16 Mar 2023
మార్చి 17న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్లో 100 మిలియన్ డౌన్లోడ్లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్లోని ఐటెమ్లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
టీఎస్పీఎస్సీ: మొత్తం 5 పేపర్లు లీకైనట్లు గుర్తించిన సిట్!
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు పేపర్లను కంప్యూటర్ నుంచి అపహరించినట్లు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) గుర్తించినట్లు తెలుస్తోంది.
ఈరోజు ప్రారంభం కానున్న లోటస్ చాక్లెట్ ఓపెన్ ఆఫర్
రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL), రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL) నుండి 26% అదనపు వాటాను కొనుగోలు చేయడానికి లోటస్ చాక్లెట్ వాటాదారులకు సవరించిన ఓపెన్ ఆఫర్ నేడు ప్రారంభం కానుంది, ఇది మార్చి 31న ముగుస్తుంది.
Fake News: నోబెల్ బహుమతికి ప్రధాని మోదీ బలమైన పోటీదారు అని చెప్పలేదు: అస్లే టోజే
భారత పర్యటనలో ఉన్న నోబెల్ శాంతి బహుమతి కమిటీ సభ్యుడు అస్లే టోజే చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
అత్యంత సరసమైన వోక్స్వ్యాగన్ EV టాప్ ఫీచర్లు తెలుసుకుందాం
జర్మన్ తయారీసంస్థ వోక్స్వ్యాగన్ అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ వాహనం ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న వెర్షన్ ID.2allను ప్రపంచ మార్కెట్ల కోసం ప్రదర్శించింది. ఎలక్ట్రిక్ వాహనం బ్రాండ్ కొత్త MEB ఎంట్రీ ప్లాట్ఫారమ్పై ఆధారపడి ఉంటుంది. ID వాహనాలలో డిజైన్ ఫిలాసఫీ ఉంటుంది.
వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీతో యూఏఈ ఆటగాడు ఆసిఫ్ ఖాన్ రికార్డు
కీర్తిపూర్లో నేపాల్తో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2 మ్యాచ్లో యుఏఈ ఆటగాడు ఆసిఫ్ ఖాన్ చరిత్ర సృష్టించారు. వన్డే క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన అసోసియేట్ దేశ ఆటగాడిగా చరిత్రకెక్కాడు.
ఓటీటీ లో రేపు సినిమాల వెల్లువ, ఒక్కరోజే 10కి పైగా సినిమాలు
ఏ భాష సినిమా అయినా ఓటీటీలో చూసే వాళ్ళ సంఖ్య పెరిగింది. అయితే జనరల్ గా థియేటర్ల దగ్గర ఒకే రోజు మూడు నాలుగు సినిమాలు వస్తుంటాయి.
ఆస్ట్రేలియాపై కోహ్లీ సాధించిన రికార్డులపై ఓ లుక్కేయండి
ఇటీవల వన్డేల్లో సూపర్ ఫామ్ ను అందుకున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ లో సత్తా చాటాడు. దీంతో తాజాగా ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్లో ప్రస్తుతం కోహ్లీపై అంచనాలు పెరిగిపోయాయి.
ఆడపిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే తల్లిదండ్రులు చెప్పే మాటలు
ఆడపిల్లలను పెంచడంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. ఆ జాగ్రత్త కొన్ని కొన్ని సార్లు అతి జాగ్రత్తగా మారిపోతూ ఉంటుంది అలాంటి టైం లోనే కొన్ని జాగ్రత్తలు ఆడపిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంటాయి.
ఆర్సీబీకి గట్టి ఎదురుబెబ్బ.. స్టార్ ఆల్ రౌండర్ దూరం
ఐపీఎల్ 2023 ప్రారంభానికే ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ విల్ జాక్స్ గాయం కారణంగా మొత్తం ఐపీఎల్ సీజన్ కు దూరమయ్యాడు. బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డేలో విల్ జాక్స్ గాయపడ్డారు. దీంతో ఇంగ్లాండ్ కు తిరిగి వెళ్లిపోయాడు.
విజయవంతమైన పెట్టుబడిదారులుగా మారిన నటీనటులు
టెలికాం దిగ్గజం టి-మొబైల్ 1.35 బిలియన్ డాలర్ల ఒప్పందంలో కంపెనీని కొనుగోలు చేసింది. మింట్ మొబైల్ను T-మొబైల్ కొనుగోలు తరవాత అందులో ఉన్న ర్యాన్ రేనాల్డ్స్ $300 మిలియన్లకు పైగా నగదు, స్టాక్లను అందుకోనున్నాడు.ఇదే కాకుండా రేనాల్డ్స్ వెల్ష్ ఫుట్బాల్ క్లబ్ రెక్స్హామ్ AFC సహ యజమాని. అతను 2021లో నటుడు రాబ్ మెక్ఎల్హెన్నీతో కలిసి క్లబ్ను స్థాపించాడు.
అరుణాచల్ ప్రదేశ్: కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్; పైలట్ల కోసం గాలింపు
అరుణాచల్ప్రదేశ్లోని బొమ్డిలా సమీపంలో ఇండియన్ ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్ గురువారం కుప్పకూలింది. మండాలా పర్వత ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రేరణ: ఒడిపోయారా? ఐతే మీకు సక్సెస్ వచ్చి తీరుతుంది
పరీక్షలో ఫెయిల్ అయ్యారా? బాధపడకండి, బిజినెస్ చేయాలనుకుంటే మొదటి అడుగులోనే పట్టుతప్పి కిందపడ్డారా? చింతించకండి, సినిమా తీద్దామని ముందుకెళ్తుంటే ఒక్కరు కూడా మీ కథను ఒప్పుకోవట్లేదా? ఆందోళన పడకండి.
