LOADING...

24 Feb 2023


జోయ్ అలుక్కాస్ సంస్థకు చెందిన Rs. 305 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం

ప్రముఖ ఆభరణాల గొలుసు జోయ్ అలుక్కాస్కు చెందిన Rs. 305.84 కోట్ల విలువైన ఆస్తులను దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం నాడు జప్తు చేసింది. ఆ సంస్థ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపించింది.

భారతదేశంలో BS6 ఫేజ్ 2: వివరంగా RDE, OBD 2 నిబంధనలు తెలుసుకుందాం

కార్లు, బైక్‌లు, స్కూటర్లు, ట్రక్కుల నుండి వచ్చే హానికరమైన గ్రీన్‌హౌస్ వాయువులను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ నుండి భారతదేశంలో అప్డేట్ చేసిన BS6 ఫేజ్ 2 ఉద్గార నిబంధనలను అమలు చేయనుంది. రెండవ దశలో నాలుగు చక్రాల వాహనాలకు రియల్ డ్రైవింగ్ ఉద్గారాలు (RDE), కార్పొరేట్ సగటు ఇంధన ఆర్థిక వ్యవస్థ (CAFE 2), ద్విచక్ర వాహనాల కోసం ఆన్-బోర్డ్ డయాగ్నోస్టిక్స్ (OBD 2) ఉన్నాయి.

కాంగ్రెస్ ప్లీనరీ: సీడబ్ల్యూసీకి ఎన్నికలు వద్దంటూ తీర్మానం; ఖర్గేకు బాధ్యత అప్పగింత

ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ కీలక బాడీ అయిన సీడబ్ల్యూసీ (కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ) ఎన్నికలు వద్దంటూ తీర్మానించారు.

తాజా డిజైన్, కొత్త ఫీచర్‌లతో వర్క్‌స్పేస్ యాప్‌లను అప్డేట్ చేసిన గూగుల్

డాక్స్, షీట్‌లతో సహా గూగుల్ తన వర్క్‌స్పేస్ అప్లికేషన్‌ల కోసం కొత్త ఫీచర్‌లను కొన్ని డిజైన్ మార్పులను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్‌లలో స్మార్ట్ కాన్వాస్, క్యాలెండర్ ఆహ్వాన టెంప్లేట్‌లు, వేరియబుల్స్, ఎమోజి ఓటింగ్ చిప్‌లు ఉన్నాయి. కొత్త యాడ్-ఆన్‌లు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి.

తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ విలువను రూ.20.5లక్షల కోట్లకు తీసుకెళ్లడమే లక్ష్యం: కేటీఆర్

ప్రపంచ లైఫ్ సైన్సెస్ పరిశ్రమకు తెలంగాణను నాలెడ్జ్ క్యాపిటల్‌గా మార్చడమే తమ ధ్యేయమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. 2030 నాటికి తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ విలువను 250 బిలియన్ డాలర్లకు (రూ.20.5 లక్షల కోట్లు) తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

ఆస్ట్రేలియాకు గుడ్‌న్యూస్.. మూడో టెస్టుకు కామెరాన్ గ్రీన్ సిద్ధం

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గాయంతో మొదటి రెండు మ్యాచ్ లకు కామెరాన్ గ్రీన్ దూరమయ్యాడు. ఇప్పటికే ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా మూడో టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. మూడో టెస్టు కోసం తాను వందశాతం ఫిట్‌గా ఉన్నానని ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ చెప్పాడు.

నెగెటివ్ ఎనర్జీని దూరం చేసి పాజిటివ్ గా ఉండాలంటే చేయాల్సిన పనులు

మనిషి అందంగా కనిపించాలంటే ముఖం అందంగా ఉంటే సరిపోదు. మనిషిలోని ఆత్మ అందంగా ఉండాలి. అలా ఉండాలంటే మీలో పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. కొన్ని కొన్ని సార్లు మీకు తెలియకుండానే మీలో నెగెటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది.

క్లబ్ గోల్స్‌తో రికార్డు సృష్టించిన లెవాండోస్కీ

యూరోపియన్ క్లబ్ ఫుట్‌బాల్‌లో రాబర్ట్ లెవాండోస్కీ అరుదైన రికార్డును సృష్టించాడు. 2022-23లో UEFA యూరోపా లీగ్ ప్లేఆఫ్ 2వ-లెగ్ టైలో మాంచెస్టర్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో బార్సిలోనా తరపున 25వ గోల్ చేసి రికార్డుకెక్కాడు.

మేఘాలయ: నరేంద్ర మోదీ సమాధిపై కాంగ్రెస్ కామెంట్స్; అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ప్రధాని

కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. నాగాలాండ్‌లో శుక్రవారం ప్రధాని మోదీ విస్తృతంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. షిల్లాంగ్‌లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

అంతర్జాతీయ రిటైర్మెంట్ ప్రకటించిన సెర్గియో రామోస్

స్పానిష్ స్టార్ ఆటగాడు సెర్గియో రామోస్ గురువారం తన అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రామోస్ 2010 FIFA ప్రపంచ కప్, 2008, 2012లో యూరోపియన్ ఛాంపియన్ షిప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2005లో అరంగేట్రం చేసిన సెర్గియో రామోస్ అత్యధిక క్యాప్‌లు సాధించిన ఆటగాడి చరిత్రకెక్కాడు.

పెట్టుబడిదారుల కోసం ఆసియాలో రోడ్‌షో నిర్వహించనున్న అదానీ గ్రూప్

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తరవాత అదానీ గ్రూప్ స్టాక్‌లు, బాండ్లపై పెట్టుబడిదారుల విశ్వాసం సన్నగిల్లింది. నివేదిక ప్రతికూల ప్రభావాలపై పోరాడే ప్రయత్నంలో వచ్చే వారం ఆసియాలో అదానీ గ్రూప్ స్థిర-ఆదాయ రోడ్‌షోను నిర్వహిస్తుంది.

