముఖ్యంగా యూనివర్సిటీల్లో పలు విద్యార్థి సంఘాలు ప్రతిష్టాత్మంగా తీసుకొని ప్రదర్శిస్తున్నాయి. తాజాగా దిల్లీ యూనివర్సిటీలో ఎన్ఎస్‌యూఐ, భీమ్ ఆర్మీ, వామపక్షతో పాటు ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నార్త్ క్యాంపస్‌లో ప్రదర్శించనున్నట్లు పిలుపునిచ్చారు.

సర్జికల్ స్ట్రైక్స్: 'జవాన్లపై నమ్మకం ఉంది, కానీ బీజేపీని విశ్వసించలేం'

2016లో భారత దళాలు జరిపిన సర్జికల్ దాడులకు ఎలాంటి రుజువు లేదని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ సింగ్‌‌కు మరో హస్తం పార్టీ నాయకుడు రషీద్ అల్వీ మద్దుతుగా నిలిచారు. సర్జికల్ స్ట్రైక్ వీడియోను విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

వెస్టిండీస్ మెంటర్‌గా బ్రియన్ లారా

వెస్టిండీస్ జట్టులో ఒకప్పుడు హడలెత్తించే బ్యాటర్లు, బౌలర్లు ఉండేవారు. క్రమంగా వెస్టిండీస్ తమ ప్రభావాన్ని కోల్పోయింది. ప్రస్తుతం వెస్టిండీస్ జాతీయ జట్టుకు ఆటగాళ్లు కరువయ్యే పరిస్థితి వచ్చింది.

దేశం కోసం త్యాగం చేసిన అజ్ఞాత వీరులకు సమర్పణగా సాయిధరమ్ తేజ్ షార్ట్ ఫిలిమ్

బైక్ ప్రమాదం నుండి కోలుకున్న సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, విరూపాక్ష సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఐతే ఆ సినిమా కంటే ముందే మ్యూజికల్ షార్ట్ ఫిలిమ్ ని మన ముందుకు తీసుకురానున్నాడు.

జనవరి 27న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

ఉద్యోగ కోతలు మొదలుపెట్టిన మరో కంపెనీ, 3,900 ఉద్యోగులను తొలగించనున్న IBM

ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్ (IBM)కూడా ఉద్యోగులను తొలగించే టెక్ దిగ్గజాల జాబితాలో చేరింది. 3,900 మంది సిబ్బందిని అంటే ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థలో 1.5% మందిని తొలగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ తొలగింపులు asset divestmentలో అంటే కొన్ని రంగాల్లో తమ వ్యాపారాన్ని నిలిపివేయడంలో భాగమని అంతేకాని పనితీరు అంచనాల ఆధారంగా కాదని సృష్టం చేసింది.

టీమిండియా విరాట్ కోహ్లీపైనే ఆధారపడి ఉంది: బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్

టెస్టులో ఆల్ టైం సక్సెస్ ఫుల్ కెప్టెన్లలో విరాట్ కోహ్లీ ఒకడు. అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ల జాబితాలో కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరబ్ గంగూలీతో విభేదాలు కారణంగా 2022 జనవరిలో అర్ధాంతరంగా కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి.

నల్లమచ్చలు పోగొట్టడం నుండి ముడతలను దూరం చేసే వరకు చర్మానికి జిన్సెంగ్ చేసే ప్రయోజనాలు

జిన్సెంగ్ అనేది ఒక మూలిక. ఆసియా దేశాల్లో ఎక్కువగా ఉత్తర అమెరికా ప్రాంతాల్లో అక్కడక్కడా కనిపించే ఈ మూలికలో ఆయుర్వేద లక్షణాలు ఉన్నాయి.

కుల్దీప్ యాదవ్‌పై ప్రశంసల వర్షం కురిపించిన టీమిండియా మాజీ ప్లేయర్

టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై టీమిండియా మాజీ ప్లేయర్ వసీం జాఫర్ ప్రశంసల వర్షం కురిపించాడు. కుల్దీప్ అద్భుతమైన బౌలర్ అని, టీ20 సిరీస్‌లో మె‌రుగ్గా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ నేడు రాంచిలో తలపడనున్నాయి.