సన్ రైజర్స్కి కొత్త జెర్సీ.. కొత్త కెప్టెన్
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఐపీఎల్ 2023 ప్రారంభం కావడానికి సమయం అసన్నమైంది. ఈనెల 31 నుంచి ఐపీఎల్ లీగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే కొన్ని ఫ్రాంచేజీలు ఒకొక్కటిగా తమ కొత్త జెర్సీలను విడుదల చేస్తున్నారు.
ఉత్తర్ప్రదేశ్ హత్య కేసు: ఉమేష్ పాల్పై కాల్పులు జరుపుతున్న సీసీటీవీ వీడియో వైరల్
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగిన ఉమేష్ పాల్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉమేష్పై కాల్పులు జరుపుతున్న దృశ్యాలు రికార్డయిన సీసీటీవీ వీడియో బయటకు వచ్చింది.
రేటింగ్స్ తగ్గిన తర్వాత అమ్మకాల గురించి ఆలోచిస్తున్న ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్
సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ పతనం తర్వాత కొనసాగుతున్న బ్యాంకింగ్ సంక్షోభ ప్రమాదంలో ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ కూడా చేరింది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో దాని షేర్లు 70 శాతానికి పైగా పడిపోయిన తర్వాత ఈ అభివృద్ధి జరిగింది. ఓవర్నైట్ ట్రేడింగ్లో ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ షేర్లు 21 శాతానికి పైగా పడిపోయాయి.
ఆస్కార్ తర్వాత ఎమ్ఎమ్ కీరవాణికి గిఫ్ట్ ఇచ్చిన రిచర్డ్ కార్పెంటర్
ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు ఆస్కార్ అందుకున్న సమయంలో, కార్పెంటర్స్ పాటను గుర్తుచేస్తూ, టాప్ ఆఫ్ ద వరల్డ్ అంటూ ఆస్కార్ వేదిక మీద తన మాటలను పాట రూపంలో చెప్పుకొచ్చాడు కీరవాణి.
వన్డేల్లో ఆస్ట్రేలియాపై రోహిత్కు మెరుగైన రికార్డు
ఇండియా, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ఈనెల 17న ప్రారంభం కాబోతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. మొదటి వన్డేకి రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమవ్వగా..రెండు, మూడు వన్డేలకి అందుబాటులో ఉండనున్నాడు. దీంతో మొదటి వన్డేకి కెప్టెన్ హార్ధిక్ పాండ్యా వ్యవహరించనున్నాడు.
TVS Apache 200 Vs బజాజ్ పల్సర్ NS200 ఏది కొనడం మంచిది
బజాజ్ ఆటో MY-2023 పల్సర్ NS200ని డ్యూయల్-ఛానల్ ABS ఇన్వర్టెడ్ ఫ్రంట్ ఫోర్క్స్ వంటి ముఖ్యమైన అప్డేట్లతో మార్కెట్లోకి వచ్చింది. మార్కెట్లో 200cc విభాగంలో ఇది TVS Apache RTR 200 4Vతో పోటీ పడుతుంది. స్వదేశీ బైక్ తయారీ సంస్థ బజాజ్ ఆటో 2001లో పల్సర్ సిరీస్ ని ప్రవేశపెట్టి భారతదేశంలో మోటార్సైకిల్ విభాగంలో విప్లవాత్మక మార్పులు చేసింది.
దిల్లీ మద్యం పాలసీ కేసు: వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు
దిల్లీ మద్యం పాలసీ కేసు విచారణను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వేగవంతం చేసినట్లు కనిపిస్తోంది. ఈ కేసులో పరిణామాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా ఈ కేసులో విచారించేందుకు ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి నోటీసులు పంపింది.
ట్రావెల్: చరిత్ర మీద ఆసక్తి ఉన్నవాళ్ళు పశ్చిమ బెంగాల్ లోని బుర్ద్ వాన్ వెళ్లాల్సిందే
మన భారతదేశానికి చాలా చరిత్ర ఉంది. మన దేశంలోని ఒక్కో ప్రాంతానికి ఒక్కో చరిత్ర ఉంటుంది. బ్రిటిష్ పాలన కాలం నాటిదైతేనేమీ, మొఘల్స్ కాలం నాటి పరిస్థితులైతేనేమీ, అంతకుముందు పరిస్థితులైతేనేమీ.. తెలుసుకోవాలే గానీ గొప్ప గొప్ప చరిత్రలు మీ కళ్ళ ముందు కనిపిస్తాయి.
మేలో గగన్యాన్ విమాన పరీక్షను ప్రారంభించనున్నఇస్రో
భారతదేశం ప్రతిష్టాత్మక అంతరిక్ష యాత్రలో పాల్గొనబోయే నాలుగు పరీక్షా వాహనాల్లో మొదటిది, గగన్యాన్, మేలో ఇది ప్రారంభమవుతుంది.
ఐపీఎల్కు శ్రేయాస్ అయ్యర్ దూరం.. కెప్టెన్సీ రేసులో ముగ్గురు ఆటగాళ్లు..!
మార్చి 31న ఐపీఎల్ లీగ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2023 సీజన్కు ముందు కోల్కతా నైట్ రైడర్స్కు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ సీజన్కు దూరమయ్యాడు. ఆహ్మదాబాద్లో జరిగిన చివరి టెస్టులో అయ్యర్ గాయపడటంతో బ్యాటింగ్ కూడా దిగలేదు.
కవితకు మళ్లీ నోటీసులు పంపిన ఈడీ; ఈనెల 20న విచారణ
దిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు పంపింది. ఈ నెల 20న తేదీన విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది.
పొన్నంబాలం: సొంత కుటుంబమే విషమిచ్చి చంపాలని చూసింది
తమిళ నటుడు పొన్నంబాలం, చిరంజీవి తనకు చేసిన సాయాన్ని గురించి అందరితో చెప్పుకొచ్చారు. తన కిడ్నీలు రెండు ఫెయిల్ అవడంతో, ఎవరిని సాయమడగాలో తెలియట్లేదట.