2024 బి ఎం డబ్ల్యూ X5 v/s 2024 మెర్సిడెజ్-బెంజ్ GLE ఏది కొనడం మంచిది

వివిధ ప్రపంచ మార్కెట్ల కోసం ఈ నెలలో X5 SUV 2024 వెర్షన్ ను బి ఎం డబ్ల్యూ ప్రకటించింది. ఇది ఆగస్టు నాటికి భారతదేశంలోకి వస్తుందని తెలిపింది. అయితే మార్కెట్లో ఇది 2024 మెర్సిడెజ్-బెంజ్ GLEకి పోటీగా ఉంటుంది.

ఏజెంట్ సినిమాకు పాజిటివ్ గా పరిస్థితులు: అత్యధిక ధరకు అమ్ముడైన థియేట్రికల్ రైట్స్

అక్కినేని అఖిల్ హీరోగా రూపొందిన ఏజెంట్ మూవీ, విడుదలకు సిద్ధం అవుతోంది. ఎన్నోరోజులుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం, పాన్ ఇండియా లెవెల్లో దేశవ్యాప్తంగా రిలీజ్ కావడానికి ప్రయత్నాలు చేస్తోంది.

గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించిన సూఫియా సూఫీ

భారత్ ఆల్ట్రా రన్నర్ సుఫియా సూఫీ ఖాన్ మరోసారి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది . ఖతార్‌లో వేగవంతమై నరన్నింగ్ పూర్తి చేసి ఈ ఘనతను సాధించింది. తన కెరియర్‌లో నాల్గొసారి గిన్నిస్ ప్రపంచ రికార్డును సాధించడానికి ఎన్నో అడ్డంకులను ఆమె అధిగమించింది.

కిచెన్: మైక్రోవేవ్ లో సులభంగా తయారు చేయగలిగే రెసిపీస్ తెలుసుకోండి

మైక్రోవేవ్ తో ఆహారాన్ని వేడిచేయడమే కాదు ఆహారాన్ని వండొచ్చు కూడా. ప్రస్తుతం మైక్రోవేవ్ తో సులభంగా తయారు చేసుకోగలిగే రెసిపీస్ తెలుసుకుందాం.

రన్‌వేని తాకిన విమానం తోక భాగం; తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ

కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం పూర్తిస్థాయి ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

నాసా స్పేస్ ఎక్స్ ప్రయోగిస్తున్న క్రూ-6 మిషన్ గురించి వాస్తవాలు

నాసా స్పేస్ ఎక్స్ క్రూ-6 మిషన్ త్వరలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరుతుంది. ఫిబ్రవరి 27న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగం జరగనుంది.

మన్సుఖ్ మాండవియా: 'కరోనా టీకా ద్వారా భారత్ 3.4మిలియన్ల మంది ప్రాణాలను కాపాడింది'

కరోనా సమయంలో ప్రధానమంత్రి మోదీ నాయకత్వాన్ని కేంద్ర ఆరోగ్య‌మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రశంసించారు. దేశవ్యాప్తంగా విస్తృతంగా కరోనా టీకా కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల కోవిడ్ సమయంలో దేశంలో 3.4మిలియన్ల మంది ప్రాణాలను కాపాడగలిగినట్లు ఆయన చెప్పారు.

వీకెండ్ మ్యారేజ్ గురించి విన్నారా? జపాన్ లో ట్రెండ్ అవుతున్న పెళ్ళి సిస్టమ్ గురించి తెలుసుకోండి

రోజులు మారుతున్న కొద్దీ కొత్త కొత్త పద్దతులు పుట్టుకొస్తుంటాయి. అవసరాల ప్రకారం ఆచారాలు మారిపోతుంటాయి. దాన్నెవ్వరూ ఆపలేరు. ప్రస్తుతం జపాన్ లో వీకెండ్ మ్యారేజెస్ ట్రెండ్ నడుస్తోంది. దాని కథేంటో తెలుసుకుందాం.

PSL 2023: అర్ధ సెంచరీతో చెలరేగిన బాబార్ ఆజం

ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2023 పోరులో పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ అజామ్ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. దీంతో తన కెరియర్‌లో 73వ టీ20 హాఫ్ సెంచరీని నమోదు చేయడం గమనార్హం.

న్యూసెన్స్ టీజర్ రిలీజ్: రాజకీయాలే టార్గెట్ గా నవదీప్ కొత్త చిత్రం

ఓటీటీ వచ్చాక థియేటర్లకు దెబ్బపడిందన్నది నిజమే అయినా, చాలా కొత్త కంటెంట్ ఓటీటీ ద్వారా విడుదల అవుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహపడాల్సిన పనిలేదు.

ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగాను నామినేట్ చేసిన అమెరికా

ప్రపంచబ్యాంక్‌లో భారతీయ-అమెరికన్‌ నాయకత్వం వహించే సూచనలు కనిపిస్తున్నాయి. మాజీ మాస్టర్ కార్డ్ సీఈఓ వ్యాపారవేత్త అజయ్ బంగాను ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా US నామినేట్ చేసింది. బ్యాంక్ ప్రస్తుత చీఫ్ డేవిడ్ మాల్పాస్ ఈ నెల ప్రారంభంలో పదవీవిరమణ నిర్ణయాన్ని ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ గురువారం బంగా నామినేషన్‌ను ప్రకటించారు.

గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి కొత్త టెక్నాలజీ

భావ్‌నగర్‌కు చెందిన సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSMCRI) అద్భుతమైన ఆవిష్కరణ మెమ్బ్రేన్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఇది గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి వ్యయాన్ని భారీగా తగ్గించి, భవిష్యత్తులో గ్రీన్ ఇంధనంగా మారే అవకాశం ఉంది.