అలస్కాలో కొత్త తరహా బిజినెస్: కుక్కలను వాకింగ్ తీసుకెళ్ళడానికి ప్రత్యేక బస్

కుక్కలను వాకింగ్ తీసుకెళ్ళడానికి ప్రత్యేకమైన బస్ ఉందంటే మీరు నమ్ముతారా? ఇంటింటికి వచ్చి కుక్కపిల్లలను బస్ లో తీసుకెళ్ళి, ఒక ప్రదేశంలో స్వేఛ్ఛగా వదిలేసి, టైమ్ కాగానే మళ్ళీ ఇంటి దగ్గర దింపి వెళ్లే బస్ గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపొతారు.

హెచ్‌సీయూలో ఉద్రిక్తత: మోదీ బీబీసీ డాక్యుమెంటరీ vs కాశ్మీర్ ఫైల్స్‌ ప్రదర్శించిన ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ఎస్ఎఫ్ఐ, కాశ్మీర్ ఫైల్స్‌ సినిమాను ఏబీవీపీ పోటీ పడి మరీ ప్రదర్శించడంతో హెచ్‌సీయూలో మరోసారి వివాదం రాజుకుంది.

ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్స్‌లో సానియా పరాజయం

సానియా మీర్జా తన కెరీర్ గ్రాండ్ స్లామ్‌ను ఓటమితో ముగించింది. బ్రెజిల్ జోడి లూయిసా స్టెఫానీ, రఫెల్ మాటోస్ చేతిలో సానియా-బోపన్న జోడి ఓడిపోయింది. మ్యాచ్‌ తర్వాత సానియా మిర్జా భావోద్వేగానికి గురైంది. 18 ఏళ్ల గ్రాండ్ స్లామ్ కెరీర్‌ను టైటిల్‌తో ముగించాలని భావించిన సానియాకు నిరాశే ఎదురైంది.

భారతదేశంలో ప్రారంభమైన మహీంద్రా XUV400 EV బుకింగ్స్

భారతదేశానికి చెందిన SUV స్పెషలిస్ట్ మహీంద్రా XUV400 కోసం బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. రూ. 21,000 టోకెన్ అమౌంట్ తో XUV400ను బుక్ చేసుకోవచ్చు. ఇవి మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉన్నాయి. మహీంద్రాకు ఇదే మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ SUV

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా సై

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. నేడు టీ20 సమరానికి సిద్ధమైంది. రోహిత్‌శర్మ, కోహ్లీ, కెఎల్ రాహుల్ విశ్రాంతి తీసుకోగా.. హర్ధిక్ కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టనున్నాడు. ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో న్యూజిలాండ్‌ ఉంది.

అమెరికా దాడుల్లో ఇస్లామిక్ స్టేట్ సీనియర్ లీడర్ సహా 11మంది హతం

ఉత్తర సోమాలియా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్)కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో ఐసీస్ సీనియర్ లీడర్‌తో పాటు మరో 10మంది మృతి చెందారు.

టాలీవుడ్ లో విషాదం: సీనియర్ నటి జమున కన్నుమూత

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. సత్యభామ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అలనాటి అందాల నటి జమున (86) కన్నుమూశారు. గత రాత్రి హైదరాబాద్ లో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

ఆండ్రాయిడ్ విభాగంలో తగ్గనున్న గూగుల్ ఆధిపత్యం

గత వారం ఆండ్రాయిడ్‌కు సంబంధించిన వ్యాపార విధానాలను మార్చాలని సంస్థను కోరుతూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) ఆర్డర్‌కు వ్యతిరేకంగా గూగుల్ చేసిన పిటిషన్‌ను స్వీకరించడానికి భారత సుప్రీంకోర్టు నిరాకరించింది. అందుకే దేశంలో ఆండ్రాయిడ్ లైసెన్సింగ్‌కు సంబంధించిన కొన్ని మార్పులను గూగుల్ ప్రకటించింది.

సూపర్ ఫామ్‌లో రవీంద్ర జడేజా

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రంజీ మ్యాచ్‌లో దుమ్ములేపుతున్నాడు. తమిళనాడుతో జరుగుతున్న రంజీ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసి సత్తా చాటాడు. ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు జడేజా ఫామ్‌లోకి రావడం శుభ సూచకమే అని చెప్పొచ్చు.

సర్కార్ నౌకరి: హీరోగా మారుతున్న సింగర్ సునీత కొడుకు

సినిమా ఇండస్ట్రీలో వారసులకు కొదవలేదు. వరుసపెట్టి సినిమా ఇండస్ట్రీకి చెందిన కుటుంబాల నుండి వారసులు వస్తూనే ఉన్నారు. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో ఒక్కో కుటుంబం నుండి ఎక్కువ మొత్తంలో వారసులు ఉన్నారు.