WPL: యూపీ వారియర్స్పై కనికా ఆహుజా సునామీ ఇన్నింగ్స్
2023 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఎట్టకేలకు బోణి కొట్టింది. యూపీ వారియర్స్ జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
జైలులో ఉన్న ఆప్ నేత మనీష్ సిసోడియాపై సీబీఐ మరో కేసు
దిల్లీ ప్రభుత్వ ఫీడ్బ్యాక్ యూనిట్ (ఎఫ్బీయూ) కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు మనీష్ సిసోడియాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మరో కేసు నమోదు చేసింది.
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2023: వ్యవసాయ రంగానికి రూ.41,436 కోట్ల కేటాయింపులు
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రూ.41,436 కోట్లతో ఏపీ వ్యవసాయ, అనుబంధ రంగాల బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ.. రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంకింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నామని, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
టీమిండియా, ఆస్ట్రేలియా వన్డే సమరానికి సర్వం సిద్ధం
భారత గడ్డపై టెస్ట్ సిరీస్ను ఓడిన ఆస్ట్రేలియా.. టీమిండియాతో వన్డే సమరానికి సిద్ధమైంది. శుక్రవానం నుంచి మొదటి వన్డేలో టీమిండియాను ఆస్ట్రేలియా ఢీకొట్టనుంది. ఇటీవల ముగిసిన నాలుగు టెస్టుల సిరీస్ని 2-1 భారత్ కైవసం చేసుకుంది. టీమిండియాకు హార్ధిక్ పాండ్యా, ఆస్ట్రేలియాకు స్టీవ్ స్మిత్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు.
క్రెడిట్ సూయిస్ కు సహాయానికి నిరాకరించిన 26% వాటాదారు సౌదీ నేషనల్ బ్యాంక్
క్రెడిట్ సూయిస్ గ్రూప్ అతిపెద్ద వాటాదారు, సౌదీ నేషనల్ బ్యాంక్ (SNB) (1180.SE) అధిపతి స్విస్ బ్యాంక్లో రెగ్యులేటరీ కారణాలతో ఎక్కువ షేర్లను కొనుగోలు చేయబోమని చెప్పారు.
అత్యంత అరుదైన రికార్డుపై కన్నేసిన హిట్మ్యాన్
భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే పోరుకు కౌంట్డౌన్ మొదలైంది. 3 వన్డేల సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ ముంబై వేదికగా శుక్రవారం జరగనుంది. మొదటి వన్డేకి కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండడం లేదు. ఈ వన్డే సిరీస్లో హిట్ మ్యాన్ అరుదైన రికార్డును సొంతం చేసుకొనే అవకాశం ఉంది.
ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసు: తేజస్వి యాదవ్కు మరోసారి సమన్లు జారీ చేసిన సీబీఐ
ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసులో బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ను విచారించేందుకు గురువారం సీబీఐ మరోసారి సమన్లను జారీ చేసింది.
దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్: విశ్వక్ సేన్ సినికాకు ఆస్కార్ క్రేజ్
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా దాస్ కా ధమ్కీ. మార్చ్ 22వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ చిత్రంపై ఇప్పుడు అందరికీ ఆసక్తి పెరిగింది.
Citroen C3 2023లో రెండవసారి పెరిగిన ధర
ఈ జనవరిలో పెరిగిన తర్వాత, Citroen C3 ధర మరోసారి భారతదేశంలో పెరిగింది. ఈసారి అది రూ. 18,000 పెరిగింది. ఇప్పుడు ప్రారంభ ధర రూ. 6.16 లక్షలు. తరచుగా ధరలు పెరగడంతో కస్టమర్లు ఈ వాహనం వైపు ఆకర్షణ తగ్గే అవకాశం ఉంది.
GPT-4 సృష్టి, దాని పరిమితులు గురించి తెలుసుకుందాం
GPT-4, దాని ముందూ వెర్షన్ GPT, GPT-2, GPT-3 వంటివి ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న డేటాను ఉపయోగించి శిక్షణ పొందాయి. డేటా పబ్లిక్గా అందుబాటులో ఉన్న సమాచారం OpenAI ద్వారా లైసెన్స్ పొందిన డేటా ఇందులో ఉంటుంది.
చివరి నిమిషంలో కవిత ట్విస్ట్; విచారణకు రాలేనంటూ ఈడీకి లేఖ
దిల్లీ మద్యం పాలసీ కేసులో మరికొద్ది సేపట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరు హాజరు కావాల్సిన భారత రాష్ట్ర సమితి నాయకురాలు, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కుమార్తె కవిత ఆఖరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చారు.
పుస్తకాలు: ఆనంద్ నీలకంఠన్, ఎమిల్ హెన్రీ, కీర్తనా రామిశెట్టి రచయితలు పుస్తకాలు ఏప్రిల్ లో విడుదల
మద్యాహ్నం పూట ఎండ ఎక్కువగా ఉంటే ఇంట్లోనే కూర్చుని, చల్లగా ఏసీ ఆన్ చేసుకుని చేతిలో ఏదో ఒక పుస్తకాన్ని పెట్టుకుంటే ఆ కిక్కే వేరు.
2030 నాటికి భారతీయుల కోసం స్పేస్ టూరిజం ప్రాజెక్ట్
6 కోట్లు వెచ్చించే స్థోమత ఉంటే అంతరిక్ష యాత్ర చేయవచ్చు. 2030 నాటికి భారతీయులు స్పేస్సూట్లు ధరించి, రాకెట్లపై కూర్చొని అంతరిక్షయానం చేయగలరని ఇస్రో సంస్థ పేర్కొంది.
WPL: హమ్మయ్య.. ఆర్సీబీ గెలిచిందోచ్
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఐదు వరుస పరాజయాలకు చెక్ పెడుతూ ఆర్సీబీ ఎట్టకేలకు ఒక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బుధవారం రాత్రి యూపీ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది.