అమరావతి భూముల కేసు: హైదరాబాద్‌లో మాజీ మంత్రి నారాయణ కుమార్తె ఇంట్లో సీఐడీ సోదాలు

అమరావతి భూముల కేసులో మాజీ మంత్రి పి.నారాయణ కుమార్తె నివాసంలో ఆంధ్రప్రదేశ్‌ నేరపరిశోధన విభాగం (సీఐడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. మాదాపూర్‌లో ఉంటున్న ఆమె ఇంట్లో ఉదయం నుంచి సీఐడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

Womens T20 World Cup 2023 Finalలోకి ఏడోసారి అడుగుపెట్టిన ఆస్ట్రేలియా

ఐసీసీ టీ20 మహిళల వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టు అదరగొడుతోంది. ప్రస్తుత ఛాంపియన్ ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించి ఏడోసారి వరల్డ్ కప్ టీ20 ఫైనల్లోకి చేరుకుంది. ఇంగ్లండ్-దక్షిణాఫ్రికా మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్ పోరులో విజేతతో తలపడనుంది. ఫైనల్ ఫిబ్రవరి 26న న్యూలాండ్స్‌లో జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణస్వీకారం, సీఎం జగన్‌ హాజరు

ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు, మంత్రులు, న్యాయమూర్తులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం రాజ్‌భవన్‌లో తేనేటి విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌: త్వరలోనే అదానీ గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల పనులు ప్రారంభం- 2028నాటికి పూర్తి చేయడమే లక్ష్యం

ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లాలోని చిత్రావతి రిజర్వాయర్‌ వద్ద అదానీ గ్రూప్‌ చేపట్టనున్న 500మెగావాట్ల పంప్‌డ్‌ స్టోరేజీ హైబ్రిడ్‌ గ్రీన్‌‌ఎనర్జీ ప్రాజెక్టు నివేదిక తుది దశకు చేరుకుందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ జిల్లా మేనేజర్ కోదండరామమూర్తి తెలిపారు.

ఆస్ట్రేలియాకు మరో బిగ్ షాక్.. పాట్ కమిన్స్ దూరం

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్న ఆస్ట్రేలియాకు మరో బిగ్ షాక్ తగిలింది. వ్యక్తిగత పనిమీద విదేశాలకు వెళ్లిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ మూడో టెస్టుకు దూరమయ్యాడు. దీంతో వైస్ కెప్టెన్‌గా ఉన్న స్టీవ్ స్మిత్ మూడో టెస్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉంది.

Spotify కొత్త AI DJ సంగీతాన్ని సృష్టించగలదు, కామెంటరీ అందించగలదు

Spotify అత్యుత్తమ ఆడియో నాణ్యతతో సంగీతాన్ని అందించకపోవచ్చు, కానీ సరైన సమయంలో సరైన సంగీతాన్ని అందించడంలో ముందుంటుంది. ఈ ఆడియో స్ట్రీమింగ్ వేదిక ఇప్పుడు తన కొత్త AIతో పనిచేసే DJతో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ChatGPT విజయవంతమైన తర్వాత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు జనాదరణ విపరీతంగా పెరుగుతుండటంతో, టెక్ కంపెనీలు AI-ఆధారిత ప్రోడక్ట్ తో వినియోగదారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. OpenAI జూక్‌బాక్స్ నుండి రాయల్టీ రహిత సంగీతాన్ని సృష్టించగల Beatovan.ai వరకు ఇటువంటి ఉత్పత్తులు కొత్తేమి కాదు. ఇప్పుడు, Spotify కూడా ఆ లిస్ట్ లో చేరింది.

ఇండియాలో హాలీవుడ్ సృష్టిస్తానంటున్న రానా

సోనీ లైవ్ లో స్ట్రీమింగ్ అవుతున్న నిజం విత్ స్మిత టాక్ షో ప్రోగ్రామ్ కి అతిధిగా వచ్చిన రానా దగ్గుబాటి, భారతీయ సినిమా గురించి ఆసక్తికరంగా మాట్లాడారు. సింగర్ స్మిత వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న షోలోకి నాని తో పాటు వచ్చారు రానా.

ప్రపంచంలో తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన హ్యారీ బ్రూక్

ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ టెస్టులో చేలరేగిపోతున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో అద్భుతంగా రాణించిన బ్రూక్.. రెండో టెస్టులో సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్ లో కేవలం 109 బంతుల్లోనే తన సెంచరీని మార్క్ ను అందుకున్నాడు.

గుత్తి-ధర్మవరం రైల్వే ప్రాజెక్టు డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనులు పూర్తి- భారీగా పెరగనున్న రైళ్ల రాకపోకలు

Dharmavaram-Gooty: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకమైన రైల్వే లింకు ప్రాజెక్టును దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. అనంతపురంలోని చిగిచెర్ల నుంచి ధర్మవరం మధ్య సెక్షన్ డబ్లింగ్, విద్యుద్ధీకరణను విజయవంతంగా పూర్తి చేసింది. తాజా పనుల పూర్తితో గుత్తి నుంచి ధర్మవరం వరకు మొత్తం 90 కిలోమీటర్ల మేర ఇప్పుడు డబుల్ రైల్వే లైన్ విద్యుద్దీకరించబడింది. గుత్తి-ధర్మవరం రైల్వే లింకును దక్షిణాది రాష్ట్రాలకు ప్రవేశ ద్వారంగా పరిగణిస్తారు.

నడుము పక్కన కొవ్వుతో చర్మం వేలాడుతోందా? ఈ ఆసనాలతో తగ్గించేయండి

పొట్ట పెరగడం వల్ల నడుము పక్కన భాగంలో కొవ్వు నిల్వలు ఎక్కువవుతాయి. దానివల్ల నడుము పక్క భాగం వేలాడినట్టుగా కనిపిస్తుంటుంది. వెనకాల నుండి చూసినపుడు ఈ చర్మం వేలాడటం స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఇంగ్లీషులో వీటిని ముద్దుగా లవ్ హ్యాండిల్స్ అంటారు.