మలావిలోని ఫ్రెడ్డీ తుఫానులో 225 మంది మరణం
తుఫాను, వరదలు ఆగ్నేయ ఆఫ్రికా దేశం మలావిని కుదిపేసిన తరువాత ఆ దేశ అధ్యక్షుడు ప్రపంచ దేశాల మద్దతు కోసం విజ్ఞప్తి చేశారు. తుఫాను మూడు వారాల కంటే తక్కువ వ్యవధిలో రెండవసారి ఆఫ్రికన్ తీరంలో విధ్వంసం సృష్టించింది. రెండు వారాల జాతీయ సంతాప దినాలుగా అధ్యక్షుడు లాజరస్ చక్వేరా ప్రకటించారు మా వద్ద ఉన్న వనరుల కంటే ఇక్కడ మేము ఎదుర్కొంటున్న విధ్వంసం స్థాయి చాలా ఎక్కువని ఆయన తెలిపారు.
AP Budget Hghlights: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్-2023-24 హైలెట్స్; వార్షిక పద్దు రూ.2,79,279కోట్లు
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2023-24ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,79,279కోట్ల వార్షిక బడ్జెట్ను సమర్పించారు. బడ్జెట్లో కీలక కేటాయింపులు ఇలా ఉన్నాయి.
ఆసీస్తో జరిగే వన్డే సిరీస్ దూరమైన శ్రేయాస్ అయ్యర్.. క్లారిటీ ఇచ్చిన ఫీల్డింగ్ కోచ్
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు ముందు టీమిండియాకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్లో జరిగిన నాలుగో టెస్టులో గాయపడిన టీమిండియా స్టార్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్.. ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్కి దూరమయ్యాడు.
తెలంగాణలో మళ్ళీ మొదలైన పోస్టర్ల గొడవ, ఈసారి బీఎల్ సంతోష్ పై బీఆర్ఎస్ గురి
ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ఎమ్మెల్సీ కవిత, ఈరోజు మళ్ళీ ఈడీ ముందు హాజరు అవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో బీపేజీ పై పోస్టర్ల తో గురి పెట్టింది బీఆర్ఎస్.
'నాటు నాటు' పాటకు స్టేప్పులేసిన సురేష్ రైనా, హర్భజన్
చిత్రం ఆర్ఆర్ఆర్లోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు లభించింది. ఎంతోమంది ఈ పాటకు స్టెప్పులు లేస్తూ నెట్టింట్లో సందడి చేస్తున్నారు. తాజాగా ఈ లిస్టులోకి టీమిండియా క్రికెటర్లు కూడా చేరారు.
ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్షిప్లో పీవీ సింధుకి చేదు అనుభవం
బర్మింగ్హామ్లో బుధవారం జరిగిన ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పీవీ సింధుకు చేదు అనుభవం ఎదరైంది. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, రెండు సార్లు ఒలంపిక్ మెడలిస్ట్ అయిన పీవీ సింధు తొలి రౌండ్లోనే నిరాశ పరిచింది.
ఆయుర్వేద మందులు హాని చేస్తాయా? ఆయుర్వేదంపై జనాల్లో ఉన్నా అపోహలు
భారతదేశ సంస్కృతిలో ఆయుర్వేదం కూడా ఒక భాగం. ఎందరో మహర్షులు ఆయుర్వేద జ్ఞానాన్ని భారతావనికి అందించారు. 5వేల యేళ్ళ క్రితం నుండి ఆయుర్వేదం వాడుకలో ఉంది.
హీరోగా పరిచయం అవుతున్న యాంకర్ సుమ కొడుకు, ఫస్ట్ లుక్ రిలీజ్
తెలుగు యాంకర్ అనే మాటకు మరో అర్థంగా మారిపోయిన యాంకర్ సుమ, తన కొడుకును సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతుంది. యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల.. హీరోగా మారుతున్నాడు.
నేడు మళ్లీ ఈడీ విచారణకు హాజరు కానున్న ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి ప్రశ్నించనున్నారు. ఈ కేసులో
Aadhaar: ఆన్లైన్లో ఆధార్ ఆప్డేట్ మూడు నెలలు ఫ్రీ
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారత్ విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ ఆధార్ కార్డు వినియోగిస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఆధార్ను మూడు నెలల పాటు అంటే ఈ ఏడాది జూన్ 14 వరకు ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చని బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
తెలుగు రాష్ట్రాలకు హై స్పీడ్ రైలు కారిడార్; 4గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖకు!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో హైస్పీడ్ రైలు పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన కసరత్తును ఇప్పటికే రైల్వైశాఖ మొదలు పెట్టింది. ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
దసరా ట్రైలర్: షాకిస్తున్న ఇతర భాషల వ్యూస్
నేచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమాపై అటు అభిమానుల్లోనే కాదు ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ ఆసక్తి ఎక్కువగా ఉంది. నాని కెరీర్ లో మొదటి పాన్ ఇండియా చిత్రం కావడం, ఇంకా ఇంతకుముందెన్నడూ లేనంతగా ప్రమోషన్లు చేస్తుండడంతో దసరా మీద ఆసక్తి ఎక్కువైంది.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ రేసులో ఉన్నదెవరు..?
మార్చి 31 నుంచి ఐపీఎల్ లీగ్ ప్రారంభం కానుంది. 2023 ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచేజీ నూతన కెప్టెన్ను ఎంపిక చేసింది. రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ గతేడాది చివర్లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో 2023 ఐపీఎల్ సీజన్కు దూరమయ్యాడు.
నేడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ -2023; అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బుగ్గన రాజేంద్రనాథ్
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ -2023ను గురువారం ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రాష్ట్ర పద్దును అసెంబ్లీలో ప్రతిపాదించనున్నారు. శాసన మండలిలలో డిప్యూటీ సీఎం అంజాద్ పాషా బడ్జెట్ను చదవనున్నారు.
మార్చి 16న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్లో 100 మిలియన్ డౌన్లోడ్లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్లోని ఐటెమ్లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
15 Mar 2023
హోండా షైన్ 100 లేదా బజాజ్ ప్లాటినా 100 ఏది కొంటే బాగుంటుంది
జపనీస్ వాహన తయారీ సంస్థ హోండా తన షైన్ 100 కమ్యూటర్ మోటార్సైకిల్ను భారతదేశంలో విడుదల చేసింది. దీని డెలివరీలు మేలో ప్రారంభమవుతాయి. మార్కెట్లో, ఇది బజాజ్ ఆటో ప్లాటినా 100 మోడల్తో పోటీపడుతుంది.
నాగ చైతన్య కస్టడీ సినిమా టీజర్ విడుదల
నాగ చైతన్య తెరపై తెలుగు-తమిళం ద్విభాషా చిత్రం కస్టడీలో కనిపించనున్నారు. మానాడుతో శింబుకి అద్భుతమైన హిట్ ఇచ్చిన వెంకట్ ప్రభు పోలీస్ నేపధ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది.
బెలూన్ డైలేషన్: గర్భంలో ఉన్న పిండానికి గుండె ఆపరేషన్ చేసిన వైద్యులు
గర్భంలో ఉన్న పిండానికి ఆపరేషన్ చేయడమనేది చిన్న విషయం కాదు, కానీ దాన్ని చేసి చూపించారు ఢిల్లీకి చెందిన ఎయిమ్స్ వైద్యులు. మార్చ్ 14వ తేదీన ఈ ఆపరేషన్ జరిగింది.
WTC: వికెట్ కీపర్ ఎంపికపై డైలామాలో టీమిండియా
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిఫ్లో టీమిండియా-ఆస్ట్రేలియా జూన్ 7న తలపడనున్నాయి. ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను 2-1తో టీమిండియా ఓడించింది.
మేనిఫెస్టోలోని 98.6శాతం హామీలను నెరవేర్చాం: అసెంబ్లీలో సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై సీఎం జగన్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో 11.28 ఆర్థిక వృద్ధి రేటు నమోదవుదైందని సీఎం జగన్ పేర్కొన్నారు. మేనిఫెస్టోలోని 98.6శాతం హామీలను నెరవేర్చినట్లు ప్రకటించారు.
కేంద్రం డీఏ పెంపును నేడు ప్రకటించే అవకాశం
50 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (DA)పై 4% పెంపుదలని షెడ్యూల్ క్యాబినెట్ సమావేశంలో కేంద్రం ప్రకటించే అవకాశం ఉంది, అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి అధికారిక నోటీసును జారీ చేయలేదు.
జమ్ముకశ్మీర్ పోలీసుల అదుపులో లష్కరే తోయిబా ఉగ్రవాది; 24 గంటల్లో రెండో అరెస్ట్
జమ్ముకశ్మీర్ పోలీసులు బుధవారం బారాముల్లాలో లష్కరే తోయిబా (ఎల్ఇటీ) ఉగ్రవాదిని అరెస్టు చేశారు. గత 24గంటల్లో బారాముల్లాలో ఇది రెండో అరెస్ట్ అని పోలీసులు వెల్లడించారు.
ఐసీసీ ర్యాంకింగ్స్లో సత్తా చాటిన విరాట్ కోహ్లీ
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అదరగొట్టిన భారత ఆటగాళ్లు ఐసీసీ ర్యాంకింగ్స్ లో సత్తా చాటారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో సెంచరీతో సత్తా చాటిన టీమిండియా స్టార్ ఆటగాడు కింగ్ కోహ్లీ (705) ఏకంగా ఎనిమిది స్థానాలు మెరుగుపర్చుకున్నాడు.
ఇళయరాజా పాటలను రీమిక్స్ చేస్తోన్న టాలీవుడ్, రవితేజ కూడా చేరిపోయాడు
పాత పాటలను రీమిక్స్ చేయడం టాలీవుడ్ లో కొత్తేమీ కాదు, కానీ వరుసగా రీమిక్స్ పాటలు రావడమే చెప్పుకోవాల్సిన విషయం. అది కూడా ఇళయరాజా పాటలే రీమిక్స్ కావడం మరో అంశం.
ప్రపంచవ్యాప్తంగా GPT-4 ఉపయోగిస్తున్న సంస్థలు
OpenAI తన కొత్త పెద్ద భాషా మోడల్ (LLM), GPT-4ను పరిచయం చేసింది. BAR, LSAT, GRE వంటి పరీక్షలలో GPT-4 రాణించింది. OpenAI అందించిన డేటా ప్రకారం, LLM యూనిఫాం బార్ పరీక్షలో 298/400 (అంచనా 90వ పర్సంటైల్), LSATలో 88వ పర్సంటైల్, GRE వెర్బల్లో 99వ పర్సంటైల్ స్కోర్ చేసింది. ఇది GPT-3.5 పనితీరు కంటే ముందుంది.
వెనుదిరిగిన పోలీసులు; గ్యాస్ మాస్క్ ధరించి బయటకు వచ్చిన ఇమ్రాన్ ఖాన్
తోషాఖానాతో పాటు జడ్జిని బెదిరించిన కేసులో లాహోర్ పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు వెనుదిరిగారు. అనంతరం తన మద్దతుదారులతో మాట్లాడాటానికి ఇమ్రాన్ జమాన్ పార్క్ ఇంటి నుంచి బయటికు వచ్చారు. ఆయిన గ్యాస్ మాస్క్ ధరించి బయటకు రావడం గమనార్హం.