జో రూట్ సూపర్ సెంచరీ

టెస్టులో ఇంగ్లండ్ జట్టు స్పీడ్‌ను పెంచుతోంది. గతేడాది నుంచి బజ్ బాల్ విధానంలో టెస్టు స్వరూపాన్నే ఇంగ్లండ్ మార్చేసింది. తాజాగా న్యూజిలాండ్ జరుగుతున్న టెస్టులో కూడా అదే జోరును కొనసాగిస్తోంది.

వీ-షేఫ్ బాడీ కోసం పెంచాల్సిన కండరాలు, చేయాల్సిన ఎక్సర్ సైజులు

ప్రతీ ఒక్కరూ తమ బాడీ వీ-షేప్ లో ఉంటే బాగుంటుందని అనుకుంటారు. అలాంటప్పుడు వీపు కండరాల గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏ కండరాలకు ఎలాంటి ఎక్సర్ సైజ్ చేస్తే మీరనుకున్నట్టు వీ-షేప్ లోకి బాడీ వస్తుందో తెలుసుకోండి.

BYJU సంస్థకు చెందిన కోడింగ్ ప్లాట్‌ఫారమ్ WhiteHat Jr మూసివేత

Edtech దిగ్గజ సంస్థ BYJU'S కోడింగ్ ప్లాట్‌ఫారమ్ WhiteHat Jrని కొనుగోలు చేసినప్పుడు, అది అప్పట్లో సరైన నిర్ణయం. ఆ తర్వాత ఎన్నో విమర్శలు ఈ రెండు సంస్థలు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు, BYJU'S నష్టాలను తగ్గించుకోవడానికి కోడింగ్ ప్లాట్‌ఫారమ్‌ను మూసేయాలని ఆలోచిస్తోంది.

కాంగ్రెస్ ప్లీనరీ ప్రారంభం: స్టీరింగ్ కమిటీ సమావేశానికి సోనియా, రాహల్ గైర్హాజరు

ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. తొలిరోజు జరిగే పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గైర్హాజరు కావడం గమనార్హం.

బార్సిలోనాను ఓడించిన మాంచెస్టర్ యునైటెడ్

UEFA యూరోపా లీగ్ ప్లే ఆప్ టై లో బార్సిలోనాపై మాంచెస్టర్ యునైటెడ్ విజయం సాధించింది. 2-1 తేడాతో బోర్సాలోనాను మంచెస్టర్ యునైటెడ్ ఓడించింది. మొదటి లెగ్‌లో 2-2తో డ్రా అయిన తర్వాత, రాబర్ట్ లెవాండోస్కీ పెనాల్టీ గోల్ చేయడంతో బార్సిలోనా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

రివర్ Indie v/s ఓలా S1 Pro ఏది కొనడం మంచిది

బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనం స్టార్ట్-అప్ రివర్ భారతదేశంలో తన మొట్టమొదటి ఈ-స్కూటర్, Indieని విడుదల చేసింది. మార్కెట్లో ఈ సెగ్మెంట్ లో ఓలా ఎలక్ట్రిక్ S1 Proతో పోటీ పడుతుంది. పెద్ద అండర్-సీట్ స్టోరేజ్, శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటారుతో ఓలాతో పోటీ పడుతున్న Indie గురించి తెలుసుకుందాం.

ఓటీటీలో వీరసింహారెడ్డి ఊచకోత: నిమిషంలోనే లక్షా 50వేలకు పైగా వ్యూస్

నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రం నిన్న సాయంత్రం ఓటీటీలో రిలీజ్ అయింది. సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం రికార్డులను ఊచకోత కోసేసింది. అదే మాదిరిగా ఓటీటీలో కూడా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ఓటింగ్‌; భారత్, చైనా దూరం

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ప్రారంభించి శుక్రవారం(ఫిబ్రవరి 24) నాటికి ఏడాది పూర్తయ్యింది. ఈ క్రమంలో ఇప్పటికైనా రష్యా యుద్ధాన్ని ఆపేసి ఉక్రెయిన్‌ను విడిచి వెళ్లాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తీర్మానించారు. అయితే రష్యాకు వ్యతిరేకంగా జరిగిన ఈ ఓటింగ్‌లో భారత్- చైనా దూరంగా ఉన్నాయి.

Womens T20 World Cup 2023 Semisలో భారత్ కెప్టెన్ పోరాటం వృథా

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 2023 ICC మహిళల T20 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో అద్భుతంగా పోరాడింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 52 పరుగుల చేసి సత్తా చాటింది. అయినప్పటికీ ఆస్ట్రేలియా మహిళలు విజయం సాధించడంతో ఆమె పోరాటం వృథా అయింది.

ఛత్తీస్‌గఢ్‌లో రోడ్డు ప్రమాదం: ట్రక్కు, వ్యాన్ ఢీకొని 11 మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని బలోడా బజార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును పికప్ వ్యాన్ ఢీకొన్న ఘటనలో కనీసం 11మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

నాని బర్త్ డే: కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమాలు

నాని.. ఇంట్లో కుర్రాడిలా ఉంటాడు, అందుకే ఆయన సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ. నాని.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగాడు, అందుకే కుర్రాళ్ళకు ఆయనంటే అభిమానం ఎక్కువ.

Womens T20 World Cup 2023 Semisలో భారత్ పరాజయం

మహిళల టీ20 వరల్డ్ కప్ సెమీస్ పోరులో టీమిండియా పరాజయం పాలైంది. లక్ష్య చేధనలో టీమిండియా బ్యాటర్స్ రాణించనప్పటికీ.. ఉత్కంఠ పోరులో కేవలం 5 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం ఓటమిపాలైంది.