SA vs WI : సౌతాఫ్రికాపై ప్రతీకారం తీర్చుకోవడానికి వెస్టిండీస్ సిద్ధం
ఇటీవల వెస్టిండీస్ను సౌతాఫ్రికా టెస్టు సిరీస్లో 2-0తో ఓడించింది. వన్డేలో కూడా వెస్టిండీస్ను ఓడించి సత్తా చాటాలని సౌతాఫ్రికా భావిస్తోంది. టెస్టు సిరీస్లో ఓడిన వెస్టిండీస్ ఎలాగైనా సౌతాఫ్రికా ప్రతీకారం తీర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
2023లో వన్డేలకు ఐదుగురు స్టార్ ఆటగాళ్లు గుడ్బై..!
ఇటీవల కాలంలో ప్రపంచ క్రికెట్లో సీనియర్లుగా మారుతున్న స్టార్ ఆటగాళ్లు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి మిగతా ఫార్మాట్లో రాణించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ స్టార్ ఆటగాళ్ల దృష్టి ఫ్రాంఛేజీల వైపు మళ్లుతోంది. 2023 వన్డే ప్రపంచ కప్ ఆడి రిటైరయ్యే యోచనలో ఆ స్టార్ ఆటగాళ్లు ఉన్నట్లు సమాచారం.
ప్రేరణ: చిన్న పనులను పెద్దగా చూసినపుడే పెద్ద స్థానం అందుకోగలం
చిన్న చిన్న పనులను చిన్నచూపు చూడకుండా ముందుకు సాగినపుడే పెద్ద విజయం మీ సొంతమవుతుంది. అవును, చిన్నది నీ జేబులోకి రాకముందు పెద్దదాన్ని నువ్వు అందుకోలేవు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పేరు వాడుకొని రూ.కోట్లు కాజేసిన మాజీ రంజీ ప్లేయర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వాడుకొని ఓ వక్తి దాదాపు 60కంపెనీల నుంచి రూ.3 కోట్ల వరకు కాజేశాడు. తాజాగా తనను తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పరిచయం చేసుకుని రూ.12 లక్షల వరకు టోపీ పెట్టాడు. తర్వాత మోసపోయానని గమనించిన బాధితుడు పోలీసుల ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం 25 నెలల కనిష్ట స్థాయికి తగ్గింది
ఫిబ్రవరి 2023లో టోకు ధరలు 3.85% పెరిగాయి, ఇది 25 నెలల్లో కనిష్ట స్థాయికి చేరుకుంది, కమోడిటీ ధరలను తగ్గించడంతోపాటు, గణనీయంగా, బేస్ ఎఫెక్ట్ ( WPI అధిక విలువ) కారణంగా ఇది జరిగింది.
అందం: అఫారెస్ట్ గ్రీన్ కాఫీ టోనింగ్ ఫేస్ మిస్ట్ రివ్యూ
మీ ముఖాన్ని తొందరగా శుభ్రం చేసుకుని అందంగా కనిపించాలని మీరనుకుంటే మీ హ్యాండ్ బ్యాగ్ లో టోనింగ్ ఫేస్ మిస్ట్ ఉండాల్సిందే. దీని కారణంగా మీ చర్మ పీహెచ్ బ్యాలన్స్ సరిగ్గా ఉంటుంది.
త్వరలో లాంచ్ కానున్న కియా EV9 స్టైలిష్ ఎలక్ట్రిక్ SUV
దక్షిణ కొరియా తయారీసంస్థ కియా మోటార్స్ తన EV9 SUV వెర్షన్ను ప్రకటించింది. ఇది 2024 ప్రారంభంలో అందుబాటులోకి వస్తుంది. కారు ఫ్యూచరిస్టిక్ డిజైన్ తో, మూడు వరుసల సీట్లతో ఉన్న విశాలమైన క్యాబిన్ ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్ తో నడుస్తుంది.
ఐసీసీ ర్యాకింగ్స్లో మళ్లీ నంబర్ వన్గా రవిచంద్రన్ అశ్విన్
అంతర్జాతీయ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ను తాజాగా అంతర్జాతీయ కౌన్సిల్ విడుదల చేసింది. గతంలో టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తో పాటు ఇంగ్లాండ్ స్పీడ్ స్టార్ అండర్సన్ ఇద్దరు 859 పాయింట్లతో సమానంగా నిలిచారు.
తోపుడు బండిపై సమోసాలతో రోజుకి 12 లక్షల సంపాదిస్తున్న దంపతులు
సమోసా సింగ్ అనే కంపెనీ వందల కోట్ల సమోసా వ్యాపారాన్ని అభివృద్ది చేసింది. నిధి సింగ్, శిఖర్ వీర్ సింగ్ దంపతులు ఈ వ్యాపారాన్ని ప్రారంభించి ఇప్పుడు లక్షల టర్నోవర్ వ్యాపారంగా మార్చారు.
'పాత ఎక్సైజ్ పాలసీ'ని మరో 6నెలలు పొడిగించిన దిల్లీ ప్రభుత్వం
'పాత ఎక్సైజ్ పాలసీ'ని దిల్లీ ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు పొడిగించింది. ఈ లోగా కొత్త ఎక్సైజ్ పాలసీని సిద్ధం చేయాలని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది.
సంతోష్ శోభన్ నటించిన డిజాస్టర్ మూవీ శ్రీదేవి శోభన్ బాబు ఓటీటీ రిలీజ్ పై అప్డేట్
కుర్ర హీరో సంతోష్ శోభన్, బాక్సాఫీసు మీద ఒంటి చేత్తో పోరాటం చేస్తున్నాడనే చెప్పాలి. వరుసపెట్టి సినిమాలను వదులుతూనే ఉన్నాడు సంతోష్ శోభన్.
నల్ల సముద్రంపై అమెరికా నిఘా డ్రోన్ను కూల్చేసిన రష్యా ఫైటర్ జెట్లు
అమెరికా నిఘా డ్రోన్ ప్రొపెల్లర్ను నల్ల సముద్రంపై రష్యా ఫైటర్ జెట్ ఢీకొట్టింది. దీంతో తమ MQ-9 రీపర్ డ్రోన్ నీటిలో కూలిపోయినట్లు అగ్రరాజ్యం తెలిపింది
భారత్తో జరిగే వన్డేలకు ఆస్ట్రేలియా జట్టు ఇదే.. కెప్టెన్గా స్మిత్
భారత్తో త్వరలో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. టీమిండియా చేతిలో టెస్టు సిరీస్ను కోల్పోయిన ఆస్ట్రేలియా ప్రస్తుతం వన్డే సమరానికి సిద్ధమైంది. టెస్టుల్లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. పాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో స్టీవ్ స్మిత్ కి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది.
మీ కలలో కనిపించిందే నిజ జీవితంలో జరిగిందా? అది డేజా రీవ్ కావచ్చు
కలలో కనిపించినవి నిజంగా జరుగుతాయా అని మీరు ఆలోచించే ముందు, మీకెప్పుడైనా కలలో కనిపించిన సీన్, నిజంగా జరిగినట్లు అనిపించిందేమో గుర్తు చేసుకోండి.
OpenAI GPT-3.5 కంటే మెరుగ్గా ఉన్న కొత్త GPT-4 మోడల్
OpenAI సరికొత్త శక్తివంతమైన GPT-4 మల్టీమోడల్ LLMలో మెరుగైన ఫీచర్లు ఉన్నాయి. ఇది టెక్స్ట్లు, ఇమేజ్లు రెండింటికీ సమాధానాన్ని ఇవ్వగలదు.
ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్: లాలూ, రబ్రీ దేవి, మిసా భారతికి రూ.50వేల పూచీకత్తుపై బెయిల్
ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్తో పాటు ఆయన భార్య రబ్రీ దేవి, కుమార్తె మిసా భారతికి దిల్లీ రూస్ అవెన్యూ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు తదుపరి విచారణ మార్చి 29న జరగనుంది.
గంటల వ్యవధిలో అమ్ముడుపోయిన విశాఖ వన్డే మ్యాచ్ టికెట్లు
భారత్-ఆస్ట్రేలియా మధ్య ఈనెల 19న విశాఖలోని వైఎస్సార్ ఏసీఏ ఏడీసీఏ స్టేడియంలో రెండో వన్డే జరగనుంది. దీనికి సంబంధించిన వన్డే టికెట్లు గంటల వ్యవధిలోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాడు.
ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్షిప్స్లో లక్ష్యసేన్, ప్రణయ్ శుభారంభం
ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత స్టార్స్ లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్ శుభారంభాన్ని అందించారు. మంగళవారం బర్మింగ్ హామ్ లో జరిగిన పురుషుల సింగ్స్ లో లక్ష్యసేన్ తొలి రౌండ్లోనే సంచలన విజయాన్ని అందుకున్నాడు.
ఢిల్లీ మద్యం కుంభకోణం: ఈడీ సమన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత; ఈనెల 24న విచారణ
దిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లను సవాల్ చేస్తూ అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకురాలు కె కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
World Boxing Championships: మహిళల బాక్సింగ్ పోరుకు వేళాయే
ప్రతిష్టాత్మక మహిళల సీనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీలకు వేళయైంది. న్యూఢిల్లీలోని కేడి జాదవ్ ఇండోర్ స్టేడియంలో ఈ మెగా ఈవెంట్కు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తియ్యాయి. మూడోసారి ఈ పోటీల నిర్వహణకు భారత్ సిద్ధమైంది.
కఫీఫీ అంటూ సరికొత్త పాటతో ముందుకొచ్చిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి
నాగశౌర్య, మాళవిక హీరో హీరోయిన్లుగా రూపొందిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి చిత్రం మార్చ్ 17వ తేదీన రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలో నుండి నాలుగవ పాటను రిలీజ్ చేసారు.
'భారతదేశంలో అరుణాచల్ అంతర్భాగం'; చైనా సరిహద్దును మెక్మహన్ రేఖగా గుర్తిస్తూ అమెరికా తీర్మానం
అరుణాచల్ప్రదేశ్-చైనా మధ్య సరిహద్దుపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. అరుణాచల్ప్రదేశ్ భారత్లో అంతర్భాగమని అగ్రరాజ్యం పేర్కొంది.
మైఖేల్ వాన్కు వసీం జాఫర్ అదిరిపోయే కౌంటర్
టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరు సోషల్ మీడియా వేదికగా అనేక సార్లు మాటల యుద్దానికి దిగారు.
ఉస్తాద్ భగత్ సింగ్ కథా మార్పులపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టిన హరీష్ శంకర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ తో హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా రూపొందుతున్న అందరికీ తెలిసిందే. ఈ సినిమాను తమిళ చిత్రమైన తెరీ నుండి రీమేక్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి.
2023లో భారతదేశంలో 10 లక్షల పైగా వలసేతర వీసాలను ప్రాసెస్ చేయనున్న అమెరికా
ఈ ఏడాది భారతదేశంలో 10 లక్షలకు పైగా వలసేతర వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేయాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది. 2017, 2018 ఆర్థిక సంవత్సరాల్లో భారతీయులకే 10 లక్షలకు పైగా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలు జారీ చేసినట్లు యుఎస్ ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
ట్రావెల్: పోర్చుగల్ నుండి గుర్తుగా తీసుకురావాల్సిన వస్తువులు
పోర్చుగల్ దేశంలో విభిన్న సంస్కృతులు మిమ్మల్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఆసక్తిని పెంచుతాయి. అత్యంత సుందర ప్రదేశాలు, నోరూరించే వంటకాలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి.
లండన్లో రాహుల్ వ్యాఖ్యలపై పార్లమెంట్లో గందరగోళం; క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
భారతదేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లండన్లో చేసిన ప్రసంగంపై పార్లమెంట్ లో బుధవారం కూడా ప్రతిపక్షాలు- అధికార పార్టీ బీజేపీ మధ్య రగడ కొనసాగుతోంది.