ఫిబ్రవరి 24న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

23 Feb 2023


2023లో ద్రవ్య విధానం వలన భారతదేశ ఎగుమతులు దెబ్బతినే అవకాశం

గ్లోబల్ డిమాండ్‌ దెబ్బతినడం ప్రారంభమయ్యాక కఠినమైన ద్రవ్య విధానం కారణంగా ఏప్రిల్ 1, 2023 నుండి వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఎగుమతులు దెబ్బతినే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ నెలవారీ ఆర్థిక నివేదికలో 2022లో ప్రపంచ వాణిజ్య వృద్ధి పడిపోయిందని, 2023లో ఈ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని, వాణిజ్య విలువ మరింత తగ్గుతుందని పేర్కొంది.

E3W ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసిన మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ

మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ, మహీంద్రా & మహీంద్రా గ్రూప్ లో ఒక విభాగం. ఇప్పుడు ఈ విభాగం ముంబై, దాని శివారు ప్రాంతాలలో ఆటోరిక్షా స్టాండ్‌లు, ఆటో డ్రైవర్ హోమ్ క్లస్టర్‌లు, జంక్షన్‌ల దగ్గర అనేక ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసింది.

200కి పైగా పుస్తకాలు రాసిన ChatGPT, అమెజాన్ లో అందుబాటులో ఉన్న పుస్తకాలు

కొన్ని కష్టమైన పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిడమే కాదు ChatGPT ఇప్పుడు రచయితగా మారింది. ప్రారంభించిన రెండు నెలల్లోనే, టెక్ పరిశ్రమలో భారీ ప్రకంపనలు సృష్టించింది. AI చాట్‌బాట్, దాని మానవ-వంటి సంభాషణా సామర్థ్యాలతో, కొంతమందితో తమ ఉద్యోగాల కోసం కూడా బెదిరించడం చర్చనీయాంశంగా మారింది.

కంటి సంరక్షణ: ఉప్పునీరు, వేడినీటిలో తడిసిన గుడ్డ, గ్రీన్ టీ బ్యాగ్ కంటికి చేసే మేలు

సర్వేంద్రియాణాం నయనం ప్రధానంఅంటారు. అన్ని అవయవాల్లోకెల్లా కళ్ళు అత్యంత ముఖ్యమైనవని దానర్థం. కళ్ళకు చాలా రకాల ఇన్ఫెక్షన్లు వస్తాయి.

మహేష్ బాబు 28వ సినిమా తప్పుకుంటే రవితేజ సినిమాకు లాభం?

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు 28వ సినిమా రూపుదిద్దుకుంటుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోని సారథి స్టూడియోలో జరుగుతుందని వార్తలు వచ్చాయి.

మెటాలో మరిన్ని ఉద్యోగ కోతలు ఉండే అవకాశం

వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం, మెటాలో నాన్-ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఈసారి ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. గత సంవత్సరం, మెటా తన ఖర్చులను తగ్గించుకోవడానికి,ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవడానికి 13% మంది ఉద్యోగులను అంటే దాదాపు 11,000 మంది ఉద్యోగులను తొలగించింది.

మరో రికార్డుపై కన్నేసిన కింగ్ కోహ్లీ

భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రెండో టెస్టులో అత్యంత వేగంగా 25వేలు పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

భారతదేశంలో విడుదలైన 2023 Triumphస్ట్రీట్ ట్రిపుల్ 765

బ్రిటీష్ తయారీ సంస్థ Triumph మోటార్‌సైకిల్స్ గత ఏడాది నవంబర్‌లో స్ట్రీట్ ట్రిపుల్ 765 R, RS 2023 అప్డేట్ ను లాంచ్ చేసింది. రెండు మోడల్‌లు ఇప్పుడు భారతదేశంలోని బ్రాండ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ట్విన్-పాడ్ LED హెడ్‌లైట్, అప్డేట్ అయిన బాడీ ప్యానెల్‌ల కోసం పదునైన డిజైన్‌తో, మిడిల్‌వెయిట్ స్ట్రీట్‌ఫైటర్లు చూడటానికి ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

శ్రీ గురు రాఘవేంద్ర సహకార బ్యాంకు కుంభకోణం: 1000కోట్ల స్వాహా కేసులో ఒకరు అరెస్టు

రూ.1000 కోట్లకు పైగా పబ్లిక్ డిపాజిట్లను దుర్వినియోగం చేసిన కేసులో శ్రీ గురు రాఘవేంద్ర సహకార బ్యాంక్ వీఆర్ రాజేష్ అనే వ్యక్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం అరెస్టు చేసింది.

గ్యాంగ్ లీడర్ రీ రిలీజ్: ఈసారి కొత్త డేట్ తో వచ్చారు

టాలీవుడ్ లో రిలీజ్ లో సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ రీరిలీజ్ లకు మంచి కలెక్షన్లు వస్తుండడంతో చిత్ర నిర్మాతలు అప్పట్లో సంచలనం సృష్టించిన సినిమాలను థియేటర్లలోకి మళ్ళీ తీసుకొస్తున్నారు.

మూడో టెస్టుపై గురి పెట్టిన టీమిండియా

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భారత్ వర్సస్ ఆస్ట్రేలియా మధ్య ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా 2-0లో అధిక్యంలో నిలిచింది. మార్చి 1 ఈ టెస్టు మ్యాచ్ జరుగుతుంది.

మహారాష్ట్ర: సంజయ్ రౌత్‌పై పరువు నష్టం కేసు; హత్యాయత్నం ఆరోపణలపై రాజకీయ దుమారం

శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) వర్గం ఎంపీ సంజయ్ రౌత్‌పై పరువు నష్టం కేసు నమోదైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే నుంచి తనకు ప్రాణహాని ఉందని నాయకుడు సంజయ్ రౌత్ ఆరోపించిన ఒక రోజు తర్వాత, థానే పోలీసులు అతనిపై పరువు నష్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మైఖేల్ మూవీ, పులి మేక సిరీస్ లతో పాటు ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న కంటెంట్

థియేటర్లలోకి శుక్రవారం కొత్త సినిమాలు రెడీ రావడానికి రెడీ అవుతుంటే, ఇటు ఓటీటీలో సందడి చేయడానికి కంటెంట్ రెడీ ఐపోయింది. సినిమాలు, సిరీస్ లతో ఈ వీకెండ్ ని హాయిగా ఎంజాయ్ చేయండి.

రోహిత్ మరీ లావుగా కనిపిస్తున్నాడు.. మాజీ లెజెండ్ కామెంట్

రోహిత్ శర్మ ఫిట్‌నెస్ గురించి ఎన్నో ఏళ్లుగా చర్చ కొనసాగుతూనే ఉంది. రోహిత్ బ్యాటింగ్ విఫలమైన ప్రతిసారీ రోహిత్ ఫిటె‌నెస్‌పై సోషల్ మీడియాలో ట్రోల్ తెగ వైరల్ అవుతుంటాయి. ఏదో ఒక సందర్భంలో రోహిత్ బాడీ షేమింగ్‌పై వార్తలు వస్తుంటాయి. తాజాగా మాజీ లెజెండ్ కపిల్ రోహిత్ ఫిటెనెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

నథింగ్ స్మార్ట్ ఫోన్ (1) కు ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్‌

నథింగ్ స్మార్ట్ ఫోన్ కు ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్‌ వచ్చింది. ఇందులో OS 1.5 వెర్షన్ బగ్ పరిష్కారాలు, ప్రైవసీ అప్‌గ్రేడ్‌లు, సిస్టమ్ పనితీరులో మెరుగుదల, వాతావరణ యాప్‌తో సహా కొత్త ఫీచర్‌లు ఉన్నాయి. ఈ ఫైల్ సైజ్ 157MB.

టెలివిజన్ ప్రీమియర్ గా వస్తున్న కార్తీ నటించిన సర్దార్

హీరో కార్తీ, డబుల్​ రోల్​లో మెప్పించిన యాక్షన్​ ఎంటర్​టైనర్​ సర్దార్​.. ఫిబ్రవరి 26, ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.

ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో టాప్ 29 స్థానానికి పడిపోయిన గౌతమ్ అదానీ

ఫోర్బ్స్ బ్లూమ్‌బెర్గ్ సూచీల ప్రకారం, గౌతమ్ అదానీ వ్యాపార దిగ్గజం సంపద బుధవారం $44 బిలియన్ల దిగువకు పడిపోయింది. అమెరికన్ షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ గురించి నివేదికను ప్రచురించినప్పటి నుండి అదానీ సంపదలో తగ్గుదల కనిపిస్తుంది.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ శ్రీలంక లెగ్ స్పిన్నర్ హసరంగ సత్తా

హసరంగా టీ20 ఫార్మాట్‌లో సంచలనం సృష్టించాడు. ఐసీసీ టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో శ్రీలంక లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగ సత్తా చాటాడు. అగ్రస్థానంలో కొనసాగుతున్న అప్ఘనిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను హసరంగ వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బుధవారం ఇదే విషయాన్ని ప్రకటించింది.

టెస్టు సిరీస్‌పై కన్నేసిన ఇంగ్లండ్

టెస్టుల్లో ఇంగ్లండ్ సంచలనాత్మక మార్పులను తీసుకొస్తోంది. ప్రధాన కోచ్‌గా బ్రెండన్ మెకల్లమ్, కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ బాధ్యతలను తీసుకున్నప్పటీ నుంచి ఇంగ్లండ్ అద్భుతంగా రాణిస్తోంది.

సికింద్రాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో 200ఏళ్ల నాటి బావి పునరుద్ధరణ

సికింద్రాబాద్‌లోని మౌలా-అలీలోని జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (జెడ్ఆర్‌టీఐ)లో గల 200 సంవత్సరాల పురాతన వారసత్వ మెట్ల బావిని దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది.

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ

ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.

ఫీఛర్ ఫిలిమ్ తో రాని గుర్తింపు షార్ట్ ఫిలిమ్ తో పొందిన షఫి, కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ కు నామినేట్

సినిమా ఇండస్ట్రీ విచిత్రంగా ఉంటుంది. ఏ సినిమా ఎప్పుడు సక్సెస్ అవుతుందో, ఏ ఆర్టిస్టుకు ఎప్పుడు సక్సెస్ వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. ఒక్కోసారి ఆ ఆర్టిస్టు పనైపోయిందనుకుంటే అనూహ్యంగా అద్భుత విజయాలతో ఆకాశంలోకి వెళ్ళిపోతారు.

నేడు సెమీస్‌లో ఆసీస్‌తో తలపడనున్న ఇండియా

మహిళల టీ20 ప్రపంచ కప్ 2023లో నేడు కీలక పోరు జరగనుంది. టీమిండియా మహిళలు సెమీస్‌లో ఆస్ట్రేలియా మహిళలతో తలపడనున్నారు.

భారతదేశంలో భారీగా పెరిగిన మెర్సిడెజ్-AMG G 63 SUV ధర

ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ SUVలలో మెర్సిడెజ్ ఒకటి. మెర్సిడెజ్-AMG G 63 భారతదేశంలో ధర రూ. 75 లక్షలు పెరిగింది. దీని బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇది 4.0-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్, V8 ఇంజన్ తో నడుస్తుంది.