మెరుగైన స్టైలింగ్ తో మార్కెట్లోకి వచ్చిన 2024 మెర్సిడెస్-బెంజ్ GLC కూపే
జర్మన్ వాహన తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ తన GLC కూపే 2024 వెర్షన్ను ప్రపంచ మార్కెట్లలో ప్రకటించింది. ఇది భారతదేశానికి త్వరలోనే వస్తుంది. ప్రీమియం వాహనం డిజైన్తో టెక్-ఆధారిత సౌకర్యాలతో ఉన్న సంపన్నమైన క్యాబిన్, గరిష్టంగా 255hp శక్తిని ఉత్పత్తి చేసే తేలికపాటి-హైబ్రిడ్ పవర్ట్రెయిన్ తో నడుస్తుంది.
కేబుల్ బ్రిడ్జి దగ్గర వాహనాలు పార్కింగ్ జరిమానా తప్పదు
హైదరాబాద్ : ఇకపై దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద సెల్ఫీ తీసుకోవడానికి వాహనాలను పార్కింగ్ చేస్తే ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధించనున్నారు. కొంతమంది బ్రిడ్జిపై కారు లేదా బైక్ పార్కింగ్పై సెల్ఫీలు దిగుతున్నారు. దీని వల్ల రోడ్డుపై వెళ్లే వాహనదారులకు ఇబ్బంది కలుగుతోంది.
Realme C33 2023 v/s POCO C55 ఏది కొనడం మంచిది
భారతదేశంలో బడ్జెట్ స్మార్ట్ఫోన్ మార్కెట్ ఎక్కువ, అందుకే బ్రాండ్లు ప్రతిసారీ కొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. Realme తన తాజా స్మార్ట్ఫోన్గా C33 2023ని పరిచయం చేసింది. మార్కెట్లో అదే ధరలో ఉన్న POCO C55తో పోటీపడుతుంది.
ప్లాస్టిక్ సంచిలో కుళ్లిపోయిన మహిళ మృతదేహం; కుమార్తెపైనే అనుమానాలు
ముంబయిలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. లాల్బాగ్ ప్రాంతంలో 53 ఏళ్ల మహిళ మృతదేహం ప్లాస్టిక్ సంచిలో లభ్యమైంది. మృతదేహాన్ని నెలల తరబడి గదిలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతురాలు కుమార్తెపై అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
బరువు తగ్గాలని కార్బోహైడ్రేట్లు తక్కువ తింటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో తెలుసుకోండి
లావుగా ఉన్న వాళ్ళు బరువు తగ్గాలని కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్న ఆహారాలని తీసుకుంటారు. దీనివల్ల బరువు తగ్గడం నిజమే అయినా కానీ, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
రికార్డు బద్దలు కొట్టిన ఎర్లింగ్ హాలాండ్
ఎతిహాద్లో జరిగిన UEFA ఛాంపియన్స్ లీగ్ రౌండ్ 16 సెకండ్-లెగ్ టైలో మాంచెస్టర్ సిటీ సత్తా చాటింది. లీప్జిగ్ను 7-0తేడాతో మాంచెస్టర్ సిటీ చిత్తు చేసింది. దీంతో సిటీ క్వార్టర్ ఫైనల్ కు అర్హత సాధించింది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో విజృంభిస్తున్న బ్రంట్, మాథ్యూస్
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్ గుజరాత్ జెయింట్స్ను ఓడించి వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. ముంబై ఇండియన్స్ తరుపున నాట్ స్కివర్-బ్రంట్, హేలీ మాథ్యూస్ మూడు కీలక వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు.
రణరంగంగా మారిన ఇమ్రాన్ ఖాన్ ఇల్లు; మద్దతుదారులపై బాష్పవాయువు ప్రయోగం
తోషాఖానాతో పాటు జడ్జిని బెదిరించిన కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు, బలగాల మధ్య పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ కార్యకర్తల మధ్య కొన్ని గంటలుగా ఘర్షణ వాతావరణం నెలకొంది.
దసరా ట్రైలర్: పుష్పతో పోలికపై స్పందించిన నాని
నేచురల్ స్టార్ నాని, దసరా సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాడు. తన కెరీర్లో మొదటి పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన దసరా ప్రమోషన్లను ఇండియా లెవెల్లో చేస్తున్నాడు.
WPL : వరుసగా ముంబై ఐదో విజయం.. ప్లేఆఫ్లో బెర్త్ ఖరారు
ప్రత్యర్థితో సంబంధం లేకుండా ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో దూసుకెళ్తుతోంది. మహిళల ప్రీమియర్ లీగ్లో ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ విజయఢంకా మోగించింది. ముంబై ఇండియన్స్ 10 పాయింట్లతో సగర్వంగా ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. దీంతో మరో మూడు మ్యాచ్లు మిగిలుండగానే ప్లేఆఫ్స్లో అడుగుపెట్టింది.
ఈ వారం ఓటీటీలో, థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఆసక్తికర సినిమాలు
ఈ వారం సినిమా ప్రేమికులకు మంచి ఆసక్తిగా ఉండనుంది. వేరు వేరు జోనర్లలో రూపొందిన సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. అలాగే విభిన్నమైన కంటెంట్ ఓటీటీలోకి వచ్చేస్తోంది.
మార్చి 26న మహారాష్ట్రలో బీఆర్ఎస్ బహిరంగ సభ; సీఎం కేసీఆర్ హాజరు
మహారాష్ట్రలోని కందర్ లోహాలో మార్చి 26న జరిగే భారీ బహిరంగ సభకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారని పార్టీ ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా మహారాష్ట్రలో పెద్ద ఎత్తున నాయకులు, ప్రజలు బీఆర్ఎస్లో చేరనున్నారు.
మార్చి 15న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్లో 100 మిలియన్ డౌన్లోడ్లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్లోని ఐటెమ్లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.