పొద్దున్న వేసుకున్న మేకప్ సాయంత్రానికల్లా తొలగిపోతుంటే పాటించాల్సిన చిట్కాలు

ఉదయం అందంగా రెడీ అయ్యి ఫంక్షన్ కి వెళ్ళి రాత్రి తిరిగి వచ్చేసరికి ముఖమంతా మేకప్ చారికలు కనిపిస్తున్నాయా? అక్కడక్కడా తొలగిపోయిన మేకప్ తో అందవిహీనంగా కనిపిస్తున్నారా? మీ ముఖం మీద మేకప్, ఎక్కువ సేపు నిలవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

నమస్తే ఆంధ్రప్రదేశ్‌: ఏపీలో న్యూస్ పేపర్ ఏర్పాటుపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్

బీఆర్‌ఎస్‌ను ఆంధ్రప్రదేశ్‌‌లో విస్తరింపజేసేందుకు కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌‌లో బీఆర్ఎస్ కోసమే సొంతంగా న్యూస్‌పేపర్‌ పెట్టే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ న్యూస్‌పేపర్‌ పేరును కూడా 'నమస్తే ఆంధ్రప్రదేశ్‌'‌గా ఖారారు చేసినట్లు తెలుస్తోంది.

సన్ రైజర్స్ నూతన కెప్టెన్‌గా మార్క్రమ్

ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ నూతన కెప్టెన్‌గా మార్క్రమ్ ను నియమిస్తున్నట్లు ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం ప్రకటించింది. మాయాంక్ అగర్వాల్ పేరు పరిశీలనలో ఉన్నా చివరికి దక్షిణాఫ్రికా బ్యాటర్ మార్క్రమ్ వైపే సన్ రైజర్స్ యాజమాన్యం మెగ్గు చూపింది. మార్క్రమ్ ఇటీవలే సౌత్ ఆఫ్రికా 20-20 లీగ్‌లో సన్ రైజర్స్ ఈస్టర్‌ జట్టుకు కెప్టెన్‌గా వహించి టైటిల్ అందించిన విషయం తెలిసిందే.

దిల్లీ మద్యం కుభకోణం: సీఎం కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్‌ను ప్రశ్నించిన ఈడీ

దిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్ బిభవ్ కుమార్‌ను గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది.

ఛాంపియన్స్ లీగ్‌లో ఓడిన మాంచెస్టర్ సిటీ

UEFA ఛాంపియన్స్ లీగ్‌లో మాంచెస్టర్ ఓటమిపాలైంది. లిప్ జిగ్ చేతిలో మాంచెస్టర్ సిటీ ఓడిపోయింది. మాంచెస్టర్ సిటీ తరుపున రియాద్ మహ్రెజ్ మొదటి గోల్ చేసి సిటీకి ఆధిక్యాన్ని అందించింది. లీప్‌జిగ్ డిఫెండర్ జోస్కో గ్వార్డియోల్ 70వ నిమిషంలో ఈక్వెలైజర్ గోల్ చేశాడు. సిటీ వారి చివరి రెండు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది.

పాలస్తీనాపై ఇజ్రాయెల్ దళాల దాడి; 11మంది మృతి

పాలస్తీనాలోని ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని ఫ్లాష్‌పాయింట్ నగరంపై ఇజ్రాయెల్ దళాలు బుధవారం జరిపిన దాడిలో కనీసం నలుగురు ముష్కరులు, నలుగురు పౌరులతో సహా 11మంది పాలస్తీనియన్ల చనిపోయారు. 100మందికిపైగా గాయపడినట్లు అధికారులు చెప్పారు.

అదానీ స్టాక్స్‌లో పెట్టి నష్టపోయినవారు ITR ఫైలింగ్ సమయంలో ఇలా చేయండి

గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ జనవరిలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత దారుణమైన పతనానికి గురైంది. 100 బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ కోల్పోవడంతో పెట్టుబడిదారులు భారీ నష్టాలను చవిచూశారు.

రామ్ చరణ్ పుట్టినరోజు కానుక: మగధీర మళ్లీ విడుదల

రామ్ చరణ్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. తాము ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అవకాశం ఈసారి రానే వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన మగధీర థియేటర్లలోకి మళ్ళీ వచ్చేస్తోంది.

గురుగ్రామ్: కరోనాకు భయపడి మూడేళ్లుగా బయటికి రాకుండా ఇంట్లోనే తల్లీకొడుకులు

కరోనాకు భయపడి ఓ మహిళ మూడేళ్లుగా బయటకు రావడం లేదు. తన పదేళ్ల కొడుకుతో కలిసి ఇంటికి తాళం వేసి లోపల ఉంటుంది. కనీసం తన భర్తను కూడా లోపలికి రానివ్వకపోవడం గమనార్హం. హర్యానా గురుగ్రామ్‌లో వెలుగుచూసిన ఈ ఘటన పోలీసు అధికారులు, స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది.

నెక్సాన్, హారియర్, సఫారీ రెడ్ డార్క్ ఎడిషన్స్ లాంచ్ చేసిన టాటా మోటార్స్

స్వదేశీ SUV స్పెషలిస్ట్ టాటా మోటార్స్ భారతదేశంలో నెక్సాన్, హారియర్, సఫారీ రెడ్ డార్క్ ఎడిషన్‌లను లాంచ్ చేసింది. అవి డార్క్ ఎడిషన్ ట్రిమ్‌పై ఆధారపడి ఉంటాయి ధర రూ. 12.35 లక్షలు, రూ. 21.77 లక్షలు, రూ. వరుసగా 22.61 లక్షలు.

ఆవలింతలు అదుపు లేకుండా రావడానికి గల కారణాలు

ఎక్కువగా అలసిపోతే లేదా బోర్ గా ఫీలయితే ఆవలింతలు రావడం జరుగుతుంటుంది. ఐతే ఆవలింతలు అధికంగా అదుపు లేకుండా వస్తూ ఉంటే అది అనారోగ్యానికి కారణం కావచ్చు.

ఇంగ్లండ్ జోరుకు న్యూజిలాండ్ బ్రేకులు వేసేనా..?

టెస్టులో ఇంగ్లండ్ దుమ్ము దులుపుతోంది. న్యూజిలాండ్ పై మొదటి టెస్టులో ఇంగ్లాండ్ 267 ప‌రుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ టెస్టు మ్యాచ్ ముగిసింది. 2008 తర్వాత న్యూజిలాండ్ గడ్డపై ఇంగ్లండ్ తొలి విజయాన్ని అందుకొని చరిత్రను సృష్టించింది.

చిన్నారి వైద్యం కోసం పేరు చెప్పకుండా రూ.11కోట్లు విరాళంగా ఇచ్చిన దాత

అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి చికిత్స నిమిత్తం ఓ గుర్తు తెలియని వ్యక్తి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రూ.11కోట్లను విరాళంగా ఇచ్చాడు. అంత మొత్తం ఇచ్చిన వ్యక్తి అతని పేరు చెప్పకపోవడం గమనార్హం.

మాక్స్‌వెల్, మార్ష్ వచ్చేశాడు, టీమిండియాతో వన్డేలకు ఆస్ట్రేలియా జట్టు ఎంపిక

మార్చి 17 నుంచి టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు ఆ దేశ క్రికెట్ టీం ప్రకటించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఆస్ట్రేలియా ఎంపిక చేసింది.

నాసా, స్పేస్‌ ఎక్స్ సిబ్బంది మిషన్ ప్రయోగం ఫిబ్రవరి 27కి వాయిదా

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సిబ్బందితో ఉన్న మిషన్ క్రూ-6 ప్రయోగాన్ని ఫిబ్రవరి 27కు నాసా, స్పేస్‌ ఎక్స్ వాయిదా వేశాయి. నలుగురు వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి తరలించే ఈ మిషన్ ఫిబ్రవరి 27న టేకాఫ్ అవుతుంది. గతంలో ఈ ప్రయోగం ఫిబ్రవరి 26న జరుగుతుందని ప్రకటించారు. ఫిబ్రవరి 21న సమీక్ష తర్వాత క్రూ-6 ప్రయోగాన్ని వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నారు.

ఆర్ఆర్ఆర్: ఆఖరుసారిగా 200 థియేటర్లలో రీ రిలీజ్ కు రెడీ

ఆర్ఆర్ఆర్ మూవీని అమెరికా జనాలు నెత్తిన పెట్టేసుకున్నారు. ఆల్రెడీ ఎన్ కోర్ ల రూపంలో ఎన్నోసార్లు థియేటర్లలోకి ఆర్ఆర్ఆర్ ను తీసుకొచ్చారు. ఎన్ కోర్ ల ద్వారానే అమెరికా జనాలకు ఎక్కువగా రీచ్ అయ్యింది ఆర్ఆర్ఆర్.

భవిష్యత్‌పై భారత్ ఆశలు కల్పిస్తోంది: బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన బ్లాగ్ 'గేట్స్ నోట్స్'లో భారత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంత పెద్ద సమస్యలు ఉత్పన్నమైనా పరిష్కరించగలదని భారత్ నిరూపించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రపంచం అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్న వేళ, భవిష్యత్‌పై భారత్ ఆశలు కల్పిస్తోందని చెప్పారు.

అవయన దానం గురించి జనాలు నమ్మే ఈ నమ్మకాలను ఇప్పుడే వదిలిపెట్టండి

అవయవ దానం అనేది అత్యంత పవిత్రమైనది. ఒక మనిషిని బ్రతికించడానికి అవయవాలను దానం చేయడమనేది అన్నింటికంటే చాలా ఎక్కువ. ఐతే ఈ అవయవ దానం చుట్టూ అనేక అనుమాలు సాధారణ జనాల్లో ఉన్నాయి. ఆ అనుమానాలే అర్థం లేని నమ్మకాలుగా స్థిరపడ్డాయి.

దేశం కంటే ఐపీఎల్ ముఖ్యం కాదన్న బెన్ స్ట్రోక్స్

ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ రెండేళ్ల తరువాత ఐపీఎల్ అడునున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ఇక నెల కంటే ఎక్కువ సమయం లేదు. ఈ సమయంలో చైన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి షాక్ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఐపీఎల్ సీజన్ మధ్యలో జట్టును విడిచిపెట్టనున్నాడు.

గన్నవరం ఘర్షణ: రాజమండ్రి సెంట్రల్ జైలుకు టీడీపీ నేత పట్టాభి

గన్నవరం ఘటనలో పోలీసుల అదుపులో ఉన్న టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని న్యాయమూర్తి ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు.

ఫిబ్రవరి 23న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

దీప్తిశర్మకు షాక్.. యూపీ వారియర్స్ కెప్టెన్‌గా అలిస్సాహీలీ

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలిస్సా హీలీ ఎంపికైంది. ఈ మేరకు యూపీ వారియర్స్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో దీప్తిశర్మను రూ.2 కోట్ల 60లక్షలకు యూపీ వారియర్స్ దక్కించుకుంది.

ఆర్ఆర్ఆర్ హీరోల హవా: బెస్ట్ యాక్టర్ నామినేషన్లలో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్ సరసన చోటు

ఆర్ఆర్ఆర్ హవా ఇంకా తగ్గలేదనడానికి నిదర్శనంగా ప్రతీరోజూ వస్తున్న ప్రశంసలు ఒక కారణమైతే, అవార్డ్ నామినేషన్లలో దూసుకుపోవడం రెండవ కారణం.

వరుస భూకంపాలతో అల్లాడిపోయిన తజికిస్థాన్‌; విరిగిపడ్డ కొండచరియలు

వరుస భూకంపాలతో తజకిస్థాన్ వణికిపోయింది. తూర్పు తజికిస్థాన్‌లో 6.8, 5.0, 4.6 తీవ్రతలతో వెంట వెంటనే భూమి కంపించడంతో ప్రజలు అల్లాడిపోయారు.